పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల్లో తరుణ్ భాస్కర్ సెన్సాఫ్ హ్యూమర్ ఎలాంటిందో అందరూ చూశారు. ఈ రోజే రిలీజైన తరుణ్ కొత్త చిత్రం కీడా కోలాలోనూ కావాల్సినంత ఫన్ ఉంటుందని అర్థమైంది. సినిమాల్లోనే కాదు.. బయట కూడా తరుణ్ చాలా ఫన్నీగా మాట్లాడతాడన్న సంగతి తెలిసిందే. కీడా కోలా ట్రైలర్ లాంచ్ సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్లో అతను చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఈ ప్రెస్ మీట్కు హాజరైన టీం సభ్యులు, అలాగే జర్నలిస్టులు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుని ఆడిటోరియం నుంచి బయటికి వెళ్లారు. ఆ స్థాయిలో తన పంచులతో అందరినీ నవ్వించాడు తరుణ్. అలా అని అదేదో ప్లాన్ చేసుకుని వచ్చినట్లు, పబ్లిసిటీ కోసం చేసినట్లు కాకుండా.. స్పాంటేనియస్గా తరుణ్ కామెడీ పండించడం హైలైట్.
వరుసగా సురేష్ బాబుతోనే సినిమాలు చేస్తున్నారేంటి.. ఆ కాంపౌండ్లో మిమ్మల్ని కట్టేశారా అని అడిగితే.. తానే సురేష్ బాబును కట్టేశానని.. ఆయనే వచ్చి ఇంకెప్పుడు సినిమా పూర్తి చేస్తావ్ అని ఫ్రస్టేట్ అవుతుంటానని అన్నాడు తరుణ్. ఇక సురేష్ బాబుతోనే సినిమాలు చేయడం గురించి స్పందిస్తూ.. తనకు న్యూమరాలజీ మీద నమ్మకాలెక్కువ అని.. సురేష్ పేరు ఉంటే చాలు ఎవరితో అయినా సినిమాలు చేస్తానని.. సురేష్ కొండేటితో అయినా సినిమాకు రెడీ అంటూ పంచ్ వేశాడు తరుణ్.
ఇక తాను నటనలోకి రావడం గురించి స్పందిస్తూ.. కొన్నేళ్ల ముందు తాను జబర్దస్త్ ప్రోగ్రాంకు వెళ్లానని.. ఆ తర్వాతి రోజు ఇస్త్రీ చేసే ఒకతను మీరు జబర్దస్త్ కదా అని గుర్తుపట్టాడని.. రెండు జాతీయ అవార్డులు తెచ్చుకున్న దర్శకుడిగా మాత్రం తనను ఎవరూ గుర్తించలేదని.. అందుకే తన ఫేస్ అందరికీ తెలియాలని నటిస్తున్నట్లు తరుణ్ చెప్పడం విశేషం. ఇలా ఆద్యంతం పంచులతో, నవ్వులతో సాగిపోయిన ఈ ప్రెస్ మీట్ తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
This post was last modified on October 18, 2023 10:33 pm
జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…
మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…
జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…
భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన…