పేరుకేమో అక్షయ్ కుమార్ కొత్త సినిమా మిషన్ రాణిగంజ్ ని ఆస్కార్ నామినేషన్ కోసం సిద్ధం చేస్తున్నారు. తీరా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు చూస్తుంటే మాత్రం మరీ డిజాస్టర్ కన్నా తీసికట్టుగా ఉండటం ఫ్యాన్స్ ని కలవరపరుస్తోంది. పది రోజులకు గాను కేవలం 28 కోట్లే వసూలు చేసిందని ట్రేడ్ టాక్. ఇది పెద్ద అవమానం. పాజిటివ్ రివ్యూలు చాలా వచ్చాయి. అక్కి అదరగొట్టాడంటూ కొందరు బాలీవుడ్ విశ్లేషకులు పల్లకిలు మోశారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి జవాన్, పఠాన్ లు దిగదుడుపంటూ రివ్యూలో పేర్కొన్నారు. ఇంత బిల్డప్ ఇచ్చింది మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నిన్న నేషనల్ డే సందర్భంగా మల్టీప్లెక్సులు 99 రూపాయలకు టికెట్లు అమ్మడం వల్ల ఈ మాత్రం వసూళ్లు దక్కాయి. అక్టోబర్ 15 నమోదైన ఆక్యుపెన్సీలలో మిషన్ రాణిగంజ్ వాటా 21 శాతం. దీనికన్నా జవాన్ ఎక్కువ నమోదు చేయడం మరో ట్విస్టు. అక్షయ్ కుమార్ కథల ఎంపిక మీద గత కొంత కాలంగా విమర్శలు వస్తున్నాయి. బయోపిక్ అంటే చాలు ముందు వెనుకా ఆలోచించకుండా ఒప్పేసుకుంటున్నాడని ఫ్యాన్స్ ఒకటే వాపోతున్నారు. దీని వల్ల నష్టాలతో పాటు లేనిపోని ట్రోలింగ్ ఎదురుకోవాల్సి వచ్చిందని వాళ్ళ బాధ.
ఇవేవి పట్టించుకునే స్థితిలో అక్షయ్ కుమార్ లేడు. మంచి సినిమాలు తీస్తూనే ఉంటానని. మరుగుదొడ్లు, శానిటరీ ప్యాడ్స్ మీద నటించే దమ్మున్న హీరోలను చూపించమని సవాల్ విసురుతున్నాడు. అతను అడిగిన దాంట్లో లాజిక్ ఉంది కానీ బిజినెస్ లెక్కాలంటూ కొన్ని ఉంటాయి. నిర్మాతల కోట్ల రూపాయల పెట్టుబడులను పణంగా పెట్టి మన అభిరుచులు తీర్చుకుంటూ పోతే దీనికి అంతం ఉండదు. నటుడిగా ఎంత సంతృప్తి దక్కినా బయ్యర్లు, ప్రేక్షకులు సినిమా చూసి సంతోషంగా ఫీలవ్వనప్పుడు ఎంత చేసినా ఏం ప్రయోజనం. ఇది అక్షయ్ బాబా ఎప్పుడు గుర్తిస్తాడో ఏంటో మరి.
This post was last modified on October 17, 2023 1:01 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…