గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన ప్రభాస్ VS షారుఖ్ ఖాన్ క్లాష్ లో కొత్త మలుపులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 22 రెండు సినిమాలు పరస్పరం తలపడబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా డుంకీ రేస్ నుంచి తప్పుకోవచ్చంటూ బాలీవుడ్ మీడియా గట్టిగానే చెబుతోంది. వచ్చే ఏడాది మొదటి నెల ఆప్షన్ చూస్తున్నారట. ఒకవేళ హృతిక్ రోషన్ ఫైటర్ కనక జనవరి 25న ఏదైనా కారణం వల్ల రాలేని పరిస్థితిలో ఉంటే ఆ డేట్ ని డుంకీకి సెట్ చేయాలనే దిశగా సీరియస్ గానే చర్చలు జరుగుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్.
డుంకీ ఇప్పటిదాకా బిజినెస్ డీల్స్ ని పూర్తి స్థాయిలో ముగించలేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఫిక్స్ అయ్యారు కానీ ఇంకా స్క్రీన్లను లాక్ చేసుకునే తతంగం మొదలుపెట్టలేదు. మరోవైపు సలార్ ఇప్పటికే వందల్లో థియేటర్లను బుక్ చేసుకుని పక్కా ప్లానింగ్ తో రెడీగా ఉంది. ఇండియాలో పంపిణీదారులకు సైతం ఇంకా షారుఖ్ బృందం నుంచి ఖచ్చితమైన సమాచారం అందటం లేదు. ప్రభాస్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ మూడు సినిమాలు తీసిన టి సిరీస్ అధినేతలు డుంకీ పోస్ట్ పోన్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తునట్టు మరో కామెంట్ వినిపిస్తోంది. ఇవన్నీ తెరవెనుక జరిగే వ్యవహారాలు.
కాబట్టి డుంకీ తప్పుకోవడం లాంఛనంగా కనిపిస్తోంది. అయితే షారుఖ్ ఇంకా అంగీకరించలేదని తెలిసింది. ఇప్పుడు వెనక్కు తగ్గితే సలార్ కు భయపడేననే ప్రచారం వస్తుంది కాబట్టి అలా జరగకుండా ఏం చేయాలో చూస్తున్నారట. వాస్తవంగా డుంకీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చాలానే ఉన్నాయి. చేతిలో ఉన్న డెబ్భై రోజుల్లో అన్ని పూర్తి చేయడం చాలా కష్టమని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ భావిస్తున్నట్టు వినికిడి. సో ఒకవేళ అదే జరిగితే సలార్ ఊచకోతకు మరో ఆయుధం దొరికినట్టే. సోలో రిలీజ్ ను వాడుకుని ఊహించని స్థాయిలో ప్యాన్ ఇండియా రికార్డులు నమోదు చేయవచ్చు. చూద్దాం
This post was last modified on October 13, 2023 10:57 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…