పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ప్రస్తుతం టాలీవుడ్లో హ్యాపెనింగ్ బేనర్ అంటే ఇది. తెలుగులో ప్రస్తుతం ఆ సంస్థ నిర్మిస్తున్న సినిమాల సంఖ్య తెలిస్తే షాకవ్వాల్సిందే. ఈ మధ్యే పాతిక సినిమాల మైలురాయిని అందుకున్న పీపుల్స్ మీడియా.. ప్రస్తుతం 20కి పైగా సినిమాలను లైన్లో పెట్టడం విశేషం. ఒక సంస్థలో ఐదారు సినిమాలు తెరకెక్కుతుంటేనే.. వామ్మో అనుకుంటాం.
అలాంటిది 20కి పైగా సినిమాలు వివిధ స్థాయిల్లో ఉన్నాయంటే షాకవ్వాల్సిందే. బహుశా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక సంస్థలో ఒక టైంలో ఇన్ని సినిమాలు వివిధ దశల్లో ఉండటం జరిగి ఉండదు. ఒకప్పుడు చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే తీసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ఈ ఏడాది బ్రో లాంటి పెద్ద సినిమాను ప్రొడ్యూస్ చేసింది.
ప్రస్తుతం ప్రభాస్-మారుతి మూవీ సహా కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఆ సంస్థలో తెరకెక్కుతున్నాయి. ఐతే ఇన్ని సినిమాలు లైన్లో ఉండగా.. ఈ కాంపౌండ్ నుంచి మరో బేనర్ రాబోతోందట. గీతా ఆర్ట్స్ వాళ్లు చిన్న, మిడ్ రేంజ్ సినిమాల కోసం గీతా ఆర్ట్స్-2 బేనర్ పెట్టినట్లు పీపుల్స్ మీడియా వాళ్లు కూడా ఇదే లక్ష్యంతో సెకండ్ బేనర్ తీసుకొస్తున్నారట. పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ తనయురాలు ఈ బేనర్ను హ్యాండిల్ చేస్తున్నట్లు సమాచారం.
తక్కువ బడ్జెట్లో యంగ్ ఫిలిం మేకర్లు.. కొత్త నటీనటులను పెట్టి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీయాలన్నది ఈ సంస్థ లక్ష్యం. ఓటీటీల కోసం కూడా కంటెంట్ చేయబోతున్నారట. ప్రస్తుతం కథలు వింటున్న టీం.. త్వరలోనే కొన్ని ప్రాజెక్టులను ఫైనలైజ్ చేసి పట్టాలెక్కించాలని చూస్తున్నారట. త్వరలోనే ఈ బేనర్ లాంచ్ సినిమాను ప్రకటిస్తారని సమాచారం.
This post was last modified on October 17, 2023 9:21 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…