తాము విధించిన ఎనిమిది వారాల ఓటిటి గడువు పాటించనందుకు లియో రిలీజును నిషేదించిన ఉత్తరాది మల్టీప్లెక్సులు దానికి తగ్గ మూల్యాన్నే చెల్లించుకుంటున్నాయి. పివిఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్ తదితర సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయం చివరికి వారికే చేటు చేసింది. లియో టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు నెమ్మదిస్తుందో తెలియదు కానీ ప్రస్తుతానికి జోరు మాత్రం గట్టిగానే ఉంది. పరిమిత హిందీ వెర్షన్ రిలీజులోనూ సింగల్ స్క్రీన్ల మద్దతుతో మొదటి రోజు నాలుగు కోట్లకు పైగా వసూలు చేయడం మాములు విషయం కాదు.
దసరా పండగకు టైగర్ శ్రోఫ్ గణపథ్ పెద్ద ఫీడింగ్ ఇస్తుందని మల్టీప్లెక్సులు ఆశపడ్డాయి. కానీ తీరా చూస్తే అదేమో డిజాస్టర్ కా బాప్ తరహాలో ప్రేక్షకులతో బాబోయ్ అనిపించేసుకుని పెద్ద గునపం దింపేసుకుంది. వసూళ్లు సదరు హీరో కెరీర్ లోనే అత్యంత తక్కువగా నమోదయ్యాయి. టాక్ చూసిన జనాలు టికెట్లు బుక్ చేసుకోవడానికి భయపడుతున్నారు. దీనికన్నా యాభై రోజులకు దగ్గరగా ఉన్న జవాన్ చూడటమే నయమని ఫీలవుతున్నారు. దీన్ని బాట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నవంబర్ 12 టైగర్ 3 వచ్చే దాకా లెక్కలేనన్ని క్యాన్సిల్ షోలు వెక్కరించబోతున్నాయి.
విచిత్రంగా ఇవే మల్టీప్లెక్సులు లియోని దక్షిణాది రాష్ట్రాల్లో స్క్రీనింగ్ చేసుకుంటున్నాయి. తెలుగు తమిళ వెర్షన్లతో శుభ్రంగా సొమ్ములు చేసుకుంటున్నాయి. నిజానికి ఈ ఎనిమిది వారాల కండీషన్ ని బాలీవుడ్ నిర్మాతలు కిమ్మనకుండా భరిస్తున్నారు. దీని వల్ల ఓటిటిలో వచ్చే రెవిన్యూకి భారీ కోత పడుతున్నా మౌనం పాటిస్తున్నారు. లియోని భారీ రేటుకి సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ నాలుగు వారాల థియేట్రికల్ రన్ పూర్తయిన వెంటనే ఓటిటి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. మొత్తానికి లియో వదిలేసినందుకు గణపథ్ ని నమ్ముకున్నందుకు నార్త్ మల్టీప్లెక్సులకు పెద్ద దెబ్బే పడింది.
This post was last modified on October 21, 2023 7:13 pm
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…