స్టార్ క్యాస్టింగ్ లేకుండా తక్కువ బడ్జెట్ తో తీసే సినిమాల విషయంలో ప్రమోషన్ ది చాలా కీలక పాత్ర. ముఖ్యంగా మన కంటెంట్ లో ఎంత దమ్ముందో చెప్పే ట్రైలర్ ఎంతో కీలకం. ఇదే ఒక్కోసారి థియేట్రికల్ బిజినెస్ ని శాశిస్తుంది. లియోనే ఉదాహరణగా తీసుకోవచ్చు. ముందు తెలుగు హక్కులు ఇరవై ఒక్క కోట్లకు మాట్లాడుకుని రిలీజ్ కు దగ్గరలో అయిదు కోట్లు తగ్గించుకున్నారంటే కేవలం హైప్ లో వచ్చిన హెచ్చుతగ్గుల వల్లే. ట్రైలర్ కట్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆశించిన స్థాయిలో ఇవ్వలేదనే కామెంట్స్ నేపథ్యంలో దాని ప్రభావం నేరుగా హక్కుల మీద పడింది. అందరికీ ఇలా జరగదు.
దర్శకుడు అజయ్ భూపతి మంగళవారం నవంబర్ 17 రిలీజ్ కానుంది. మొన్నటిదాకా దీని గురించి పెద్దగా సౌండ్ లేదు. టీజర్ వచ్చినప్పుడు జనాలు మాట్లాడుకున్నారు. ట్రైలర్ చూశాక ఇదేదో రెగ్యులర్ క్రైమ్ హారర్ డ్రామా కాదని అర్థమైపోవడంతో ఒక్కసారిగా బజ్ పెరిగింది. ముందు ఆరు కోట్లకు పెట్టుకున్న బిజినెస్ టార్గెట్ ఇప్పుడు ఏకంగా రెట్టింపు దాటేసి పదిహేను కోట్లకు చేరుకుందని ట్రేడ్ టాక్. ఆ టైంలో చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేకపోవడంతో పాటు ట్రైలర్ లో చూపించిన విజువల్స్ కి ఇది విరూపాక్షని మించిన విజయం సాధిస్తుందనే నమ్మకం బయ్యర్లలో వచ్చేసిందట.
దీంతో అంత ధర పలుకుతున్నా సరే పంపిణీదారులు సిద్ధంగా ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషించిన మంగళవారంలో అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తోంది. పబ్లిసిటీలో వీలైనంత స్టోరీకి సంబంధించి లీకులు రాకుండా అజయ్ భూపతి జాగ్రత్త తీసుకోవడంతో అంతకంతా ఆసక్తి పెరుగుతోంది. ఒక ఊరిలో జరిగే అంతుచిక్కని హత్యలకు, కనిపించని దెయ్యాలకు, కామంతో రగిలిపోయే ఒక అమ్మాయికి మధ్య జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ గా మంగళవారం రూపొందింది. ప్యాన్ ఇండియా రేంజ్ లో అయిదు భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.
This post was last modified on October 26, 2023 4:38 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…