పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల్లో తరుణ్ భాస్కర్ సెన్సాఫ్ హ్యూమర్ ఎలాంటిందో అందరూ చూశారు. ఈ రోజే రిలీజైన తరుణ్ కొత్త చిత్రం కీడా కోలాలోనూ కావాల్సినంత ఫన్ ఉంటుందని అర్థమైంది. సినిమాల్లోనే కాదు.. బయట కూడా తరుణ్ చాలా ఫన్నీగా మాట్లాడతాడన్న సంగతి తెలిసిందే. కీడా కోలా ట్రైలర్ లాంచ్ సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్లో అతను చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఈ ప్రెస్ మీట్కు హాజరైన టీం సభ్యులు, అలాగే జర్నలిస్టులు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుని ఆడిటోరియం నుంచి బయటికి వెళ్లారు. ఆ స్థాయిలో తన పంచులతో అందరినీ నవ్వించాడు తరుణ్. అలా అని అదేదో ప్లాన్ చేసుకుని వచ్చినట్లు, పబ్లిసిటీ కోసం చేసినట్లు కాకుండా.. స్పాంటేనియస్గా తరుణ్ కామెడీ పండించడం హైలైట్.
వరుసగా సురేష్ బాబుతోనే సినిమాలు చేస్తున్నారేంటి.. ఆ కాంపౌండ్లో మిమ్మల్ని కట్టేశారా అని అడిగితే.. తానే సురేష్ బాబును కట్టేశానని.. ఆయనే వచ్చి ఇంకెప్పుడు సినిమా పూర్తి చేస్తావ్ అని ఫ్రస్టేట్ అవుతుంటానని అన్నాడు తరుణ్. ఇక సురేష్ బాబుతోనే సినిమాలు చేయడం గురించి స్పందిస్తూ.. తనకు న్యూమరాలజీ మీద నమ్మకాలెక్కువ అని.. సురేష్ పేరు ఉంటే చాలు ఎవరితో అయినా సినిమాలు చేస్తానని.. సురేష్ కొండేటితో అయినా సినిమాకు రెడీ అంటూ పంచ్ వేశాడు తరుణ్.
ఇక తాను నటనలోకి రావడం గురించి స్పందిస్తూ.. కొన్నేళ్ల ముందు తాను జబర్దస్త్ ప్రోగ్రాంకు వెళ్లానని.. ఆ తర్వాతి రోజు ఇస్త్రీ చేసే ఒకతను మీరు జబర్దస్త్ కదా అని గుర్తుపట్టాడని.. రెండు జాతీయ అవార్డులు తెచ్చుకున్న దర్శకుడిగా మాత్రం తనను ఎవరూ గుర్తించలేదని.. అందుకే తన ఫేస్ అందరికీ తెలియాలని నటిస్తున్నట్లు తరుణ్ చెప్పడం విశేషం. ఇలా ఆద్యంతం పంచులతో, నవ్వులతో సాగిపోయిన ఈ ప్రెస్ మీట్ తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
This post was last modified on October 18, 2023 10:33 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…