ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అల వైకుంఠపురములో’ ఆ అంచనాల్ని మించిపోయి బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయం సాధించింది. రూ.128 కోట్లతో ‘రంగస్థలం’ సినిమా నెలకొల్పిన ‘నాన్ బాహుబలి’ రికార్డును బద్దలు కొట్టేసింది. రూ.140 కోట్లకు పైగా షేర్తో కొత్త రికార్డు నెలకొల్పింది.
‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి మరో భారీ చిత్రం పోటీలో ఉండగా ఈ రికార్డును అందుకోవడం అంటే మాటలు కాదు. ఐతే వెండితెర మీదే కాదు.. ఈ సినిమా బుల్లితెర మీదా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక్కడ ‘బాహుబలి’నే కాదు.. అన్ని సినిమాలనూ దాటేసింది.
ఆల్ టైం రికార్డును చెప్పుకోదగ్గ తేడాతో దాటేసి కొత్త టీఆర్పీ రికార్డు నెలకొల్పింది. ఇటీవలే జెమిని టీవీలో ‘అల వైకుంఠపురములో’ను ప్రిమియర్గా వేయగా.. రికార్డు స్థాయిలో 29.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది బుల్లితెరపై ఒక సంచలనమే.
చాలా ఏళ్ల కిందట అక్కినేని నాగార్జున సిినిమా ‘శ్రీరామదాసు’ 24 రేటింగ్తో అప్పట్లో రికార్డు నెలకొల్పింది. దాన్ని ఇంత వరకు ఏ సినిమా అందుకోలేదు. ‘బాహుబలి’ సైతం 22 రేటింగ్కు పరిమితం అయింది. ‘టెంపర్’ 23.5 రేటింగ్తో రెండో స్థానంలో ఉండగా.. ఈ ఏడాది మార్చిలో ప్రసారమైన మరో సంక్రాంతి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ 23.4తో దానికి చేరువగా వచ్చింది. మూడో స్థానాన్ని చేరుకుంది.
ఐతే లాక్ డౌన్ వల్ల జనాలు పూర్తిగా ఇళ్లకు పరిమితం అయిన సమయంలో ఆ చిత్రానికి ఆ రేటింగ్ రాగా.. ఇటీవలే ప్రసారమైన ‘అల వైకుంఠపురములో’ దాన్ని దాటి ఆల్ టైం రికార్డును పెద్ద తేడాతో బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది. థియేటర్లలో విరగాడి.. ఆపై రెండు డిజిటల్ ఫ్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉన్న సినిమాకు ఇప్పుడు టీవీలో ఈ స్థాయి రేటింగ్ రావడం కచ్చితంగా అద్భుతమే.
This post was last modified on August 27, 2020 2:13 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…