మన దేశంలో ఇప్పటిదాకా వచ్చిన కొన్ని వందల గ్యాంగ్ స్టర్ సినిమాల్లో ‘నాయకుడు’ది ప్రత్యేక స్థానం. కమల్ హాసన్ హీరోగా ప్రముఖ డాన్ వరదరాజన్ ముదలియార్ ని స్ఫూర్తిగా తీసుకుని మణిరత్నం చెక్కిన ఈ అద్భుత దృశ్య కావ్యం దశాబ్దాలు గడుస్తున్నా ఎవర్ గ్రీన్ అనిపిస్తూనే ఉంటుంది. మూడు వయసులకు సంబంధించిన షేడ్స్ లో లోకనాయకుడు ఇచ్చిన పెర్ఫార్మన్స్ ఎప్పటికీ మర్చిపోలేం. 1987లో వచ్చిన ఈ క్లాసిక్ ని ఇప్పటి తరం యువకులు, మధ్య వయస్కులు థియేటర్లలో చూడకలేకపోయారు. యూట్యూబ్, టీవీ ఛానల్స్ లో తప్ప ఇంకో చోట అనుభూతి దక్కలేదు.
ఇంత గొప్ప క్లాసిక్ మళ్ళీ వెండితెర మీద వస్తోందంటే అంతకన్నా శుభవార్త ఏముంటుంది. నవంబర్ 3 నాయగన్ ని భారీ ఎత్తున రీ రిలీజ్ చేయబోతున్నారు. ప్రింట్ ని 4Kకి మార్చి డాల్బీ అట్మోస్ సౌండ్ జోడించి, కలర్ కరెక్షన్ తో పాటుగా స్కోప్ లోకి కూడా మారుస్తారట. తమిళనాడులో 120 థియేటర్లతో ప్రస్తుతం ఒప్పందం జరిగినట్టు టాక్. కేరళలోనూ భారీ విడుదలకు రంగం సిద్ధమయ్యింది. కన్నడ డబ్బింగ్ చేసే పనుల్లో టీమ్ బిజీగా ఉంది. ట్రాజెడీ ఏంటంటే నాయకుడు తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేసే ఆలోచన చేయకపోవడం. ఆ దిశగా సూచనలు లేకపోవడం.
అప్పట్లో నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గొప్పగా ఆడింది. కొన్ని వంద రోజుల సెంటర్లున్నాయి. హోమ్ వీడియో అమ్మకాల్లో రికార్డులు సృష్టించింది. సౌత్ భాషలు అందరికీ చేరవేస్తున్నప్పుడు తెలుగు వాళ్ళు మాత్రం ఏం అన్యాయం చేశారని మూవీ లవర్స్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి జనరేషన్ కు నాయకుడు లాంటి క్లాసిక్స్ ని పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లియోలు జవాన్ లు చూసి ఊగిపోతున్న యువతకు రియల్ ఫిలిం మేకింగ్ అంటే ఏంటో తెలియాలంటే వీటిని థియేటర్లకు తీసుకురావాలి. కాకపోతే తెలుగు ఫ్యాన్స్ ఏదో దురదృష్టం చేసినట్టు ఇక్కడ మాత్రం ఆ ఊసే లేదు.
This post was last modified on October 21, 2023 7:31 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…