ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అల వైకుంఠపురములో’ ఆ అంచనాల్ని మించిపోయి బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయం సాధించింది. రూ.128 కోట్లతో ‘రంగస్థలం’ సినిమా నెలకొల్పిన ‘నాన్ బాహుబలి’ రికార్డును బద్దలు కొట్టేసింది. రూ.140 కోట్లకు పైగా షేర్తో కొత్త రికార్డు నెలకొల్పింది.
‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి మరో భారీ చిత్రం పోటీలో ఉండగా ఈ రికార్డును అందుకోవడం అంటే మాటలు కాదు. ఐతే వెండితెర మీదే కాదు.. ఈ సినిమా బుల్లితెర మీదా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక్కడ ‘బాహుబలి’నే కాదు.. అన్ని సినిమాలనూ దాటేసింది.
ఆల్ టైం రికార్డును చెప్పుకోదగ్గ తేడాతో దాటేసి కొత్త టీఆర్పీ రికార్డు నెలకొల్పింది. ఇటీవలే జెమిని టీవీలో ‘అల వైకుంఠపురములో’ను ప్రిమియర్గా వేయగా.. రికార్డు స్థాయిలో 29.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది బుల్లితెరపై ఒక సంచలనమే.
చాలా ఏళ్ల కిందట అక్కినేని నాగార్జున సిినిమా ‘శ్రీరామదాసు’ 24 రేటింగ్తో అప్పట్లో రికార్డు నెలకొల్పింది. దాన్ని ఇంత వరకు ఏ సినిమా అందుకోలేదు. ‘బాహుబలి’ సైతం 22 రేటింగ్కు పరిమితం అయింది. ‘టెంపర్’ 23.5 రేటింగ్తో రెండో స్థానంలో ఉండగా.. ఈ ఏడాది మార్చిలో ప్రసారమైన మరో సంక్రాంతి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ 23.4తో దానికి చేరువగా వచ్చింది. మూడో స్థానాన్ని చేరుకుంది.
ఐతే లాక్ డౌన్ వల్ల జనాలు పూర్తిగా ఇళ్లకు పరిమితం అయిన సమయంలో ఆ చిత్రానికి ఆ రేటింగ్ రాగా.. ఇటీవలే ప్రసారమైన ‘అల వైకుంఠపురములో’ దాన్ని దాటి ఆల్ టైం రికార్డును పెద్ద తేడాతో బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది. థియేటర్లలో విరగాడి.. ఆపై రెండు డిజిటల్ ఫ్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉన్న సినిమాకు ఇప్పుడు టీవీలో ఈ స్థాయి రేటింగ్ రావడం కచ్చితంగా అద్భుతమే.
This post was last modified on August 27, 2020 2:13 pm
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…