పరిశ్రమకు వచ్చి ఏళ్ళ తరబడి కష్టపడి ఎదురు చూసి డిజె టిల్లు రూపంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ దాని సీక్వెల్ కోసమే చాలా టైం తీసుకున్నాడు. తొందరపడి సినిమాలు చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. టిల్లు స్క్వేర్ కొంత ఆలస్యమవుతున్నా సరే క్వాలిటీ కోసం రాజీ పడకుండా ఇంకా తీయిస్తూనే ఉన్నాడు. తాజాగా ప్రకటించిన కొత్త ప్రాజెక్ట్ మరింత ఆసక్తి రేపేలా ఉంది. సెలబ్రిటీ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోనని దర్శకురాలిగా పరిచయం చేస్తున్నచిత్రానికి తెలుసు కదా అనే కవితాత్మకత టైటిల్ ని ఫిక్స్ చేసి వెరైటీ టీజర్ తో ప్రకటించారు.
తెలుసు కదాలో సిద్దు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నాతో పాటు కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్లు నటిస్తున్నారు. సంగీతం తమన్ సమకూరుస్తుండగా, యువరాజ్ ఛాయాగ్రహణం బాధ్యతలు తీసుకున్నాడు. క్యాస్టింగ్ తో పాటు టెక్నికల్ టీమ్ చాలా బలంగా కనిపిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం కావడంతో బడ్జెట్ పరంగా రాజీలు ఉండవు. కాన్సెప్ట్ ఏంటో చూచాయగా చెప్పారు. ఖరీదయిన డైనింగ్ టేబుల్, సూటు బూటు వేసుకుని సిద్ధూ అక్కడికి వచ్చా దర్జాగా కూర్చుని మెనూ తీసుకుని కెమెరా వైపు చూస్తూ తెలుసు కదా అని చెప్పడం భావుకతతో నిండిపోయింది.
తెలుగులో పేరు పెట్టడమే పెద్ద సవాల్ గా మారిపోతున్న ట్రెండ్ లో ఇలా తెలుసు కదా అనే సింపుల్ పదాలతో నీరజ కోన టైటిల్ నిర్ణయించడం బాగుంది. రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తోంది కాబట్టి విడుదల తేదీ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రేమించడం, ప్రేమించబడటం ఒకటే నిజమైన జీవన సూత్రమంటూ పెట్టిన ట్యాగ్ లైన్ ఇది లవ్ స్టోరీ అని టీజర్ చెప్పకనే చెబుతోంది. కాకపోతే సిద్దు మార్కు అల్లరి, సందడి, వెరైటీ బాడీ లాంగ్వేజ్ ఇందులో ఉండకపోవచ్చు. నటుడు అన్నాక అన్ని రకాల పాత్రలు, జానర్లు టచ్ చేయాలి. అప్పుడే అసలైన టాలెంట్ రాటు దేలుతుంది. సిద్దు చేస్తోంది అదే
ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…
పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…
దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్…