ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అల వైకుంఠపురములో’ ఆ అంచనాల్ని మించిపోయి బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయం సాధించింది. రూ.128 కోట్లతో ‘రంగస్థలం’ సినిమా నెలకొల్పిన ‘నాన్ బాహుబలి’ రికార్డును బద్దలు కొట్టేసింది. రూ.140 కోట్లకు పైగా షేర్తో కొత్త రికార్డు నెలకొల్పింది.
‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి మరో భారీ చిత్రం పోటీలో ఉండగా ఈ రికార్డును అందుకోవడం అంటే మాటలు కాదు. ఐతే వెండితెర మీదే కాదు.. ఈ సినిమా బుల్లితెర మీదా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక్కడ ‘బాహుబలి’నే కాదు.. అన్ని సినిమాలనూ దాటేసింది.
ఆల్ టైం రికార్డును చెప్పుకోదగ్గ తేడాతో దాటేసి కొత్త టీఆర్పీ రికార్డు నెలకొల్పింది. ఇటీవలే జెమిని టీవీలో ‘అల వైకుంఠపురములో’ను ప్రిమియర్గా వేయగా.. రికార్డు స్థాయిలో 29.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది బుల్లితెరపై ఒక సంచలనమే.
చాలా ఏళ్ల కిందట అక్కినేని నాగార్జున సిినిమా ‘శ్రీరామదాసు’ 24 రేటింగ్తో అప్పట్లో రికార్డు నెలకొల్పింది. దాన్ని ఇంత వరకు ఏ సినిమా అందుకోలేదు. ‘బాహుబలి’ సైతం 22 రేటింగ్కు పరిమితం అయింది. ‘టెంపర్’ 23.5 రేటింగ్తో రెండో స్థానంలో ఉండగా.. ఈ ఏడాది మార్చిలో ప్రసారమైన మరో సంక్రాంతి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ 23.4తో దానికి చేరువగా వచ్చింది. మూడో స్థానాన్ని చేరుకుంది.
ఐతే లాక్ డౌన్ వల్ల జనాలు పూర్తిగా ఇళ్లకు పరిమితం అయిన సమయంలో ఆ చిత్రానికి ఆ రేటింగ్ రాగా.. ఇటీవలే ప్రసారమైన ‘అల వైకుంఠపురములో’ దాన్ని దాటి ఆల్ టైం రికార్డును పెద్ద తేడాతో బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది. థియేటర్లలో విరగాడి.. ఆపై రెండు డిజిటల్ ఫ్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉన్న సినిమాకు ఇప్పుడు టీవీలో ఈ స్థాయి రేటింగ్ రావడం కచ్చితంగా అద్భుతమే.
This post was last modified on August 27, 2020 2:13 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…