గత వారం పది రోజులుగా లియో విడుదల దగ్గరగా పెట్టుకుని రామ్ చరణ్ క్యామియో గురించి ఎంత విపరీత ప్రచారం జరిగిందో చూస్తూనే ఉన్నాం. మా సైట్ నిర్ధారణగా గత వారమే ఎలాంటి అతిధి పాత్రలు లేవని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా ఇవాళ థియేటర్లలో ఏమైనా సర్ప్రైజ్ ఉంటుందేమోనని కొన ఆశతో ఎదురు చూసిన అభిమానులకు నిరాశ మిగిలింది. చరణ్ కాదు కదా కనీసం వాయిస్ ఓవర్ కూడా లియోలో లేదు. కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్ లలో ఒకరు కనిపించవచ్చన్న అంచనా కూడా తప్పయ్యింది. ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనని క్లారిటీ వచ్చేసింది.
నిజానికి ఈ వార్త విపరీతంగా చక్కర్లు కొడుతున్నా, లియోకు పనిచేసిన కొందరు టీమ్ సభ్యులు పలు ఇంటర్వ్యూలలో చెప్పినా ప్రొడక్షన్ హౌస్ పట్టించుకోనట్టు వదిలేసింది. ఎంత పుకారైనా సరే హైప్ పెంచడానికి పనికి వస్తోందని నిర్మాతలు మౌనం వహించారు. కట్ చేస్తే అది నిజంగానే బజ్ తీసుకొచ్చింది. చాలా మంది మెగా ఫ్యాన్స్ ఆ మాటలు నమ్మి బెనిఫిట్ షోలకు వెళ్లారు. లోకేష్ సినిమాటిక్ యునివర్స్ పేరుతో తన హీరోలందరినీ కలిపే పనిలో ఉన్న కనగరాజ్ ఇందులో మాత్రం ఏ క్యామియో లేకుండా నిరాశ పరిచిన మాట వాస్తవం. విజయ్ తప్ప ఇంకెవరు కనిపించరు.
నిజానికి స్క్రీన్ మీద కొన్ని సెకండ్లు అయినా సరే ఇతర హీరో డామినేట్ చేయడం విజయ్ ఒప్పుకోడనే టాక్ చెన్నై వర్గాల్లో ఉంది. అలాంటప్పుడు చరణ్ కు ఎస్ చెప్తాడని అనుకోలేం. ఖైదీ, విక్రమ్ ల నుంచి రెండు మూడు పాత్రలను తిరిగి తీసుకొచ్చిన లోకేష్ ఒక్క నెపోలియన్ కు మాత్రమే మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో లియో టాక్ ఏమంత ఆశాజనకంగా లేదు. అంచనాలు విపరీతం కావడంతో వాటిని అందుకోవడంలో తడబడినట్టు రిపోర్ట్స్, రివ్యూలు చెబుతున్నాయి. భగవంత్ కేసరికి మాస్ వర్గాల మద్దతు దక్కేలా ఉండటంతో లాంగ్ రన్ లియో మేజిక్ జరగడం అనుమానమే.
This post was last modified on October 19, 2023 7:58 pm
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…