గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన ప్రభాస్ VS షారుఖ్ ఖాన్ క్లాష్ లో కొత్త మలుపులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 22 రెండు సినిమాలు పరస్పరం తలపడబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా డుంకీ రేస్ నుంచి తప్పుకోవచ్చంటూ బాలీవుడ్ మీడియా గట్టిగానే చెబుతోంది. వచ్చే ఏడాది మొదటి నెల ఆప్షన్ చూస్తున్నారట. ఒకవేళ హృతిక్ రోషన్ ఫైటర్ కనక జనవరి 25న ఏదైనా కారణం వల్ల రాలేని పరిస్థితిలో ఉంటే ఆ డేట్ ని డుంకీకి సెట్ చేయాలనే దిశగా సీరియస్ గానే చర్చలు జరుగుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్.
డుంకీ ఇప్పటిదాకా బిజినెస్ డీల్స్ ని పూర్తి స్థాయిలో ముగించలేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఫిక్స్ అయ్యారు కానీ ఇంకా స్క్రీన్లను లాక్ చేసుకునే తతంగం మొదలుపెట్టలేదు. మరోవైపు సలార్ ఇప్పటికే వందల్లో థియేటర్లను బుక్ చేసుకుని పక్కా ప్లానింగ్ తో రెడీగా ఉంది. ఇండియాలో పంపిణీదారులకు సైతం ఇంకా షారుఖ్ బృందం నుంచి ఖచ్చితమైన సమాచారం అందటం లేదు. ప్రభాస్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ మూడు సినిమాలు తీసిన టి సిరీస్ అధినేతలు డుంకీ పోస్ట్ పోన్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తునట్టు మరో కామెంట్ వినిపిస్తోంది. ఇవన్నీ తెరవెనుక జరిగే వ్యవహారాలు.
కాబట్టి డుంకీ తప్పుకోవడం లాంఛనంగా కనిపిస్తోంది. అయితే షారుఖ్ ఇంకా అంగీకరించలేదని తెలిసింది. ఇప్పుడు వెనక్కు తగ్గితే సలార్ కు భయపడేననే ప్రచారం వస్తుంది కాబట్టి అలా జరగకుండా ఏం చేయాలో చూస్తున్నారట. వాస్తవంగా డుంకీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చాలానే ఉన్నాయి. చేతిలో ఉన్న డెబ్భై రోజుల్లో అన్ని పూర్తి చేయడం చాలా కష్టమని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ భావిస్తున్నట్టు వినికిడి. సో ఒకవేళ అదే జరిగితే సలార్ ఊచకోతకు మరో ఆయుధం దొరికినట్టే. సోలో రిలీజ్ ను వాడుకుని ఊహించని స్థాయిలో ప్యాన్ ఇండియా రికార్డులు నమోదు చేయవచ్చు. చూద్దాం
This post was last modified on October 13, 2023 10:57 am
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…