బాక్సాఫీస్ దగ్గర లియో జోరు బాగానే ఉంది కానీ డివైడ్ టాక్ కొనసాగుతున్న మాట వాస్తవం. తమిళం సంగతి పక్కనపెడితే తెలుగులో అంచనాలు అందుకోలేదని ఫ్యాన్స్ ఓపెన్ గా చెప్పేస్తున్నారు. పండగ సీజన్ తో పాటు వరస సెలవులు, లోకేష్ కనగరాజ్ టేకింగ్ కి ఉన్న విపరీతమైన ఫాలోయింగ్, విజయ్ ఇమేజ్ ఇవన్నీకలెక్షన్లు పడిపోకుండా నిలబెడుతున్నాయి. భగవంత్ కేసరి మాస్ ని ఫ్యామిలీస్ ఆకట్టుకుంటున్నా లియో వైపు యూత్ మొగ్గు చూపుతున్నారు. అది థియేటర్లలో జనాన్ని చూస్తే అర్థమైపోతుంది. వచ్చే బుధవారం దాకా ఇలాగే స్టడీగా ఉండే అవకాశాలను కొట్టి పారెయలేం.
మొదటి రోజు వరల్డ్ వైడ్ అన్ని వెర్షన్లు కలిపి 148 కోట్ల గ్రాస్ వచ్చినట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కోలీవుడ్ లో ఇదే నెంబర్ వన్. ఏపీ తెలంగాణలో 16 కోట్లు వచ్చాయి. ఒకవేళ లియో కనక విక్రమ్, ఖైదీ రేంజ్ టాక్ తెచ్చుకుని ఉంటే ఏం జరిగేదంటే ఊహించుకోవడం కష్టమే. కెజిఎఫ్ ని లక్ష్యంగా పెట్టుకునేంత స్టామినా దీనికి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బెనిఫిట్ షోలు లేకుండానే సులభంగా వంద కోట్లు దాటేసి డివైడ్ టాక్ తోనూ రెండో రోజు స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించడం అంటే మాటలు కాదు. మేనియా ఆ రేంజ్ లో ఉంది మరి.
ఇదంతా లోకేష్ దృష్టికి వెళ్లకుండా ఉండదు. నెక్స్ట్ చేయబోయే రజనీకాంత్ సినిమాకి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాడు. లియోకి ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్ ని స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పాడు. మరి తలైవర్ కు కొత్త కథ రాసుకున్నాడా లేక మళ్ళీ ఇన్స్ పిరేషన్ అంటాడా వేచి చూడాలి. ఏది ఏమైనా విజయ్ మార్కెట్ పెరిగిపోయిన విషయాన్ని లియో మరోసారి స్పష్టం చేసింది. ఈసారి తుపాకీ లాంటి సబ్జెక్టు, దర్శకుడు దొరికితే మాత్రం బాహుబలి, ఆర్ఆర్ఆర్ లను టార్గెట్ చేసుకోవచ్చు. అభిమానులు మాత్రం రాజమౌళి కాంబోని కోరుకుంటున్నారు. అది మాత్రం జరగని పనే. జక్కన్న తెలుగుకే సొంతం.
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…