దసరా కానుకగా రిలీజైన లియో సినిమా సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైన మాట వాస్తవం. కానీ ముందస్తు హైప్ వల్ల, డివైడ్ టాక్ తట్టుకుని మంచి వసూళ్లే సాధిస్తున్నట్లు కనిపించింది. అటు తమిళంలో, ఇటు తెలుగులో ఈ చిత్రానికి భారీగానే ఓపెనింగ్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర మోత మోగించేస్తోందని లియో గురించి గొప్పలు పోయారు. యుఎస్లో ఏకంగా 18 మిలియన్ డాలర్లకు పైగా ఈ సినిమాకు వసూళ్లు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
వరల్డ్ వైడ్ రూ.300 కోట్ల మార్కును కూడా ఈ సినిమా దాటేసినట్లు చెబుతున్నారు. కానీ ఈ ఫిగర్స్ అన్నీ ఎగ్జాజరేటెడ్ అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. యుఎస్ వసూళ్ల విషయంలో ట్రాకింగ్ పక్కాగా ఉంటుందని అంటారు కానీ.. అక్కడ ట్రేడ్ పండిట్లను మేనేజ్ చేశారని.. అలాగే ప్రాక్సీ బుకింగ్స్తో సినిమాకు లేని హైప్ సృష్టించారని అంటున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
థియేటర్లలో ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్ చూపించి.. జనాల్లో హైప్ క్రియేట్ చేశారని.. ఇదంతా పెద్ద స్కామ్ అని అంటున్నారు. తమిళనాడులో సైతం వాస్తవ వసూళ్ల కంటే ప్రకటించిన ఫిగర్స్ చాలా ఎక్కువ అని.. సినిమా బ్లాక్ బస్టర్ అని నమ్మించడానికే ఇదంతా జరిగిందని జోరుగా వార్తలు వస్తున్నాయి. నిన్నట్నుంచి ట్విట్టర్లో లియో స్కామ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీని మీద బోలెడన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. దసరా పండుగ రోజు కూడా సినిమాకు ఆశించిన వసూళ్లు రాలేదని.. మంగళవారం నుంచి సినిమా పూర్తిగా పడుకున్నట్లే అని అంటున్నారు.
This post was last modified on October 25, 2023 9:27 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…