‘బాహుబలి: ది కంక్లూజన్’ తర్వాత దేశవ్యాప్తంగా వివిధ భాషల ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా అంటే ‘కేజీఎఫ్: చాప్టర్-2’నే. ‘బాహుబలి: ది బిగినింగ్’ స్థాయిలో కాకపోయినా.. ‘కేజీఎఫ్: చాప్టర్-1’ కూడా మంచి విజయమే సాధించింది. వివిధ భాషల్లో బ్లాక్బస్టర్ హిట్టయింది. దీంతో ‘చాప్టర్-2’ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈ సినిమా ఈపాటికి షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండాలి. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు.
కానీ కరోనా వచ్చి ఆరు నెలల పాటు పనంతా ఆపేసింది. ఇప్పటికీ చాలామంది షూటింగ్లు చేయడానికి వెనుకాడుతుంటే.. ‘కేజీఎఫ్-2’ టీం మాత్రం ధైర్యంగా అడుగు ముందుకేసింది. బుధవారమే ఈ చిత్ర షూటింగ్ పున:ప్రారంభం అయింది. ఇండియాలో చిత్రీకరణ పున:ప్రారంభించిన తొలి భారీ చిత్రం ఇదే.
ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్.. క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్న సంగతి వెల్లడించాడు. ‘కేజీఎఫ్-2’ షూటింగ్ పున:ప్రారంభం అయింది ప్రకాష్ రాజ్పై సన్నివేశాలతోనే కావడం విశేషం. ఆయనకు సీన్ పేపర్ ఇచ్చి సన్నివేశం గురించి వివరిస్తున్న ఫొటోలను ప్రశాంత్ షేర్ చేశాడు. సూటేసుకుని జెంటిల్మన్ లాగా కనిపిస్తున్నాడు ప్రకాష్. ఆయన అవతారం చూస్తే ‘చాప్టర్-1’లో అనంత్ నాగ్ చేసిన నరేటర్ పాత్రను ఈసారి ఈయన చేస్తున్నాడేమో అనిపిస్తోంది.
దాదాపుగా అదే స్టయిల్లో కూర్చున్న స్టిల్ ఒకటి వదిలారు. ఇదే నిజమైతే హీరో ఎలివేషన్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. కన్నడేతర భాషల వాళ్లు మరింతగా ఈ పాత్రతో కనెక్టవుతారనడంలో సందేహం లేదు. ‘కేజీఎఫ్-2’లో హీరో తర్వాత అందరి దృష్టీ సంజయ్ దత్ పాత్ర మీదే ఉంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా లైన్లోకి రావడం సినిమా మీద అంచనాలు మరింత పెంచేదే. ఈ చిత్రంలో ఇందిరా గాంధీని పోలిన ప్రధాని పాత్రలో రవీనా టాండన్ కనిపించనున్నట్లు సమాచారం.
This post was last modified on August 26, 2020 2:55 pm
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరుసగా తమిళ నటులు, టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్తో కలిసి…