అక్కినేని యువ కథానాయకుడు అఖిల్కు అరంగేట్రానికి ముందు ఉన్న క్రేజ్.. ఆ తర్వాత లేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య హీరోగా అరంగేట్రం చేసిన అతను.. తొలి సినిమా అఖిల్, ఆ తర్వాత చేసిన రెండు సినిమాలతో డిజాస్టర్లు ఎదుర్కోవడంతో ముందున్న క్రేజ్ మొత్తం కోల్పోయాడు. ఇప్పుడు స్టార్గా ఎదగడం కంటే హిట్టు కొట్టి హీరోగా నిలబడితే చాలు అనే స్థితిలో ఉన్నాడతను.
ప్రస్తుతం అతను గీతా ఆర్ట్స్ బేనర్లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా లేకుంటే ఈ సినిమా విడుదలయ్యేది, దాని ఫలితమేంటో తేలిపోయేది. ఆ తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచించేవాడేమో అఖిల్. కానీ ఆ సినిమా విడుదల వాయిదా పడింది.
లాక్ డౌన్ టైంలో ఖాళీగా ఉన్న నాగార్జున.. చిన్న కొడుకు కోసం కొత్త సినిమా సెట్ చేశాడు. సైరా లాంటి భారీ చిత్రం తీసిన సురేందర్ రెడ్డి అఖిల్తో తర్వాతి సినిమా చేయడానికి రెడీ అవడం విశేషం. ఈ చిత్రాన్ని క్రిష్ సన్నిహితుల ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ ప్రొడ్యూస్ చేస్తుందని వార్తలొచ్చాయి. కానీ సురేందర్ దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ చెప్పడంతో వాళ్లు వెనక్కి తగ్గినట్లు ఇటీవల వార్తలొచ్చాయి.
ఐతే ఇప్పుడు వారి స్థానంలోకి 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట వచ్చినట్లు సమాచారం. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్యతో ఓ సినిమా చేయాల్సి ఉన్న వీళ్లు.. ఆ చిత్రం వాయిదా పడటంతో దాని స్థానంలో అఖిల్ సినిమాను టేకప్ చేయడానికి రెడీ అయ్యారట. నాగ్ ప్రమేయంతోనే వాళ్లు ఈ సినిమాకు ఓకే చెప్పారట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…