భారీ అంచనాల మధ్య డివైడ్ టాక్ తోనూ వసూళ్ల దుమ్ము దులిపిన లియో కంటెంట్ విషయంలో ఇప్పటికీ అభిమానులు, మూవీ లవర్స్ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎ హిస్టరీ అఫ్ వయొలెన్స్ ని స్ఫూర్తిగా తీసుకుని మన ఆడియన్స్ అభిరుచికి అనుగుణంగా మార్చిన తీరు బాగానే ఉంది కానీ దాస్ అండ్ కంపెనీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ఆశించిన స్థాయిలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ డీల్ చేయలేకపోయాడనే కంప్లయింట్ సర్వత్రా వినిపించింది. లియో గతాన్ని పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేసి ఉంటె రజనీకాంత్ బాషా రేంజ్ లో ఒక ఐకానిక్ మూవీ అయ్యేదని కోలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
దీని గురించి లోకేష్ స్పందించాడు. నిన్న జరిగిన కార్తీ జపాన్ ట్రైలర్ లాంచ్ కు అతిథిగా హాజరై ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. లియో సెకండ్ హాఫ్ సాగతీత గురించి తనకు నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన మాట వాస్తవమేనని, ఒప్పుకుంటానని, ఆ అభిప్రాయాలను సేకరించి మళ్ళీ రిపీట్ చేయకుండా జాగ్రత్త పడతానని చెప్పాడు. అంతే కాదు లియో కథలో ఉన్న కొన్ని కీలకమైన అంశాలు, డిటైలింగ్ గురించి త్వరలో ఇచ్చే ఇంటర్వ్యూలలో వివరిస్తానని, చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయని సస్పెన్స్ పెట్టాడు. సామాన్య ప్రేక్షకులకు లియో నచ్చిందని అందుకే సంతోషంగా ఉన్నానని ఓపెనయ్యాడు.
ఇది ఆహ్వానించాల్సిన స్టేట్ మెంట్. ఎందుకంటే కోట్ల వసూళ్లు వస్తే చాలు తమ సినిమాలో లోపాలను ఒప్పుకోకుండా గొప్పగా తీశామని చెప్పుకునే కొందరు దర్శకుల శైలికి భిన్నంగా లోకేష్ కనగరాజ్ స్పందించడం విశేషం. అన్నట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో వాయిదా పడ్డాక ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్న సంగతి తెలిసిందే. దాన్ని పూడ్చేలా అదే వేదికపై త్వరలో సక్సెస్ మీట్ చేయబోతున్నారు. విజయ్ వస్తున్నాడు. ఇది లోకేష్ స్వయంగా చెప్పేశాడు. చెప్పడానికి కార్తీ ఈవెంట్ అయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం లియో, రోలెక్స్ అంటూ ఎల్సియు జపంతో స్టేడియంని హోరెత్తించడం అసలు ట్విస్టు.
This post was last modified on October 29, 2023 1:25 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…