మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కథలు, సన్నివేశాలు కాపీ కొట్టడం కొత్తేమీ కాదు. అగ్ర దర్శకులు చాలామంది ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. త్రివిక్రమ్ సినిమాలు ఎన్నింటిపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయో లెక్కలేదు. ఆయన కాపీ మాస్టర్ అనే విషయం అనేక సినిమాల్లో రుజువైంది కూడా.
కొరటాల శివ సైతం శ్రీమంతుడు విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆయన తీస్తున్న ఆచార్యకూ ఇలాంటి ఆరోపణలు తప్పలేదు. రాజమౌళి మీద కూడా కొన్ని కాపీ మరకలున్నాయి. ఈ విషయంలో సుకుమార్ మినహాయింపనే చెప్పాలి. ఆయన మీద పెద్దగా కాపీ ఆరోపణలు లేవు. రంగస్థలం క్లైమాక్స్ విషయంలో చిన్న ఆరోపణ వచ్చింది కానీ.. దానికాయన తగు రీతిలో సమాధానం చెప్పాడు.
కానీ ఇప్పుడు సుక్కు తీస్తున్న పుష్ఫ సినిమా కథ విషయమై కడప జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అయిన వేంపల్లి గంగాధర్ తీవ్ర ఆరోపణ చేశాడు. నేరుగా పుష్ప సినిమా కాపీ కథ అనకుండా.. తాను రాసిన ఎర్రచందనం కథ, పుస్తకం ఆధారంగానే ఈ సినిమా తీస్తున్నారంటూ ఆయన ఫేస్ బుక్లో ఓ పోస్టు పెట్టారు.
అందులో ఆయన.. ”సూచన అనుకోండి , సలహా అనుకోండి, ఒక సాహిత్యకారుడి ఆవేదన అనుకోండి…ముందుగానే రాసి పెట్టిన కథను ,పుస్తకాన్ని, వ్యాసాలను అన్నీ వాడుకోండి . తెలుగు సాహిత్య కారుల శ్రమను దోచుకోవడం మీ సినిమా రంగానికి కొత్త కాదు కాబట్టి మా అక్షరాలను మీ దృశ్యాలుగా మార్చుకొని బతుక్కోండి …సాక్షి ఆదివారం అనుబంధం( 04 నవంబర్ 2018)లో నేను రాసిన ‘తమిళ కూలీ’ కథ మొత్తం వాడేసుకోండి. గత సంవత్సరం(2019) మే నెలలో మార్కెట్ లోకి వచ్చిన నా 80 పేజీల పుస్తకం ‘ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు’ను ఉడికించి వంట చేస్కోండి .కనీసం పేరుకూడా reference గా సినిమాలో వేయకండి . ఒకవేళ మీకు కరోనా వస్తే కూడా చెప్పండి …మా తెలుగు సాహిత్య కారుల ప్లాస్మా కూడా దానం చేస్తాం’ అని పేర్కొన్నారు.
దీనిపై సుక్కు టీం ఏమంటుందో చూడాలి మరి. కానీ పుష్ప టీజర్ అయినా రాకముందే.. కేవలం అది ఎర్రచందనం నేపథ్యంలో సాగే కథ అయినంత మాత్రాన.. ఇలా ఆ సినిమా తన రచనల ఆధారంగానే తీస్తున్నారనడం ఎంత వరకు సమంజసమో?
This post was last modified on August 27, 2020 10:06 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…