ఈ రోజుల్లో లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లు అన్నవి చాలా కామన్ అయిపోయాయి. ఒక దశ వరకు కొంచెం లిమిటేషన్లు పెట్టుకునే హీరోయిన్లు కూడా తర్వాత మారిపోతుంటారు. కానీ 30-40 ఏళ్ల ముందు పరిస్థితులు ఇలా ఉండేవి కావు. హీరోయిన్లు రొమాన్స్ విషయంలో హద్దులు పాటించేవారు. అందాల ప్రదర్శనలోనూ శ్రుతి మించే వారు కాదు. సౌత్ ఇండియన్ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సుహాసిని.. ఏ సినిమాలోనూ గ్లామరస్గా కనిపించింది లేదు.
తనకంటూ కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుని.. ఆ ప్రకారమే సినిమాలు చేసేది. అలాంటి కథానాయికను ఒక సినిమాలో హీరో ఒళ్లో కూర్చోమని డైరెక్టర్ చెప్పారట. తాను ఆ సన్నివేశం చేయనంటే చేయనని తేల్చి చెప్పేసిందట సుహాసిని. ఓ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా తాను ఇలాంటి సన్నివేశాల విషయంలో ఎంత కచ్చితంగా ఉండేదాన్నో ఆమె వివరించింది.
‘‘ఒక సినిమా సెట్లో నేను ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నా. ఒక సీన్లో భాగంగా హీరో ఒళ్లో కూర్చోమని నాకు చెప్పారు. నేను అంగీకరించలేదు. ’ఇది ఇండియా, పరాయి వ్యక్తి ఒడిలో ఒక స్త్రీ కూర్చోవడం తప్పు. కాబట్టి నేనా సీన్ చేయను’ అని గట్టిగా వాదించా. దీంతో ఆ సీన్ మార్చారు. ఇంకో సినిమాలో పాట చిత్రీకరణ సందర్భంగా హీరో తిన్న ఐస్క్రీమ్నే నన్నూ తినమన్నారు. అది నాకు నచ్చలేదు. వేరే వాళ్లు ఎంగిలి చేసింది నేను తినడం ఏంటి సీన్ మార్చండి అని తేల్చి చెప్పా. నా మాటలు విని కొరియోగ్రాఫర్ షాకయ్యాడు.
తాను చెప్పినట్లు చేయాలన్నారు. నేను అంగీకరించలేదు. ఆ ఐస్క్రీమ్ను కనీసం ముట్టుకోనని తెగేసి చెప్పా. నా ఫ్రెండ్ శోభనకు ఒక సినిమాలో ఇలాంటి పరిస్థితే ఎదురైతే, ఆమె ఆ సీన్ చేయనని చెప్పిందట. అందుకా దర్శకుడు ‘నువ్వేమైనా సుహాసిని అనుకుంటున్నావా.. చేయనని చెబుతున్నావ్’ అని అడిగాడట. ఆమె వెంటనే నాకు ఫోన్ చేసింది. నేను ఇలాంటి సీన్లు చేయనని అందరికీ అర్థమైందని అప్పుడు తెలిసింది’’ అని సుహాసిని ఆ సంగతులు గుర్తు చేసుకుంది.
This post was last modified on October 15, 2023 9:44 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…