బాక్సాఫీస్ దగ్గర లియో జోరు బాగానే ఉంది కానీ డివైడ్ టాక్ కొనసాగుతున్న మాట వాస్తవం. తమిళం సంగతి పక్కనపెడితే తెలుగులో అంచనాలు అందుకోలేదని ఫ్యాన్స్ ఓపెన్ గా చెప్పేస్తున్నారు. పండగ సీజన్ తో పాటు వరస సెలవులు, లోకేష్ కనగరాజ్ టేకింగ్ కి ఉన్న విపరీతమైన ఫాలోయింగ్, విజయ్ ఇమేజ్ ఇవన్నీకలెక్షన్లు పడిపోకుండా నిలబెడుతున్నాయి. భగవంత్ కేసరి మాస్ ని ఫ్యామిలీస్ ఆకట్టుకుంటున్నా లియో వైపు యూత్ మొగ్గు చూపుతున్నారు. అది థియేటర్లలో జనాన్ని చూస్తే అర్థమైపోతుంది. వచ్చే బుధవారం దాకా ఇలాగే స్టడీగా ఉండే అవకాశాలను కొట్టి పారెయలేం.
మొదటి రోజు వరల్డ్ వైడ్ అన్ని వెర్షన్లు కలిపి 148 కోట్ల గ్రాస్ వచ్చినట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కోలీవుడ్ లో ఇదే నెంబర్ వన్. ఏపీ తెలంగాణలో 16 కోట్లు వచ్చాయి. ఒకవేళ లియో కనక విక్రమ్, ఖైదీ రేంజ్ టాక్ తెచ్చుకుని ఉంటే ఏం జరిగేదంటే ఊహించుకోవడం కష్టమే. కెజిఎఫ్ ని లక్ష్యంగా పెట్టుకునేంత స్టామినా దీనికి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బెనిఫిట్ షోలు లేకుండానే సులభంగా వంద కోట్లు దాటేసి డివైడ్ టాక్ తోనూ రెండో రోజు స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించడం అంటే మాటలు కాదు. మేనియా ఆ రేంజ్ లో ఉంది మరి.
ఇదంతా లోకేష్ దృష్టికి వెళ్లకుండా ఉండదు. నెక్స్ట్ చేయబోయే రజనీకాంత్ సినిమాకి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాడు. లియోకి ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్ ని స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పాడు. మరి తలైవర్ కు కొత్త కథ రాసుకున్నాడా లేక మళ్ళీ ఇన్స్ పిరేషన్ అంటాడా వేచి చూడాలి. ఏది ఏమైనా విజయ్ మార్కెట్ పెరిగిపోయిన విషయాన్ని లియో మరోసారి స్పష్టం చేసింది. ఈసారి తుపాకీ లాంటి సబ్జెక్టు, దర్శకుడు దొరికితే మాత్రం బాహుబలి, ఆర్ఆర్ఆర్ లను టార్గెట్ చేసుకోవచ్చు. అభిమానులు మాత్రం రాజమౌళి కాంబోని కోరుకుంటున్నారు. అది మాత్రం జరగని పనే. జక్కన్న తెలుగుకే సొంతం.
This post was last modified on October 21, 2023 10:37 am
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…