Movie News

మైత్రి థియేటర్ల వెనుక అసలు కథేంటి

మొదలుపెట్టిన తక్కువ సమయంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగి ఉప్పెన, పుష్పలతో జాతీయ అవార్డులు సాధించే స్థాయికి చేరుకున్న మైత్రి మూవీ మేకర్స్ తాజాగా థియేటర్ల నిర్మాణంలోకి అడుగు పెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి రిలీజుల సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టిన ఈ టాప్ బ్యానర్ ఇప్పుడు ఎగ్జిబిషన్ రంగంలోనూ కాలు పెట్టడం ద్వారా కొత్త సంకేతాలు ఇస్తోంది. పలు చోట్ల నిర్వహణ భారమైన హాళ్లను లీజుకు తీసుకోవడంతో పాటు అనువైన ప్రదేశాల్లో కొత్తగా నిర్మించే ప్రతిపాదనలను సీరియస్ గా విశ్లేషిస్తోంది. ఏడాది రెండేళ్లలో పెద్ద నెంబర్ ని సమీకరించబోతోంది

దీని వెనుక పలు ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ తెలంగాణలో థియేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఏదైనా చిన్న సినిమా విడుదల చేయాలంటే పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఈ మధ్య కాలంలో మైత్రి పలు తక్కువ బడ్జెట్ చిత్రాలకు చేయూతనిచ్చి రిలీజ్ కు సహకరించింది. అవి ఫ్లాప్ అవుతూ బ్రాండ్ ఇమేజ్ పరంగా కొంత ఇబ్బంది ఎదురవుతున్నా సరే ముందుకెళ్లేందుకే నిర్ణయించుకుంది. అయితే చేతిలో థియేటర్లు లేని కారణంగా అసలు కంటే కొసరు ఖర్చులు ఎక్కువన్నట్టు షోలకొచ్చే కలెక్షన్ కన్నా వాటిని వేసేందుకు అవుతున్న బిల్లే తడిసి మోపెడవుతోంది.

ఇది క్రమంగా లక్షల నుంచి కోట్లకు చేరే ప్రమాదం ఉంది. ఒకవేళ మనవే స్వంతంగా థియేటర్లు ఉంటే ఈ సమస్య రాదు. అద్దెలు, ఖర్చులు, జీతాలు స్వంతంగా చూసుకోవచ్చు. పైగా తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు పెద్ద సినిమాలకు సైతం మైత్రికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చిరంజీవి, బాలయ్యలాంటి పెద్ద హీరోలతో చేసినా ఒక డబ్బింగ్ మూవీకి మంచి స్క్రీన్లు వెళ్లడం ఆపలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇలాంటి గుత్తాధిపత్యానికి చెక్ పెట్టాలంటే ఆసియన్, దిల్ రాజు, సురేష్, గీత బాటలో వెళ్లడమే కరెక్టని భావించిన మైత్రి దానికి అనుగుణంగానే కొత్త వ్యాపారంలో అడుగుపెడుతోంది. 

This post was last modified on October 21, 2023 1:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

50 minutes ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

2 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

2 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

3 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

12 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

12 hours ago