పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ప్రస్తుతం టాలీవుడ్లో హ్యాపెనింగ్ బేనర్ అంటే ఇది. తెలుగులో ప్రస్తుతం ఆ సంస్థ నిర్మిస్తున్న సినిమాల సంఖ్య తెలిస్తే షాకవ్వాల్సిందే. ఈ మధ్యే పాతిక సినిమాల మైలురాయిని అందుకున్న పీపుల్స్ మీడియా.. ప్రస్తుతం 20కి పైగా సినిమాలను లైన్లో పెట్టడం విశేషం. ఒక సంస్థలో ఐదారు సినిమాలు తెరకెక్కుతుంటేనే.. వామ్మో అనుకుంటాం.
అలాంటిది 20కి పైగా సినిమాలు వివిధ స్థాయిల్లో ఉన్నాయంటే షాకవ్వాల్సిందే. బహుశా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక సంస్థలో ఒక టైంలో ఇన్ని సినిమాలు వివిధ దశల్లో ఉండటం జరిగి ఉండదు. ఒకప్పుడు చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే తీసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ఈ ఏడాది బ్రో లాంటి పెద్ద సినిమాను ప్రొడ్యూస్ చేసింది.
ప్రస్తుతం ప్రభాస్-మారుతి మూవీ సహా కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఆ సంస్థలో తెరకెక్కుతున్నాయి. ఐతే ఇన్ని సినిమాలు లైన్లో ఉండగా.. ఈ కాంపౌండ్ నుంచి మరో బేనర్ రాబోతోందట. గీతా ఆర్ట్స్ వాళ్లు చిన్న, మిడ్ రేంజ్ సినిమాల కోసం గీతా ఆర్ట్స్-2 బేనర్ పెట్టినట్లు పీపుల్స్ మీడియా వాళ్లు కూడా ఇదే లక్ష్యంతో సెకండ్ బేనర్ తీసుకొస్తున్నారట. పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ తనయురాలు ఈ బేనర్ను హ్యాండిల్ చేస్తున్నట్లు సమాచారం.
తక్కువ బడ్జెట్లో యంగ్ ఫిలిం మేకర్లు.. కొత్త నటీనటులను పెట్టి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీయాలన్నది ఈ సంస్థ లక్ష్యం. ఓటీటీల కోసం కూడా కంటెంట్ చేయబోతున్నారట. ప్రస్తుతం కథలు వింటున్న టీం.. త్వరలోనే కొన్ని ప్రాజెక్టులను ఫైనలైజ్ చేసి పట్టాలెక్కించాలని చూస్తున్నారట. త్వరలోనే ఈ బేనర్ లాంచ్ సినిమాను ప్రకటిస్తారని సమాచారం.
This post was last modified on October 17, 2023 9:21 am
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…