ఓవైపు 20 సినిమాలు.. ఇంకోవైపు కొత్త సంస్థ‌

పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ.. ప్ర‌స్తుతం టాలీవుడ్లో హ్యాపెనింగ్ బేన‌ర్ అంటే ఇది. తెలుగులో ప్ర‌స్తుతం ఆ సంస్థ నిర్మిస్తున్న సినిమాల సంఖ్య తెలిస్తే షాక‌వ్వాల్సిందే. ఈ మ‌ధ్యే పాతిక సినిమాల మైలురాయిని అందుకున్న పీపుల్స్ మీడియా.. ప్ర‌స్తుతం 20కి పైగా సినిమాల‌ను లైన్లో పెట్ట‌డం విశేషం. ఒక సంస్థ‌లో ఐదారు సినిమాలు తెర‌కెక్కుతుంటేనే.. వామ్మో అనుకుంటాం.

అలాంటిది 20కి పైగా సినిమాలు వివిధ స్థాయిల్లో ఉన్నాయంటే షాక‌వ్వాల్సిందే. బ‌హుశా తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే ఒక సంస్థ‌లో ఒక టైంలో ఇన్ని సినిమాలు వివిధ ద‌శ‌ల్లో ఉండ‌టం జ‌రిగి ఉండ‌దు. ఒక‌ప్పుడు చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాలే తీసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ.. ఈ ఏడాది బ్రో లాంటి పెద్ద సినిమాను ప్రొడ్యూస్ చేసింది.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్-మారుతి మూవీ స‌హా కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఆ సంస్థ‌లో తెర‌కెక్కుతున్నాయి. ఐతే ఇన్ని సినిమాలు లైన్లో ఉండ‌గా.. ఈ కాంపౌండ్ నుంచి మ‌రో బేన‌ర్ రాబోతోంద‌ట‌. గీతా ఆర్ట్స్ వాళ్లు చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల కోసం గీతా ఆర్ట్స్-2 బేన‌ర్ పెట్టిన‌ట్లు పీపుల్స్ మీడియా వాళ్లు కూడా ఇదే ల‌క్ష్యంతో సెకండ్ బేన‌ర్ తీసుకొస్తున్నార‌ట‌. పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ త‌న‌యురాలు ఈ బేన‌ర్‌ను హ్యాండిల్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

త‌క్కువ‌ బ‌డ్జెట్లో యంగ్ ఫిలిం మేక‌ర్లు.. కొత్త న‌టీన‌టుల‌ను పెట్టి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీయాల‌న్న‌ది ఈ సంస్థ ల‌క్ష్యం. ఓటీటీల కోసం కూడా కంటెంట్ చేయ‌బోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం క‌థ‌లు వింటున్న టీం.. త్వ‌ర‌లోనే కొన్ని ప్రాజెక్టుల‌ను ఫైన‌లైజ్ చేసి ప‌ట్టాలెక్కించాల‌ని చూస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ బేన‌ర్ లాంచ్ సినిమాను ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం.