ఊహించిన దానికన్నా ఎక్కువ వేగంగా నా సామి రంగా షూటింగ్ జరుగుతోంది. మొదలుపెట్టడంలోనే విపరీతమైన ఆలస్యం జరగడంతో నాగార్జున ఎక్కడ బ్రేక్స్ లేకుండా నాన్ స్టాప్ గా పనులు జరిగేలా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి బరిలో దిగాలనే లక్ష్యంతో టీమ్ వర్క్ చేస్తోంది. అయితే ఇంత వేగంగా పరుగులు పెట్టడంలో డబుల్ స్ట్రాటజీ ఉందని ఇన్ సైడ్ టాక్. పండగ బరిలో గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్, హనుమాన్ పక్కాగా దిగుతున్నాయి. రవితేజ ఈగల్ పక్కా అని నిర్మాత చెబుతూనే ఉన్నారు కాబట్టి దీని మీద సందేహం అక్కర్లేదు.
వెంకటేష్ సైంధవ్ కి బిజినెస్ కూడా మొదలైపోయింది. ఒక్క శాతం అనుమానం లేదు. రజనీకాంత్ లాల్ సలాం, శివ కార్తికేయన్ అయలన్ ఎన్నో కొన్ని థియేటర్లు దొరికితే చాలు లెమ్మని వస్తున్నాయి. వాటికి తమిళ వెర్షన్ కీలకం. ఇంత కాంపిటీషన్ మధ్య నా సామీ రంగా దిగితే వర్కౌట్ చేసుకోవడం అంత సులభం కాదు. నాగ్ మాత్రం ఒకటి రెండు ఖచ్చితంగా వాయిదా పడతాయని, ఒకవేళ అదే జరిగితే ఖాళీ అయ్యే ఆ స్లాట్ ని తను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ అన్నీ వచ్చే పనైతే డిసెంబర్ లో నిర్ణయం తీసుకుని జనవరి నెలాఖరుకు వెళ్లేలా ఇంకో ప్లాన్ అనుకున్నారట.
మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో సోగ్గాడే చిన్ని నాయనా సెంటిమెంట్ ని వదలకూడదనే నాగ్ పంతం స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ బిన్నీ మాస్టర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మలయాళీ రీమేక్ లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ మరో రెండు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. వీళ్ళ ఇమేజ్ దృష్ట్యా మల్టీస్టారర్ అనలేం కానీ ఎంతో కొంత కలర్ అయితే తోడవుతుంది. పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న నా సామి రంగాలో ఊర మాస్ అంశాలతో పాటు ఒక డిఫరెంట్ లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. పోరంజు మరియం జొస్ కి రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ చాలా మార్పులే చేశారు. ముందైతే ఆయన్నే డైరెక్టర్ గా తీసుకుని తర్వాత మార్చారు.
This post was last modified on October 27, 2023 7:06 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…