రెండు ప్యాన్ ఇండియా సినిమాలు ఒకేసారి తీస్తున్న దర్శకుడు శంకర్ వ్యవహార శైలి ఇద్దరు హీరోల అభిమానులకు ఎక్కడ లేని టెన్షన్ తెచ్చి పెడుతోంది. ఇటీవలే గేమ్ ఛేంజర్ మొదటి ఆడియో సింగల్ జరగండి జరగండిని దీపావళికి రిలీజ్ చేస్తామని దిల్ రాజు టీమ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ హఠాత్తుగా ఇండియన్ 2 పరిచయ టీజర్ ని నవంబర్ 3 రిలీజ్ చేయబోతున్నట్టు లైకా ప్రొడక్షన్స్ కొత్త పోస్టర్ తో చెప్పడం ఇంకో చర్చకు దారి తీస్తోంది. నిజానికి కమల్ మూవీకి సంబంధించి ఇప్పటిదాకా ప్రీ లుక్ పోస్టర్లు తప్ప ఎలాంటి అప్డేట్లు రాలేదు. ఇదే మొదటిది.
ఇక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కొత్త అనుమానం వస్తోంది. ఇండియన్ 2 టీజర్ లో దాని విడుదల తేదీ చెబుతారేమోనని. సంక్రాంతి అయితే ఛాన్స్ లేదు. పోనీ ఆగస్ట్ 15 అనుకుంటే ఆ డేట్ ని పుష్ప 2 ది రూల్ తీసేసుకుంది కాబట్టి అనవసరంగా పోటీకి వెళ్లే ఉద్దేశంలో శంకర్ లేరని సన్నిహితుల టాక్. అలాంటప్పుడు బెస్ట్ ఆప్షన్ 2024 సమ్మర్. లేదూ అంటే లియో లాగా దసరాకు వచ్చి వసూళ్లు కుమ్మేసుకోవాలి. అదే జరిగితే గేమ్ చేంజర్ వచ్చే ఏడాది ఉండదని ఫిక్స్ అయిపోవచ్చు. అలాంటప్పుడు ఇప్పుడు వదిలే పాట కేవలం కంటి తుడుపు కోసమా లేక లీకయ్యింది కాబట్టి ఆడియో కంపెనీ ఒత్తిడి వల్లనానేది తేలాల్సి ఉంది.
ఏది ఏమైనా వీలైనంత త్వరగా ఏదో ఒక సినిమా గురించి అయినా రిలీజ్ డేట్ లాక్ చేస్తే రిలీఫ్ గా ఉంటుంది. కమింగ్ సూన్ అని ఊరించకుండా పక్కాగా లాక్ చేసుకుంటే ఇతర నిర్మాతలు పోటీకి రాకుండా దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటారు. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ పనులు ఒకేసారి చూసుకుంటున్న శంకర్ మాత్రం ఫైనల్ కాపీ ఏది ముందు సిద్ధమవుతుందో దాన్ని బట్టే నిర్ణయం తీసుకుందామని నిర్మాతలతో అంటున్నారట. అదే నిజమైతే ముందా అవకాశం ఉన్నది ఇండియన్ 2కేనని చెన్నై టాక్. చూద్దాం వచ్చే వారమైనా ఈ గందరగోళం కొంతైనా తీరుతుందేమో.
This post was last modified on October 29, 2023 11:09 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…