ఊహించిన దానికన్నా ఎక్కువ వేగంగా నా సామి రంగా షూటింగ్ జరుగుతోంది. మొదలుపెట్టడంలోనే విపరీతమైన ఆలస్యం జరగడంతో నాగార్జున ఎక్కడ బ్రేక్స్ లేకుండా నాన్ స్టాప్ గా పనులు జరిగేలా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి బరిలో దిగాలనే లక్ష్యంతో టీమ్ వర్క్ చేస్తోంది. అయితే ఇంత వేగంగా పరుగులు పెట్టడంలో డబుల్ స్ట్రాటజీ ఉందని ఇన్ సైడ్ టాక్. పండగ బరిలో గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్, హనుమాన్ పక్కాగా దిగుతున్నాయి. రవితేజ ఈగల్ పక్కా అని నిర్మాత చెబుతూనే ఉన్నారు కాబట్టి దీని మీద సందేహం అక్కర్లేదు.
వెంకటేష్ సైంధవ్ కి బిజినెస్ కూడా మొదలైపోయింది. ఒక్క శాతం అనుమానం లేదు. రజనీకాంత్ లాల్ సలాం, శివ కార్తికేయన్ అయలన్ ఎన్నో కొన్ని థియేటర్లు దొరికితే చాలు లెమ్మని వస్తున్నాయి. వాటికి తమిళ వెర్షన్ కీలకం. ఇంత కాంపిటీషన్ మధ్య నా సామీ రంగా దిగితే వర్కౌట్ చేసుకోవడం అంత సులభం కాదు. నాగ్ మాత్రం ఒకటి రెండు ఖచ్చితంగా వాయిదా పడతాయని, ఒకవేళ అదే జరిగితే ఖాళీ అయ్యే ఆ స్లాట్ ని తను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ అన్నీ వచ్చే పనైతే డిసెంబర్ లో నిర్ణయం తీసుకుని జనవరి నెలాఖరుకు వెళ్లేలా ఇంకో ప్లాన్ అనుకున్నారట.
మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో సోగ్గాడే చిన్ని నాయనా సెంటిమెంట్ ని వదలకూడదనే నాగ్ పంతం స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ బిన్నీ మాస్టర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మలయాళీ రీమేక్ లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ మరో రెండు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. వీళ్ళ ఇమేజ్ దృష్ట్యా మల్టీస్టారర్ అనలేం కానీ ఎంతో కొంత కలర్ అయితే తోడవుతుంది. పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న నా సామి రంగాలో ఊర మాస్ అంశాలతో పాటు ఒక డిఫరెంట్ లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. పోరంజు మరియం జొస్ కి రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ చాలా మార్పులే చేశారు. ముందైతే ఆయన్నే డైరెక్టర్ గా తీసుకుని తర్వాత మార్చారు.
This post was last modified on October 27, 2023 7:06 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…