ఇవాళ జరిగిన హాయ్ నాన్న ప్రెస్ మీట్ లో కాసింత వాడి వేడి చర్చలే జరిగాయి. ముఖ్యంగా జెర్సి, శ్యామ్ సింగ రాయ్ లాంటి సినిమాలు బ్రేక్ ఈవెన్ అందుకోలేదన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు నాని కాసింత గట్టిగానే సమాధానం చెప్పడం వైరలయ్యింది. సదరు ప్రొడ్యూసర్లను లెక్కలు అడగవచ్చని, ఒకవేళ వాళ్ళు చెప్పలేకపోయినా తనకు ఆ విషయాలు తెలుసని, అంటే సుందరానికి గురించి అయితే ఏదో అనుకునేవాడిని తప్పించి లాభాలు తీసుకొచ్చిన హిట్ మూవీస్ ని ఇలా తప్పుగా అడగటం సబబు కాదని సమాధానమిచ్చాడు. ఈ కామెంట్లకు మద్దతుగా నిర్మాతలు ట్విట్టర్ లో స్పందించారు.
జెర్సీ ప్రొడ్యూసర్ నాగవంశీ తాము ఆ సినిమా తీసినందుకు ఎంతో గర్వంగా ఉన్నామని, లాభాలే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చాయని నానిని సమర్థిస్తూ ట్వీట్ చేయడం విశేషం. శ్యామ్ సింగ రాయ్ నిర్మించిన వెంకట్ బోయినపల్లి సైతం ఇదే తరహా బదులు చెబుతూ మళ్ళీ మళ్ళీ ఇలాంటి గొప్ప చిత్రాలు తీసే అవకాశం కోసం చూస్తున్నామని కుండ బద్దలు కొట్టారు. నిజానికి ఆ రెండు ఫెయిల్యూర్స్ కాదనేదేది అందరికీ తెలిసిన విషయమే. ఒకటి రెండు ఏరియాల వసూళ్లలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు కానీ ఓవరాల్ గా థియేట్రికల్ బిజినెస్ ని పూర్తిగా రికవర్ చేశాయి.
అలాంటప్పుడు ఫ్లాప్ అనే ప్రస్తావనే రాదు. వి లాంటి డిజాస్టర్ గురించి అయితే పర్వాలేదు కానీ సక్సెస్ అయిన వాటిని ఇలా ప్రస్తావించడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పర్సనల్ ఇంటర్వ్యూలో ఇలాంటివి ఎన్ని అయినా అడగొచ్చు. తప్పేం లేదు. కానీ హాయ్ నాన్నకు ఏ మాత్రం సంబంధం లేని వాటిని అదే పనిగా చర్చకు తీసుకొస్తే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసుకున్న హాయ్ నాన్న డిసెంబర్ 7 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే, టీజర్, విడుదల తేదీ ప్రకటించడంతో పాటు ఇవాళ్టి నుంచి ఈ సినిమా ప్రమోషన్లను వేగవంతం చేయబోతున్నారు.
This post was last modified on October 15, 2023 6:01 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మహానాడు…
తెలంగాణలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన…
యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ…
అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ…
భారత్ మరోసారి టీ20 క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1 తేడాతో…
రానున్న రోజుల్లో కాల్ చేయకుండా డైరెక్ట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం, ధరల గురించి తెలుసుకోవడం, ఇతర వివరాలు సేకరించడం మరింత…