Movie News

బుల్లితెరపై ‘అలవైకుంఠపురములో’ ప్రకంపనలు

ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అల వైకుంఠపురములో’ ఆ అంచనాల్ని మించిపోయి బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయం సాధించింది. రూ.128 కోట్లతో ‘రంగస్థలం’ సినిమా నెలకొల్పిన ‘నాన్ బాహుబలి’ రికార్డును బద్దలు కొట్టేసింది. రూ.140 కోట్లకు పైగా షేర్‌తో కొత్త రికార్డు నెలకొల్పింది.

‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి మరో భారీ చిత్రం పోటీలో ఉండగా ఈ రికార్డును అందుకోవడం అంటే మాటలు కాదు. ఐతే వెండితెర మీదే కాదు.. ఈ సినిమా బుల్లితెర మీదా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక్కడ ‘బాహుబలి’నే కాదు.. అన్ని సినిమాలనూ దాటేసింది.

ఆల్ టైం రికార్డును చెప్పుకోదగ్గ తేడాతో దాటేసి కొత్త టీఆర్పీ రికార్డు నెలకొల్పింది. ఇటీవలే జెమిని టీవీలో ‘అల వైకుంఠపురములో’ను ప్రిమియర్‌గా వేయగా.. రికార్డు స్థాయిలో 29.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది బుల్లితెరపై ఒక సంచలనమే.

చాలా ఏళ్ల కిందట అక్కినేని నాగార్జున సిినిమా ‘శ్రీరామదాసు’ 24 రేటింగ్‌తో అప్పట్లో రికార్డు నెలకొల్పింది. దాన్ని ఇంత వరకు ఏ సినిమా అందుకోలేదు. ‘బాహుబలి’ సైతం 22 రేటింగ్‌కు పరిమితం అయింది. ‘టెంపర్’ 23.5 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉండగా.. ఈ ఏడాది మార్చిలో ప్రసారమైన మరో సంక్రాంతి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ 23.4తో దానికి చేరువగా వచ్చింది. మూడో స్థానాన్ని చేరుకుంది.

ఐతే లాక్ డౌన్ వల్ల జనాలు పూర్తిగా ఇళ్లకు పరిమితం అయిన సమయంలో ఆ చిత్రానికి ఆ రేటింగ్ రాగా.. ఇటీవలే ప్రసారమైన ‘అల వైకుంఠపురములో’ దాన్ని దాటి ఆల్ టైం రికార్డును పెద్ద తేడాతో బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది. థియేటర్లలో విరగాడి.. ఆపై రెండు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్న సినిమాకు ఇప్పుడు టీవీలో ఈ స్థాయి రేటింగ్ రావడం కచ్చితంగా అద్భుతమే.

This post was last modified on August 27, 2020 2:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప‌వ‌న్‌కు అస‌లేమైంది?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్యం గురించి శ‌నివారం సాయంత్రం సామాజిక మాధ్య‌మాల్లో ఒక్క‌సారిగా పెద్ద చ‌ర్చ మొద‌లైంది. ఉన్న‌ట్లుండి…

1 hour ago

మసూద డైరెక్టర్ ఎక్కడయ్యా?

తెలుగులో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ‘మసూద’…

1 hour ago

దురంధర్ 2 ముందుకు – పుష్ప 2 వెనక్కు

మరో కొత్త రికార్డు బద్దలైపోయింది. మొన్నటి ఏడాది రిలీజైన పుష్ప 2 ది రైజ్ వసూళ్లను ఇప్పుడప్పుడే ఎవరూ క్రాస్…

4 hours ago

బిల్లు వ్యతిరేకతపై విశ్లేషకులు ఏమంటున్నారు?

దేశంలో సుదీర్ఘకాలంగా ఎలాంటి పెంపునకు గురి కాకుండా ఉండిపోయిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తెర మీదకు రాగా... కాంగ్రెస్…

4 hours ago

ఏపీకి మోడీ వ‌రాలు

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఏపీపై వ‌రాల జ‌ల్లు కురిపించింది. శ‌నివారం జ‌రిగిన కేంద్ర మంత్రి వ‌ర్గ స‌మావేశంలో సుదీర్ఘ…

4 hours ago

జ‌గ‌న్ న‌చ్చాడా ప్ర‌కాష్‌రాజ్?

ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై బ‌హుభాషా న‌టుడు.. ప్ర‌కాష్‌రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన మంత్రిని…

5 hours ago