పండగ సినిమాల హడావిడి అయిపోయింది కాబట్టి మూవీ లవర్స్ కొత్త శుక్రవారం వైపు ఎదురు చూస్తున్నారు. అయితే స్టార్ లెవరూ రాకపోవడం కొంత నిరాశ కలిగించే విషయమే అయినా గ్రౌండ్ గా ఫ్రీగా ఉన్న అవకాశం వాడుకునే ఛాన్స్ సంపూర్ణేష్ బాబుకి దక్కింది. తను హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ ఎల్లుండి థియేటర్లలో అడుగు పెట్టనుంది. పది రోజుల క్రితమే కొన్ని జిల్లా కేంద్రాల్లో స్పెషల్ షోలు వేశారు. హైదరాబాద్ లో ఇవాళ మీడియాకు ప్రదర్శించారు. రేపు సాయంత్రం కొన్ని షోలు రెగ్యులర్ ఆడియన్స్ కి ప్లాన్ చేస్తారట. ఇప్పటికైతే ప్రీ రెస్పాన్స్ పాజిటివ్ గానే వినిపిస్తోంది.
ప్రీమియర్ల నుంచి వచ్చే స్పందనే ప్రామాణికంగా తీసుకోలేం కాబట్టి 27 ఉదయం ఓ రెండు షోలు పడి కామన్ పబ్లిక్ చూశాక క్లారిటీ వస్తుంది. తమిళ హిట్ మూవీ మండేలా రీమేక్ గా రూపొందిన మార్టిన్ లూథర్ కింగ్ లో హాస్యంతో పాటు సామాజిక కోణంలో సీరియస్ గా చర్చించిన అంశం ఒకటుంది. ఓటు గొప్పదనం తెలియజేయడంతో పాటు దాన్ని అమ్ముకుని జనాలెంత తప్పు చేస్తున్నారో ఇందులో చూపించారు. ప్రస్తుతమున్న అధికార పార్టీల మీద కూడా కొన్ని సెటైర్లు ఉన్నాయని ట్రైలర్ లోనే హింట్ ఇచ్చారు. కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా దీనికి సంభాషణలు అందించారు.
ఇక పోటీ పరంగా చూస్తే ఆ రోజు చిన్న సినిమాలు తప్ప ఇంకేవి లేదు. ఉన్నవాటిలో కొంత ఆసక్తి రేపుతోంది మార్టిన్ లూథర్ కింగ్ ఒకటే. లింగోచా, ధీమహి, శివరాజ్ కుమార్ ఘోస్ట్, ఒక్కడే 1 ఇలా కొన్నున్నాయి కానీ అదిరిపోయిందనే టాక్ వస్తే తప్ప ఓపెనింగ్స్ సంగతి తర్వాత, ముందు పికప్ కావడానికి ఛాన్స్ ఉండదు. కాకపోతే మార్టిన్ లూథర్ కింగ్ నెలాఖరులో రావడం, పండగ సందడిలో చాలా మంది బాలయ్య, రవితేజ, విజయ్ సినిమాలు చూసేయడంతో సంపూ కోసం ఏ మేరకు వస్తారో చూడాలి. ఇప్పుడంతా కంటెంట్ రాజ్యం కాబట్టి అదొక్కటి బలంగా ఉందనిపించుకుంటే చాలు గట్టెక్కినట్టే.
This post was last modified on October 25, 2023 4:02 pm
రష్యా సాయుధ బలగాలు జరిపిన దాడిలో కేరళకు చెందిన అఖిల్ జోయన్ అనే 26 ఏళ్ల నావికుడు ప్రాణాలు కోల్పోయాడు.…
1997 వినీత్, సౌందర్య జంటగా ఆరో ప్రాణం అనే సినిమా వచ్చింది. మంచి హిట్. చక్కని పాటలతో పాటు క్లిష్టమైన…
ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ టీమిండియా బౌలింగ్ లోపాలపై ఒక పెద్ద డేంజర్ బెల్ మోగించింది. బ్యాటింగ్ బలంగా…
సినిమాకు హైప్ తీసుకురావడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు తమ…
టీడీపీ ని నిలబెట్టింది కార్యకర్తలు.. వారి అండతోనే పార్టీ విజయం దక్కించుకుంటోంది- అని పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ…
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అందరి టార్గెట్ ఒక్కటే..…