ప్రస్తుత సమాజంలో మృగం మనిషి కలిసిన మృగాళ్లు ఎక్కువైపోయారు. తమ కామ వాంఛ తీర్చుకోవడం కోసం వయసు తారతమ్యం లేకుండా మూడేళ్ళ పాపతో మొదలుపెట్టి పండుముసలి దాకా అందరి మీద అఘాయిత్యాలకు ఒడిగడుతున్న తీరు నిత్యం పేపర్లు, న్యూస్ ఛానల్స్ లో చూస్తూనే ఉన్నాం. అయినా చట్టంలోని లొసుగులను వాడుకుని నిందితులు నిర్భయంగా బయటికి వచ్చి తిరిగి మళ్ళీ తెగబడుతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా ఇందులో మాత్రం మార్పు లేదు. భగవంత్ కేసరిలో ఈ సున్నితమైన అంశం గురించి చెప్పిన తీరు చప్పట్లు అందుకుంటోంది.
సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక కీలక ఎపిసోడ్లో బాలయ్య ఓ స్కూల్ కు వెళ్లి పసిపాపలు చిన్నతనం నుంచే తమకు ఎదురయ్యే లైంగిక స్పర్శలకు ఎలా స్పందించాలి, తల్లికి ఎలా చెప్పాలనే దాని గురించి హత్తుకునేలా ప్రసంగిస్తాడు. వరస ఏదైనా సరే ఆఖరికి తండ్రైనా తప్పని చెప్పే హక్కు అందరికీ ఉంటుందని చెప్పిన విధానం ఫ్యామిలీ ఆడియన్స్ కి సూటిగా తాకుతోంది. నిజానికి ఇలాంటి విషయాలు తరచుగా సినిమాల్లో చర్చిస్తూ ఉండాలి. అప్పుడే తల్లితండ్రులకు పిల్లలకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలనే దాని మీద స్పష్టత వస్తుంది. స్కూళ్లలో కూడా ఇలాంటివి అమలు పరచాలి.
ఈ పాయింట్ నే అనిల్ రావిపూడి సూటిగా సంభాషణల రూపంలో బాలయ్యతో చెప్పించాడు. శ్రీలీల పాత్ర మానసికంగా, శారీరకంగా రాటు దేలడానికి లింక్ పెట్టిందే అయినా ఈ సీన్ జరుగుతున్న కాసేపు పిల్లల పేరెంట్స్ మనసులు భావోద్వేగంతో నిండిన మాట వాస్తవం. బాక్సాఫీస్ వద్ద భగవంత్ కేసరి ఏ స్థాయి విజయం, ఫలితం అందుకుంటాడనేది తేలడానికి ఇంకో రెండు మూడు రోజులు ఎదురు చూడాలి. లియో వీక్ అయ్యేలా ఉంది. టైగర్ నాగేశ్వరరావు టాక్ ని బట్టి బాలయ్య దూకుడు మరింత పెరుగుతుందా లేక ఉన్నదే కొనసాగుతుందా అనేది డిసైడ్ అవుతుంది.
This post was last modified on October 20, 2023 12:03 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…