మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కథలు, సన్నివేశాలు కాపీ కొట్టడం కొత్తేమీ కాదు. అగ్ర దర్శకులు చాలామంది ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. త్రివిక్రమ్ సినిమాలు ఎన్నింటిపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయో లెక్కలేదు. ఆయన కాపీ మాస్టర్ అనే విషయం అనేక సినిమాల్లో రుజువైంది కూడా.
కొరటాల శివ సైతం శ్రీమంతుడు విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆయన తీస్తున్న ఆచార్యకూ ఇలాంటి ఆరోపణలు తప్పలేదు. రాజమౌళి మీద కూడా కొన్ని కాపీ మరకలున్నాయి. ఈ విషయంలో సుకుమార్ మినహాయింపనే చెప్పాలి. ఆయన మీద పెద్దగా కాపీ ఆరోపణలు లేవు. రంగస్థలం క్లైమాక్స్ విషయంలో చిన్న ఆరోపణ వచ్చింది కానీ.. దానికాయన తగు రీతిలో సమాధానం చెప్పాడు.
కానీ ఇప్పుడు సుక్కు తీస్తున్న పుష్ఫ సినిమా కథ విషయమై కడప జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అయిన వేంపల్లి గంగాధర్ తీవ్ర ఆరోపణ చేశాడు. నేరుగా పుష్ప సినిమా కాపీ కథ అనకుండా.. తాను రాసిన ఎర్రచందనం కథ, పుస్తకం ఆధారంగానే ఈ సినిమా తీస్తున్నారంటూ ఆయన ఫేస్ బుక్లో ఓ పోస్టు పెట్టారు.
అందులో ఆయన.. ”సూచన అనుకోండి , సలహా అనుకోండి, ఒక సాహిత్యకారుడి ఆవేదన అనుకోండి…ముందుగానే రాసి పెట్టిన కథను ,పుస్తకాన్ని, వ్యాసాలను అన్నీ వాడుకోండి . తెలుగు సాహిత్య కారుల శ్రమను దోచుకోవడం మీ సినిమా రంగానికి కొత్త కాదు కాబట్టి మా అక్షరాలను మీ దృశ్యాలుగా మార్చుకొని బతుక్కోండి …సాక్షి ఆదివారం అనుబంధం( 04 నవంబర్ 2018)లో నేను రాసిన ‘తమిళ కూలీ’ కథ మొత్తం వాడేసుకోండి. గత సంవత్సరం(2019) మే నెలలో మార్కెట్ లోకి వచ్చిన నా 80 పేజీల పుస్తకం ‘ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు’ను ఉడికించి వంట చేస్కోండి .కనీసం పేరుకూడా reference గా సినిమాలో వేయకండి . ఒకవేళ మీకు కరోనా వస్తే కూడా చెప్పండి …మా తెలుగు సాహిత్య కారుల ప్లాస్మా కూడా దానం చేస్తాం’ అని పేర్కొన్నారు.
దీనిపై సుక్కు టీం ఏమంటుందో చూడాలి మరి. కానీ పుష్ప టీజర్ అయినా రాకముందే.. కేవలం అది ఎర్రచందనం నేపథ్యంలో సాగే కథ అయినంత మాత్రాన.. ఇలా ఆ సినిమా తన రచనల ఆధారంగానే తీస్తున్నారనడం ఎంత వరకు సమంజసమో?
This post was last modified on August 27, 2020 10:06 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…