ఇంకొన్ని గంటల్లో ‘లియో’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజవుతోంది. ఈ ఏడాదికి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకునే సినిమాగా ‘లియో’ నిలిచే అవకాశాలను కొట్టిపారేయలేం. యుఎస్లో ఈ రోజు అర్ధరాత్రి సమయానికే ‘లియో’ షోలు మొదలైపోతాయి. తెలుగులో ఉదయం 7 గంటల నుంచే షోలు పడుతున్నాయి. కర్ణాటక, కేరళలో కూడా అర్లీ మార్నింగ్ షోలు ప్లాన్ చేశారు.
కానీ ఈ తమిళ సినిమాకు తమిళనాట మాత్రం ఉదయం 9 లోపు సినిమా చూసే అవకాశం లేదు. ఇది విజయ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఒకప్పుడు ప్రతి పెద్ద సినిమాకు తెల్లవారుజామున 4 గంటలకే షోలు మొదలైపోయేవి. అప్పుడు అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. కానీ ఈ మధ్య స్టాలిన్ సర్కారు బెనిఫిట్ షోల విషయంలో చాలా స్ట్రిక్టుగా ఉంటోంది. ఆ షోలన్నింటినీ రద్దు చేసింది.
త్వరలో విజయ్ రాజకీయ రంగప్రవేశం చేస్తాడని భావిస్తున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా తన సినిమాను టార్గెట్ చేస్తున్నారని అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చి ఉదయం 9కి ముందు ప్రదర్శన మొదలు కాకూడదని అనడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అర్లీ మార్నింగ్ షోల కోసం గవర్నర్ను కలిసినా, కోర్టుకు వెళ్లినా కూడా ఫలితం లేకపోయింది. ఉదయం 7 నుంచి షోలు మొదలయ్యేలా చూడాలని కోర్టు ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇచ్చినా కూడా స్టాలిన్ సర్కారు పట్టించుకోలేదు.
ఉదయం 9కే షోలు మొదలు అని స్పష్టం చేసింది. ఇది విజయ్ అభిమానులకు అస్సలు రుచించట్లేదు. ఈ పరిణామం స్టాలిన్ సర్కారుకు ప్రతికూలం అవుతుందనే చర్చ జరుగుతుండగా.. స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ లైన్లోకి వచ్చాడు. విజయ్ అభిమానులను శాంతింపజేయడానికా అన్నట్లు ‘లియో’ షో చూసి ట్వీట్ వేశాడతను. ఈ సినిమా అదిరిందని చెబుతూ, ఇది ‘ఎల్సీయూ’లో భాగం అనే హింట్ ఇచ్చేలా ట్వీట్ వేశాడు. దీంతో సీఎం స్టాలిన్ విజయ్ అభిమానులను గిల్లుతుంటే.. ఉదయనిధి స్టాలిన్ వాళ్లను దువ్వే ప్రయత్నం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on October 18, 2023 5:18 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…