ఆర్ఎక్స్ 100తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి. తన తొలి చిత్రానికి వెరైటీ టైటిల్ పెట్టిన అజయ్.. రెండో సినిమాకు మహాసముద్రం అనే మంచి వెయిట్ ఉన్న టైటిల్ పెట్టాడు. కానీ అది సరైన ఫలితాన్నివ్వలేదు. మూడో చిత్రానికి మంగళవారం అనే మరో డిఫరెంట్ టైటిల్ పెట్టాడు. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి కలగడానికి తొలి కారణం టైటిలే. ఆ టైటిల్తో ముడిపడి ఒక బూతు సామెత ఉండటంతో.. బోల్డ్ డైరెక్టర్గా పేరున్న అజయ్ భూపతి ఆ కోణంలోనే టైటిల్ పెట్టాడేమో అన్న సందేహాలు కలిగాయి.
కానీ మంగళవారం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో టైటిల్ విషయమై అతను వివరణ ఇచ్చాడు. అందరూ అనుకుంటున్న బూతు సామెతకు ఈ టైటిల్కు ఏ సంబంధం లేదని అజయ్ స్పష్టత ఇచ్చాడు. సోషల్ మీడియాలో టైటిల్ గురించి రకరకాలుగా అనుకుంటుండటం చూశానని.. కానీ సినిమా చూస్తే ఆ ప్రచారాలకు టైటిల్కు సంబంధం ఏమీ లేదని అర్థమవుతుందని అజయ్ తెలిపాడు. ఈ చిత్రానికి ఇది యాప్ట్ టైటిల్ అని.. రేప్పొద్దున సినిమా చూసినపుడు అది ప్రేక్షకులకు బాగా అర్థమవుతుందని అజయ్ తెలిపాడు.
ఇక ఈ సినిమా కథ గురించి చెబుతూ.. ఇండియాలో ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్ను తాను టచ్ చేశానని నమ్ముతున్నానని అజయ్ తెలిపాడు. ఆర్ఎక్స్ 100లో ఒక కొత్త కథను చూసి ప్రేక్షకులు గొప్పగా ఆదరించారని.. మంగళవారం సినిమాలో కూడా అలాంటి కొత్త కథనే చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉందని అజయ్ తెలిపాడు. తన రెండో సినిమా మహాసముద్రం ఫ్లాప్ అయినప్పటికీ.. అది తీసింది కూడా తానే కాబట్టి దాన్ని ఇష్టపడతానని.. అందుకే పోస్టర్ మీద ఆ సినిమా పేరు కూడా వేశానని అజయ్ చెప్పాడు. త్వరలో తాను కార్తికేయ హీరోగా ఓ భారీ చిత్రం చేయనున్నట్లు అజయ్ వెల్లడించాడు.
This post was last modified on October 22, 2023 10:13 am
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…