పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల్లో తరుణ్ భాస్కర్ సెన్సాఫ్ హ్యూమర్ ఎలాంటిందో అందరూ చూశారు. ఈ రోజే రిలీజైన తరుణ్ కొత్త చిత్రం కీడా కోలాలోనూ కావాల్సినంత ఫన్ ఉంటుందని అర్థమైంది. సినిమాల్లోనే కాదు.. బయట కూడా తరుణ్ చాలా ఫన్నీగా మాట్లాడతాడన్న సంగతి తెలిసిందే. కీడా కోలా ట్రైలర్ లాంచ్ సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్లో అతను చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఈ ప్రెస్ మీట్కు హాజరైన టీం సభ్యులు, అలాగే జర్నలిస్టులు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుని ఆడిటోరియం నుంచి బయటికి వెళ్లారు. ఆ స్థాయిలో తన పంచులతో అందరినీ నవ్వించాడు తరుణ్. అలా అని అదేదో ప్లాన్ చేసుకుని వచ్చినట్లు, పబ్లిసిటీ కోసం చేసినట్లు కాకుండా.. స్పాంటేనియస్గా తరుణ్ కామెడీ పండించడం హైలైట్.
వరుసగా సురేష్ బాబుతోనే సినిమాలు చేస్తున్నారేంటి.. ఆ కాంపౌండ్లో మిమ్మల్ని కట్టేశారా అని అడిగితే.. తానే సురేష్ బాబును కట్టేశానని.. ఆయనే వచ్చి ఇంకెప్పుడు సినిమా పూర్తి చేస్తావ్ అని ఫ్రస్టేట్ అవుతుంటానని అన్నాడు తరుణ్. ఇక సురేష్ బాబుతోనే సినిమాలు చేయడం గురించి స్పందిస్తూ.. తనకు న్యూమరాలజీ మీద నమ్మకాలెక్కువ అని.. సురేష్ పేరు ఉంటే చాలు ఎవరితో అయినా సినిమాలు చేస్తానని.. సురేష్ కొండేటితో అయినా సినిమాకు రెడీ అంటూ పంచ్ వేశాడు తరుణ్.
ఇక తాను నటనలోకి రావడం గురించి స్పందిస్తూ.. కొన్నేళ్ల ముందు తాను జబర్దస్త్ ప్రోగ్రాంకు వెళ్లానని.. ఆ తర్వాతి రోజు ఇస్త్రీ చేసే ఒకతను మీరు జబర్దస్త్ కదా అని గుర్తుపట్టాడని.. రెండు జాతీయ అవార్డులు తెచ్చుకున్న దర్శకుడిగా మాత్రం తనను ఎవరూ గుర్తించలేదని.. అందుకే తన ఫేస్ అందరికీ తెలియాలని నటిస్తున్నట్లు తరుణ్ చెప్పడం విశేషం. ఇలా ఆద్యంతం పంచులతో, నవ్వులతో సాగిపోయిన ఈ ప్రెస్ మీట్ తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
This post was last modified on October 18, 2023 10:33 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…