పండగ సినిమాల హడావిడి అయిపోయింది కాబట్టి మూవీ లవర్స్ కొత్త శుక్రవారం వైపు ఎదురు చూస్తున్నారు. అయితే స్టార్ లెవరూ రాకపోవడం కొంత నిరాశ కలిగించే విషయమే అయినా గ్రౌండ్ గా ఫ్రీగా ఉన్న అవకాశం వాడుకునే ఛాన్స్ సంపూర్ణేష్ బాబుకి దక్కింది. తను హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ ఎల్లుండి థియేటర్లలో అడుగు పెట్టనుంది. పది రోజుల క్రితమే కొన్ని జిల్లా కేంద్రాల్లో స్పెషల్ షోలు వేశారు. హైదరాబాద్ లో ఇవాళ మీడియాకు ప్రదర్శించారు. రేపు సాయంత్రం కొన్ని షోలు రెగ్యులర్ ఆడియన్స్ కి ప్లాన్ చేస్తారట. ఇప్పటికైతే ప్రీ రెస్పాన్స్ పాజిటివ్ గానే వినిపిస్తోంది.
ప్రీమియర్ల నుంచి వచ్చే స్పందనే ప్రామాణికంగా తీసుకోలేం కాబట్టి 27 ఉదయం ఓ రెండు షోలు పడి కామన్ పబ్లిక్ చూశాక క్లారిటీ వస్తుంది. తమిళ హిట్ మూవీ మండేలా రీమేక్ గా రూపొందిన మార్టిన్ లూథర్ కింగ్ లో హాస్యంతో పాటు సామాజిక కోణంలో సీరియస్ గా చర్చించిన అంశం ఒకటుంది. ఓటు గొప్పదనం తెలియజేయడంతో పాటు దాన్ని అమ్ముకుని జనాలెంత తప్పు చేస్తున్నారో ఇందులో చూపించారు. ప్రస్తుతమున్న అధికార పార్టీల మీద కూడా కొన్ని సెటైర్లు ఉన్నాయని ట్రైలర్ లోనే హింట్ ఇచ్చారు. కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా దీనికి సంభాషణలు అందించారు.
ఇక పోటీ పరంగా చూస్తే ఆ రోజు చిన్న సినిమాలు తప్ప ఇంకేవి లేదు. ఉన్నవాటిలో కొంత ఆసక్తి రేపుతోంది మార్టిన్ లూథర్ కింగ్ ఒకటే. లింగోచా, ధీమహి, శివరాజ్ కుమార్ ఘోస్ట్, ఒక్కడే 1 ఇలా కొన్నున్నాయి కానీ అదిరిపోయిందనే టాక్ వస్తే తప్ప ఓపెనింగ్స్ సంగతి తర్వాత, ముందు పికప్ కావడానికి ఛాన్స్ ఉండదు. కాకపోతే మార్టిన్ లూథర్ కింగ్ నెలాఖరులో రావడం, పండగ సందడిలో చాలా మంది బాలయ్య, రవితేజ, విజయ్ సినిమాలు చూసేయడంతో సంపూ కోసం ఏ మేరకు వస్తారో చూడాలి. ఇప్పుడంతా కంటెంట్ రాజ్యం కాబట్టి అదొక్కటి బలంగా ఉందనిపించుకుంటే చాలు గట్టెక్కినట్టే.
This post was last modified on October 25, 2023 4:02 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…