‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు వెంకటేష్ మహా. ఆ సినిమాతో అతడిపై అంచనాలు పెరిగిపోయాయి. తన నుంచి ఇలాంటి వైవిధ్యమైన, ఒరిజినల్ సినిమాలు ఎన్నో ఆశించారు ప్రేక్షకులు. కానీ అతను తన రెండో చిత్రంగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అనే రీమేక్ తీశాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడేదో ‘మర్మాణువు’ అనే సినిమా చేస్తున్నాడు. అది ప్రకటించి చాన్నాళ్లయింది.
దాని విశేషాలేవీ బయటికి రాలేదు. వెంకటేష్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడంతో పాటు ఓ కీలక పాత్ర కూడా చేసిన ‘మార్టిన్ లూథర్ కింగ్’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఒక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడిగా తన కెరీర్లో చాలా గ్యాప్ రావడంపై స్పందించాడు. తాను హీరోలకు కథలు చెబుతున్నప్పటికీ అవి ఓకే కావట్లేదంటూ వెంకటేష్ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.
తాను ఒక ప్రముఖ నటుడికి ఒక ప్రేమకథ చెప్పానని.. ఐతే అతను ‘పుష్ప’ తరహా కథ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడని వెంకటేష్ మహా తెలిపాడు. తర్వాత మరో హీరోకు తాను ఇంకో కథ చెప్పగా.. దాన్ని ‘కేజీఎఫ్’ తరహాలో మార్చాలని తన టీం సూచించిందని వెంకటేష్ అన్నాడు. పుష్ప, కేజీఎఫ్ లాంటి సినిమాలే చేయాలనుకుంటే.. వాటిలో హీరోల బదులు తమ ముఖాలను ఏఐ ద్వారా మార్చి చూసుకుంటే సరిపోతుందని.. అంతే తప్ప తాము కూడా అవే సినిమాలు చేస్తామంటే ఎలా అని వెంకటేష్ సెటైర్ వేశాడు.
ఆయా హీరోలు చెప్పినట్లు కథలు మార్చడం ఇష్టం లేక వాళ్లతో సినిమాలు చేయలేదని వెంకటేష్ స్పష్టం చేశాడు. దర్శకుడిగా తన కెరీర్లో గ్యాప్ రావడానికి ఇదే కారణమని అతను చెప్పాడు. తాను అనుకున్నట్లుగానే ‘మర్మాణువు’ అనే సినిమా చేస్తున్నట్లు అతను తెలిపాడు. ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘కేజీఎఫ్’ సినిమా మీద వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా.. తాజా వ్యాఖ్యలతో అతను మరోసారి వార్తల్లో నిలిచేలా ఉన్నాడు.
This post was last modified on October 27, 2023 11:36 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…