దసరా కానుకగా రిలీజైన లియో సినిమా సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైన మాట వాస్తవం. కానీ ముందస్తు హైప్ వల్ల, డివైడ్ టాక్ తట్టుకుని మంచి వసూళ్లే సాధిస్తున్నట్లు కనిపించింది. అటు తమిళంలో, ఇటు తెలుగులో ఈ చిత్రానికి భారీగానే ఓపెనింగ్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర మోత మోగించేస్తోందని లియో గురించి గొప్పలు పోయారు. యుఎస్లో ఏకంగా 18 మిలియన్ డాలర్లకు పైగా ఈ సినిమాకు వసూళ్లు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
వరల్డ్ వైడ్ రూ.300 కోట్ల మార్కును కూడా ఈ సినిమా దాటేసినట్లు చెబుతున్నారు. కానీ ఈ ఫిగర్స్ అన్నీ ఎగ్జాజరేటెడ్ అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. యుఎస్ వసూళ్ల విషయంలో ట్రాకింగ్ పక్కాగా ఉంటుందని అంటారు కానీ.. అక్కడ ట్రేడ్ పండిట్లను మేనేజ్ చేశారని.. అలాగే ప్రాక్సీ బుకింగ్స్తో సినిమాకు లేని హైప్ సృష్టించారని అంటున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
థియేటర్లలో ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్ చూపించి.. జనాల్లో హైప్ క్రియేట్ చేశారని.. ఇదంతా పెద్ద స్కామ్ అని అంటున్నారు. తమిళనాడులో సైతం వాస్తవ వసూళ్ల కంటే ప్రకటించిన ఫిగర్స్ చాలా ఎక్కువ అని.. సినిమా బ్లాక్ బస్టర్ అని నమ్మించడానికే ఇదంతా జరిగిందని జోరుగా వార్తలు వస్తున్నాయి. నిన్నట్నుంచి ట్విట్టర్లో లియో స్కామ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీని మీద బోలెడన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. దసరా పండుగ రోజు కూడా సినిమాకు ఆశించిన వసూళ్లు రాలేదని.. మంగళవారం నుంచి సినిమా పూర్తిగా పడుకున్నట్లే అని అంటున్నారు.
This post was last modified on October 25, 2023 9:27 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…