‘పుష్ప’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ ఆనందం మామూలుగా లేదు. అవార్డు ప్రకటించినపుడే బన్నీ ఎలా సంబరాలు చేసుకున్నాడో తెలిసిందే. ఆ సందర్భంగా తన ఆనందాన్నంతా మాటల రూపంలో బయటపెట్టాడు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి అవార్డు అందుకుని వచ్చిన బన్నీ మళ్లీ మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ఏర్పాటు చేసిన అభినందన వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
ముఖ్యంగా స్కూల్ రోజులను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం తన ఎదుగుదలను పోలుస్తూ అతను మాట్లాడిన సరదా మాటలు అందరినీ నవ్వించాయి. ‘పుష్ఫ’కు గాను బన్నీతో పాటు దేవి కూడా ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవిని పక్కన పెట్టుకుని ఒక ఆసక్తికర కామెంట్ చేశాడు బన్నీ.
చెన్నైలో చిన్నపుడు కలిసి చదువుకున్న రోజుల్లో అల్లరి వాళ్లమని.. నాటు భాషలో చెప్పాలంటే చెన్నైలో పోరంబోకుల్లా తిరిగి తామిద్దరం ఇప్పుడు జాతీయ అవార్డులు అందుకోవడం విచిత్రమని.. ఇదే విషయం తన తండ్రి చెప్పి జోక్ పేల్చారని బన్నీ అన్నాడు. అలాగే చెన్నైలో తనతో కలిసి చదువుకున్న మరో ఫ్రెండ్ ఫోన్ చేసి స్కూల్లో ప్రిన్సిపల్ దగ్గర టీసీలు తీసుకోవడమే తెలిసిన నువ్వు.. ఇప్పుడిలా ప్రెసిడెంట్ దగ్గర మెడల్ తీసుకోవడం ఏంటి అంటూ, ఇది తనకెంతో బాధ కలిగిస్తోందని అన్నాడని బన్నీ గుర్తు చేసుకున్నాడు.
మరోవైపు తనకు అవార్డు రావడంలో మేజర్ క్రెడిట్ సుకుమార్కే దక్కుతుందని బన్నీ అన్నాడు. తనకు అవార్డు రావాలని తనతో పాటు చుట్టూ ఉన్నవాళ్లు కోరుకున్నారని.. సుకుమార్ తనకన్నా ఎక్కువ కోరుకున్నాడని.. అందుకే తనకు అవార్డు వచ్చిందని.. తాను ఈ స్థాయిలో ఉండటానికి సుకుమారే కారణమని.. తాను అచీవ్మెంట్ అయితే.. సుకుమార్ అచీవర్ అని తన ఫేవరెట్ డైరెక్టర్ని కొనియాడాడు బన్నీ.
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…