డిసెంబర్ 21, 22 వరస తేదీల్లో విడుదల కాబోతున్న షారుఖ్ ఖాన్ డుంకీ, ప్రభాస్ సలార్ ల పోటీకి డిస్ట్రిబ్యూటర్ల బుర్రలు ఎంతగా వేడెక్కిపోయాయో చూస్తున్నాం. వీటి థియేటర్ల సర్దుబాటుకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పెను సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. వీటితో పాటు హాలీవుడ్ మూవీ ఆక్వామెన్ ది ఫాలెన్ కింగ్ డం రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందు ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్ డిసెంబర్ 20. ఇప్పుడు దాన్ని మార్చేసి నేరుగా 22కి షిఫ్ట్ చేశారు. అంటే సలార్ వచ్చే రోజునే నీటిమనిషి థియేటర్లలో అడుగు పెడతాడు. అంత కొంప మునిగే విషయం ఏంటనా మీ డౌట్.
అక్కడికే వద్దాం. ఇండియాని మినహాయిస్తే ఆక్వామెన్ కి విదేశాల్లో చాలా క్రేజ్ ఉంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు, ఐమ్యాక్స్ స్క్రీన్లు చేతిలో ఉన్న పంపిణీదారులు ముందు ఇంగ్లీష్ మూవీకే ప్రాధాన్యం ఇస్తారు. సలార్, డుంకీల డిమాండ్ కళ్ళముందు కనిపిస్తున్నా సరే అంత సులభంగా మాట వినరు. అదే జరిగితే ఓపెనింగ్స్ మీద గట్టి దెబ్బ పడుతుంది. షారుఖ్ కొంత నయం. ఒకరోజు ముందే వస్తాడు కనక రెవిన్యూ పరంగా డ్యామేజ్ మరీ తీవ్రంగా ఉండదు. కానీ ప్రభాస్ పరిస్థితి అలా కాదు. యుఎస్, యుకె లాంటి దేశాల్లో ఆక్వామెన్ తో కలిసి వసూళ్లను పంచుకోవాల్సి ఉంటుంది. ఇది పెద్ద సమస్యే.
ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందట క్రిస్మస్ సెలవులకు రిలీజ్ కు తక్కువ గ్యాప్ ఉండేలా చూసుకోవడం కోసమట. అయితే మన దేశం వరకు అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రత్యేకంగా హాలీవుడ్ మూవీ లవర్స్ తప్పించి సలార్, డుంకీలను కాదనుకుని మరీ ఆక్వామెన్ కు వెళ్లే మాస్ జనాలు మన దగ్గర అంతగా ఉండరు. కాకపోతే మల్టీప్లెక్సులు స్క్రీన్లు పంచే విషయంలో ఎలాంటి పోకడ చూపిస్తాయన్నది కీలకం కానుంది. ఎందుకంటే ప్రతి ఊరికి ఒకటి రెండు స్క్రీన్లు ఆక్వామెన్ కు ఇచ్చినా ఆ రకంగా ప్రభాస్, షారుఖ్ కొచ్చే వాటాలో తగ్గినట్టేగా. మొత్తానికి పోటీ రసవత్తరంగా ఉండబోతోంది.
ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నప్పుడు నిర్మాతకు ఫలితం కన్నా ఎక్కువగా ఆందోళనకు గురి చేసే అంశాలు చాలా ఉంటాయి. వాటిలో…
తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించదలిచిన సభకు పోలీసులు, కోర్టు అనుమతినివ్వకపోవడం రాజకీయ దుమారానికి తెర లేపిన…
ఏదైనా భవన నిర్మాణమైనా, రోడ్డు నిర్మాణమైనా… అందుకోసం చాలా మంది కార్మికులు అవసరం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని…
ఢిల్లీలోని మాళవియా నగర్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఫ్లోరిష్ స్టే అనే హోటల్లో ఉదయం చెలరేగిన మంటలు…
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…