దసరా కానుకగా రిలీజైన లియో సినిమా సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైన మాట వాస్తవం. కానీ ముందస్తు హైప్ వల్ల, డివైడ్ టాక్ తట్టుకుని మంచి వసూళ్లే సాధిస్తున్నట్లు కనిపించింది. అటు తమిళంలో, ఇటు తెలుగులో ఈ చిత్రానికి భారీగానే ఓపెనింగ్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర మోత మోగించేస్తోందని లియో గురించి గొప్పలు పోయారు. యుఎస్లో ఏకంగా 18 మిలియన్ డాలర్లకు పైగా ఈ సినిమాకు వసూళ్లు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
వరల్డ్ వైడ్ రూ.300 కోట్ల మార్కును కూడా ఈ సినిమా దాటేసినట్లు చెబుతున్నారు. కానీ ఈ ఫిగర్స్ అన్నీ ఎగ్జాజరేటెడ్ అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. యుఎస్ వసూళ్ల విషయంలో ట్రాకింగ్ పక్కాగా ఉంటుందని అంటారు కానీ.. అక్కడ ట్రేడ్ పండిట్లను మేనేజ్ చేశారని.. అలాగే ప్రాక్సీ బుకింగ్స్తో సినిమాకు లేని హైప్ సృష్టించారని అంటున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
థియేటర్లలో ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్ చూపించి.. జనాల్లో హైప్ క్రియేట్ చేశారని.. ఇదంతా పెద్ద స్కామ్ అని అంటున్నారు. తమిళనాడులో సైతం వాస్తవ వసూళ్ల కంటే ప్రకటించిన ఫిగర్స్ చాలా ఎక్కువ అని.. సినిమా బ్లాక్ బస్టర్ అని నమ్మించడానికే ఇదంతా జరిగిందని జోరుగా వార్తలు వస్తున్నాయి. నిన్నట్నుంచి ట్విట్టర్లో లియో స్కామ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీని మీద బోలెడన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. దసరా పండుగ రోజు కూడా సినిమాకు ఆశించిన వసూళ్లు రాలేదని.. మంగళవారం నుంచి సినిమా పూర్తిగా పడుకున్నట్లే అని అంటున్నారు.
This post was last modified on October 25, 2023 9:27 am
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…