రెండు ప్యాన్ ఇండియా సినిమాలు ఒకేసారి తీస్తున్న దర్శకుడు శంకర్ వ్యవహార శైలి ఇద్దరు హీరోల అభిమానులకు ఎక్కడ లేని టెన్షన్ తెచ్చి పెడుతోంది. ఇటీవలే గేమ్ ఛేంజర్ మొదటి ఆడియో సింగల్ జరగండి జరగండిని దీపావళికి రిలీజ్ చేస్తామని దిల్ రాజు టీమ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ హఠాత్తుగా ఇండియన్ 2 పరిచయ టీజర్ ని నవంబర్ 3 రిలీజ్ చేయబోతున్నట్టు లైకా ప్రొడక్షన్స్ కొత్త పోస్టర్ తో చెప్పడం ఇంకో చర్చకు దారి తీస్తోంది. నిజానికి కమల్ మూవీకి సంబంధించి ఇప్పటిదాకా ప్రీ లుక్ పోస్టర్లు తప్ప ఎలాంటి అప్డేట్లు రాలేదు. ఇదే మొదటిది.
ఇక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కొత్త అనుమానం వస్తోంది. ఇండియన్ 2 టీజర్ లో దాని విడుదల తేదీ చెబుతారేమోనని. సంక్రాంతి అయితే ఛాన్స్ లేదు. పోనీ ఆగస్ట్ 15 అనుకుంటే ఆ డేట్ ని పుష్ప 2 ది రూల్ తీసేసుకుంది కాబట్టి అనవసరంగా పోటీకి వెళ్లే ఉద్దేశంలో శంకర్ లేరని సన్నిహితుల టాక్. అలాంటప్పుడు బెస్ట్ ఆప్షన్ 2024 సమ్మర్. లేదూ అంటే లియో లాగా దసరాకు వచ్చి వసూళ్లు కుమ్మేసుకోవాలి. అదే జరిగితే గేమ్ చేంజర్ వచ్చే ఏడాది ఉండదని ఫిక్స్ అయిపోవచ్చు. అలాంటప్పుడు ఇప్పుడు వదిలే పాట కేవలం కంటి తుడుపు కోసమా లేక లీకయ్యింది కాబట్టి ఆడియో కంపెనీ ఒత్తిడి వల్లనానేది తేలాల్సి ఉంది.
ఏది ఏమైనా వీలైనంత త్వరగా ఏదో ఒక సినిమా గురించి అయినా రిలీజ్ డేట్ లాక్ చేస్తే రిలీఫ్ గా ఉంటుంది. కమింగ్ సూన్ అని ఊరించకుండా పక్కాగా లాక్ చేసుకుంటే ఇతర నిర్మాతలు పోటీకి రాకుండా దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటారు. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ పనులు ఒకేసారి చూసుకుంటున్న శంకర్ మాత్రం ఫైనల్ కాపీ ఏది ముందు సిద్ధమవుతుందో దాన్ని బట్టే నిర్ణయం తీసుకుందామని నిర్మాతలతో అంటున్నారట. అదే నిజమైతే ముందా అవకాశం ఉన్నది ఇండియన్ 2కేనని చెన్నై టాక్. చూద్దాం వచ్చే వారమైనా ఈ గందరగోళం కొంతైనా తీరుతుందేమో.
This post was last modified on October 29, 2023 11:09 pm
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…