ఈ రోజుల్లో సెంటిమెంట్ సినిమాలు ఎవరు చూస్తారు అంటారు కానీ.. పూర్తిగా సెంటిమెంట్తో నింపేయకుండా, దాన్ని అండర్ కరెంట్గా నడిపిస్తే ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతారు. ‘విక్రమ్’ లాంటి యాక్షన్ మూవీలో కూడా తాత-మనవడు సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. రాబోయే రోజుల్లో ఇలాంటి ‘సెంటిమెంట్’ టచ్ ఉన్న సినిమాలు మన ప్రేక్షకులను ముంచెత్తబోతున్నాయి. ‘విక్రమ్’ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తీసిన ‘లియో’లోనూ తండ్రి-బిడ్డ సెంటిమెంట్ ఉంది.
ఈ సినిమా పోస్టర్లు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ‘విక్రమ్’ను మించి ఇందులో యాక్షన్ ఉంటుందని లోకేష్ చెబుతున్నప్పటికీ.. కథలో తండ్రి-బిడ్డ సెంటిమెంట్ కీలకంగా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కథ ఆ సెంటిమెంట్ మీదే నడుస్తుందట. ఇక ‘లియో’తో పాటుగా తెలుగులో దసరా కానుకగా విడుదలవుతున్న బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’లో తండ్రీ కూతుళ్లు సెంటిమెంటే కథా వస్తువుగా ఉండబోతోంది.
శ్రీలీల బాలయ్యకు కూతురేనా అనే విషయంలో క్లారిటీ లేదు కానీ.. ఇద్దరిదీ తండ్రీ కూతుళ్ల బంధం లాగే కనిపిస్తోంది. ఆడబిడ్డను బలంగా తయారు చేయాలని చూసే తండ్రి.. ఆ బిడ్డకు కష్టం వస్తే ఎలా ఎదురు నిలిచి పోరాడాడనే నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఇక డిసెంబర్లో రిలీజ్ కానున్న నాని మూవీ ‘హాయ్ నాన్న’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా టైటిల్ చూసినపుడే ఇది తండ్రీ కూతుళ్ల బంధం నేపథ్యంలో నడిచే సినిమా అని అర్థమైంది.
తాజాగా రిలీజైన టీజర్ కూడా ఆ ఎమోషనే ప్రధానంగా సాగింది. దీని తర్వాత సంక్రాంతికి రిలీజయ్యే రెండు చిత్రాల్లో ఫాదర్ సెంటిమెంట్ కీలకం అని తెలుస్తోంది. వెంకటేష్ మూవీ ‘సైంధవ్’లో తండ్రి-కూతురు సెంటిమెంట్ ఉంది. అప్పుడే రిలీజ్ కానున్న విజయ్ దేవరకొండ సినిమాలోనూ తండ్రి-బిడ్డ బంధం ప్రధానంగా ఉంటుందట. ఈ చిత్రానికి ‘ఫ్యామిలీ స్టార్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. దీని టీజర్ బయటికి వస్తే సినిమా మీద పూర్తి ఐడియా వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో తండ్రి-బిడ్డ ఎమోషన్ ప్రేక్షకులను ముంచెత్తబోతోందన్నమాట.
This post was last modified on October 15, 2023 3:53 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…