మన దేశంలో ఒరిజినల్ ఐమ్యాక్స్ ఫార్మట్ లో ఉన్న స్క్రీన్లు కేవలం 23 మాత్రమే అంటే ఆశ్చర్యం కలగక మానదు కానీ ఇది అక్షరాలా నిజం. త్వరలో తిరువనంతపురంలో మరొకటి ప్రారంభం కానుంది. సినిమా లవర్స్ ఎక్కువగా ఉండే రాష్ట్రాలుగా పేరున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక్కటి లేదు. హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్, సూళూరుపేట వి ఎపిక్ స్క్రీన్ లు చాలా పెద్దవే కానీ వాటిలో ఉన్న ప్రొజెక్షన్ ఐమ్యాక్స్ కాదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే లియో ఐమాక్స్ ప్రింట్లు సకాలంలో చేయని కారణంగా ఓవర్సీస్ లో షెడ్యూల్ చేసిన షోలు రద్దు చేశారు. అడ్వాన్స్ అమ్మిన టికెట్ డబ్బులు రీ ఫండ్ చేస్తున్నారు.
ఇప్పుడు ఇండియాలో వేయడం కూడా అనుమానమే. ఐమ్యాక్స్ టెక్నాలజీలో సినిమా తీయాలంటే దానికి అనుగుణమైన కెమెరానే వాడాలి. లేదూ తీసిన దాన్ని ఆ ఫార్మట్ లో మార్చాలంటే ప్రత్యేకంగా ఆ ప్రింట్ కోసం వర్క్ చేయించాలి. నెలల తరబడి సమయం పడుతుంది. ఇదంత సులభం కాదు. ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే ఓవర్సీస్ లో విదేశీయులు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. పఠాన్ సైతం లార్జ్ వెర్షన్ అంటూ యష్ రాజ్ ఫిలిమ్స్ ఊదరగొట్టింది కానీ తీరా థియేటర్ కు వెళ్లి చూస్తే స్క్రీన్ కు పైన కింద నల్లని బార్లు వెక్కిరించాయి.
రాబోయే టైగర్ 3 కూడా ఇలాగే ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. నిఖార్సైన ఐమ్యాక్స్ మూవీస్ అంటే ఓపెన్ హీమర్, గ్రావిటీ లాంటి వాటిని చెప్పుకోవచ్చు. అయినా మన సాంకేతికత ఆ స్థాయిలో పెరగనప్పుడు అనవసరంగా ప్రేక్షకులను ఊరించడం తప్పే అవుతుంది. కేవలం ఈ ఎక్స్ పీరియన్స్ కోసమే యుఎస్, యుకెలో లియో టికెట్లు ఏడు వేలకు పైగా అమ్ముడుపోయాయట. ఆ సొమ్ములన్నీ వెనక్కు ఇవ్వడం పెద్ద విషయం కాదు కానీ దాని వల్ల ఆడియన్స్ అసంతృప్తిని ఎంత డబ్బిచ్చినా తగ్గించలేం. ముందుగా మన దేశంలో స్క్రీన్ కౌంట్ పెంచాల్సిన అవసరం చాలా ఉంది.
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…