మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు దసరా సందర్భంగా అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరిగింది. యువి క్రియేషన్స్ నిర్మాణంలో బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహించబోయే చిత్రమిది. చిరంజీవి కెరీర్లో మైలురాయిలా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోందని చిత్ర వర్గాలు ఇంతకుముందే వెల్లడించాయి. చిరు కెరీర్లోనే అత్యధికంగా రూ.200 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు చెబుతున్నారు.
ఇంతకుముందు అనుకున్న కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమాను పక్కన పెట్టి మరీ ఈ భారీ చిత్రాన్ని తన 156వ సినిమాగా చేస్తున్నాడు చిరు. ఇది అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయమే. కానీ ఈ సినిమాకు ఎంచుకున్న సాంకేతిక నిపుణులు కొందరి విషయంలో మాత్రం మెగా అభిమానులు అంత సంతృప్తిగా లేరు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది చిరు తనయురాలు సుశ్మిత కొణిదెల విషయంలోనే.
చిరు రీఎంట్రీలో చాలా సినిమాలకు సుశ్మితనే కాస్ట్యూమ్స్ సమకూర్చింది. ఐతే చిరు స్టైలింగ్ ట్రెండీగా లేదని ఫ్యాన్సే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా భోళా శంకర్కు సుశ్మిత సమకూర్చిన కాస్ట్యూమ్స్ విషయంలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వశిష్ఠతో చేస్తున్నది భారీ బడ్జెట్ సినిమా. అది కూడా సోషియో ఫాంటసీ టచ్ ఉన్నది. ఇలాంటి వాటిలో కాస్ట్యూమ్స్ చాలా కీలకం. అలాంటపుడు ఏ నీతా లుల్లా లాంటి వాళ్లనో తీసుకోవాలి. లేదంటే రమ రాజమౌళి లాంటి వాళ్లయితే ఓకే.
కానీ రమ రాజమౌళి సినిమాలకే పరిమితం. ఆమె అందుబాటులో లేనపుడు ఇంకెవరైనా పేరున్న కాస్ట్యూమ్ డిజైనర్ను తీసుకోవాలి కానీ.. సుశ్మితకు ఇంత పెద్ద బాధ్యత ఎలా అప్పగించారని.. ఇక్కడ చిరు పుత్రికా ప్రేమను పక్కన పెట్టాల్సిందని అంటున్నారు ఫ్యాన్స్. అలాగే సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడి విషయంలోనూ ఫ్యాన్స్ సంతృప్తగా లేరు. ఛోటా సినిమాటోగ్రఫీ కొంచెం పాత స్టయిల్లో ఉంటుందని.. రత్నవేలు, మధీ, రవిచంద్రన్ లాంటి వాళ్లను ట్రై చేసి ఉండాల్సిందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…