ఈ రోజుల్లో లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లు అన్నవి చాలా కామన్ అయిపోయాయి. ఒక దశ వరకు కొంచెం లిమిటేషన్లు పెట్టుకునే హీరోయిన్లు కూడా తర్వాత మారిపోతుంటారు. కానీ 30-40 ఏళ్ల ముందు పరిస్థితులు ఇలా ఉండేవి కావు. హీరోయిన్లు రొమాన్స్ విషయంలో హద్దులు పాటించేవారు. అందాల ప్రదర్శనలోనూ శ్రుతి మించే వారు కాదు. సౌత్ ఇండియన్ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సుహాసిని.. ఏ సినిమాలోనూ గ్లామరస్గా కనిపించింది లేదు.
తనకంటూ కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుని.. ఆ ప్రకారమే సినిమాలు చేసేది. అలాంటి కథానాయికను ఒక సినిమాలో హీరో ఒళ్లో కూర్చోమని డైరెక్టర్ చెప్పారట. తాను ఆ సన్నివేశం చేయనంటే చేయనని తేల్చి చెప్పేసిందట సుహాసిని. ఓ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా తాను ఇలాంటి సన్నివేశాల విషయంలో ఎంత కచ్చితంగా ఉండేదాన్నో ఆమె వివరించింది.
‘‘ఒక సినిమా సెట్లో నేను ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నా. ఒక సీన్లో భాగంగా హీరో ఒళ్లో కూర్చోమని నాకు చెప్పారు. నేను అంగీకరించలేదు. ’ఇది ఇండియా, పరాయి వ్యక్తి ఒడిలో ఒక స్త్రీ కూర్చోవడం తప్పు. కాబట్టి నేనా సీన్ చేయను’ అని గట్టిగా వాదించా. దీంతో ఆ సీన్ మార్చారు. ఇంకో సినిమాలో పాట చిత్రీకరణ సందర్భంగా హీరో తిన్న ఐస్క్రీమ్నే నన్నూ తినమన్నారు. అది నాకు నచ్చలేదు. వేరే వాళ్లు ఎంగిలి చేసింది నేను తినడం ఏంటి సీన్ మార్చండి అని తేల్చి చెప్పా. నా మాటలు విని కొరియోగ్రాఫర్ షాకయ్యాడు.
తాను చెప్పినట్లు చేయాలన్నారు. నేను అంగీకరించలేదు. ఆ ఐస్క్రీమ్ను కనీసం ముట్టుకోనని తెగేసి చెప్పా. నా ఫ్రెండ్ శోభనకు ఒక సినిమాలో ఇలాంటి పరిస్థితే ఎదురైతే, ఆమె ఆ సీన్ చేయనని చెప్పిందట. అందుకా దర్శకుడు ‘నువ్వేమైనా సుహాసిని అనుకుంటున్నావా.. చేయనని చెబుతున్నావ్’ అని అడిగాడట. ఆమె వెంటనే నాకు ఫోన్ చేసింది. నేను ఇలాంటి సీన్లు చేయనని అందరికీ అర్థమైందని అప్పుడు తెలిసింది’’ అని సుహాసిని ఆ సంగతులు గుర్తు చేసుకుంది.
This post was last modified on October 15, 2023 9:44 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…