ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’కు కొత్త డేట్ ఇచ్చినప్పటి నుంచి క్రిస్మస్ సీజన్లో జరగబోయే బాక్సాఫీస్ వార్ గురించి తెగ చర్చ జరుగుతోంది. అదే టైంలో షారుఖ్ ఖాన్ సినిమా ‘డుంకి’ కూడా రిలీజ్ కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ‘సలార్’కు భారీ హైప్ ఉన్న మాట వాస్తవమే అయినా.. ‘డుంకి’ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. బ్లాక్బస్టర్లు తప్ప ఏమీ తీయని రాజ్ కుమార్ హిరాని డైరెక్ట్ చేస్తున్న సినిమా అది.
అందులోనూ షారుఖ్ వరుసగా రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన ఊపులో ఉన్నాడు. కాబట్టి ఆ చిత్రం వస్తే ‘సలార్’కూ ఇబ్బంది తప్పదు. అలా అని ‘సలార్’ లాంటి మెగా మాస్ మూవీని చూసి ‘డుంకి’ టీం కంగారు పడకుండా ఉండే పరిస్థితి కూడా లేదు. కానీ ‘డుంకి’ లాంటి క్లాస్ మూవీకే ఎక్కువ ప్రమాదం అనే అభిప్రాయాలున్నాయి. ఆల్రెడీ ఈ ఏడాది షారుఖ్ నుంచి రెండు సినిమాలు వచ్చాయి కాబట్టి ‘డుంకి’ని వాయిదా వేయొచ్చనే చర్చ కూడా నడిచింది.
ఐతే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యం కారణంగా చూపి ‘డుంకి’ని వాయిదా వేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ‘సలార్’కు లైన్ క్లియరైనట్లే అని భావించారంతా. కానీ ఈ వార్తల్లో నిజం లేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ‘డుంకి’ టీంతో కన్ఫమ్ చేసుకుని ఈ విషయమై ట్వీట్ వేశారు. ‘డుంకి’ వాయిదా వార్తల్లో నిజం లేదని.. క్రిస్మస్కే ఆ సినిమా వస్తుందని టీం చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
‘జవాన్’ ఇంకా థియేటర్లలో ఉండగా.. ‘డుంకి’ గురించి అప్డేట్ ఇవ్వడం బాగోదని వెయిట్ చేస్తున్నట్లు టీం చెప్పిందట. మరోవైపు ‘డుంకి’ని ఓవర్సీస్లో రిలీజ్ చేయబోతున్న యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఎక్కడిక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్లకు థియేటర్ల బుకింగ్ విషయంలో సమాచారం ఇచ్చిందని, త్వరలో బుకింగ్స్ కూడా మొదలుపెట్టుకోమని కూడా చెప్పేశారని వార్తలు వస్తున్నాయి. కాబట్టి క్రిస్మస్కి ప్రభాస్ వెర్సస్ షారుఖ్ బాక్సాఫీస్ వార్ చూడబోతున్నట్లే.
This post was last modified on October 14, 2023 7:15 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…