అనుకున్నదే అయింది. ఇప్పటికే 2023 సంక్రాంతికి మ్యాడ్ రష్ కనిపిస్తుండగా.. విజయ్ దేవరకొండ కూడా ఆ పండుగ రేసులోకి వచ్చేశాడు. అతడి కొత్త చిత్రం ఫ్యామిలీ స్టార్ను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న విషయం అధికారికం అయింది. ఈ సినిమాకు అందరూ అనుకున్నట్లే ఫ్యామిలీ స్టార్ టైటిల్ ఖరారు చేసి టీజర్ వదిలారు. ఆ టీజర్ ఆసక్తికరంగా సాగింది.
పద్ధతిగా ఫ్యామిలీని నడిపించే మధ్య తరగతి వ్యక్తి.. సెటిల్మెంట్లోకి దిగితే ఎలా ఉంటుందో ఈ టీజర్లో చూపించారు. టీజర్ షార్ట్ అండ్ స్వీట్గా సాగి యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకుంది. గీత గోవిందం తర్వాత పరశురామ్తో విజయ్ చేసిన సినిమా కావడంతో దీనిపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండటం కూడా అంచనాలను పెంచేదే.
పాజిటివ్ ఫీల్ ఇచ్చిన టీజర్లో ఒక విశేషాన్ని సినీ ప్రియులు పట్టేశారు. టీజర్లో కొన్ని క్షణాలే కనిపించిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వేసుకున్న డ్రెస్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ డ్రెస్.. సర్కారు వారి పాటలో ఒక సీన్లో హీరోయిన్ కీర్తి సురేష్ వేసుకున్న డ్రెస్కు డిట్టోలా ఉండటం విశేషం. ఇలా హీరోయిన్లు వేర్వేరు సినిమాల్లో ఒకే రకం డ్రెస్లు వేయడం అరుదు. చీరల్లో కలర్లు మ్యాచ్ అయితే ఏమో అనుకోవచ్చు కానీ.. ఇలా సేమ్ డ్రెస్ వేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఇది యాదృచ్ఛికంగా జరిగి ఉంటుందని చాలామంది అనుకోవట్లేదు. పరశురామ్ ఉద్దేశపూర్వకంగానే కథానాయికగా ఈ డ్రెస్ వేయించి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రేక్షకులను టీజ్ చేయడానికే ఇలా చేసి ఉండొచ్చు, లేదా క్యారెక్టర్లలో ఏదైనా కనెక్షన్ ఉంటే ఉండొచ్చు. ఈ మధ్య సినిమాటిక్ యూనివర్శ్ ట్రెండ్ పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని కూడా ఆ కోణంలో చూస్తూ పెట్లావర్స్ అంటూ దీనికి నామకరణం చేసేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on October 19, 2023 10:15 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…