గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన ప్రభాస్ VS షారుఖ్ ఖాన్ క్లాష్ లో కొత్త మలుపులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 22 రెండు సినిమాలు పరస్పరం తలపడబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా డుంకీ రేస్ నుంచి తప్పుకోవచ్చంటూ బాలీవుడ్ మీడియా గట్టిగానే చెబుతోంది. వచ్చే ఏడాది మొదటి నెల ఆప్షన్ చూస్తున్నారట. ఒకవేళ హృతిక్ రోషన్ ఫైటర్ కనక జనవరి 25న ఏదైనా కారణం వల్ల రాలేని పరిస్థితిలో ఉంటే ఆ డేట్ ని డుంకీకి సెట్ చేయాలనే దిశగా సీరియస్ గానే చర్చలు జరుగుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్.
డుంకీ ఇప్పటిదాకా బిజినెస్ డీల్స్ ని పూర్తి స్థాయిలో ముగించలేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఫిక్స్ అయ్యారు కానీ ఇంకా స్క్రీన్లను లాక్ చేసుకునే తతంగం మొదలుపెట్టలేదు. మరోవైపు సలార్ ఇప్పటికే వందల్లో థియేటర్లను బుక్ చేసుకుని పక్కా ప్లానింగ్ తో రెడీగా ఉంది. ఇండియాలో పంపిణీదారులకు సైతం ఇంకా షారుఖ్ బృందం నుంచి ఖచ్చితమైన సమాచారం అందటం లేదు. ప్రభాస్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ మూడు సినిమాలు తీసిన టి సిరీస్ అధినేతలు డుంకీ పోస్ట్ పోన్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తునట్టు మరో కామెంట్ వినిపిస్తోంది. ఇవన్నీ తెరవెనుక జరిగే వ్యవహారాలు.
కాబట్టి డుంకీ తప్పుకోవడం లాంఛనంగా కనిపిస్తోంది. అయితే షారుఖ్ ఇంకా అంగీకరించలేదని తెలిసింది. ఇప్పుడు వెనక్కు తగ్గితే సలార్ కు భయపడేననే ప్రచారం వస్తుంది కాబట్టి అలా జరగకుండా ఏం చేయాలో చూస్తున్నారట. వాస్తవంగా డుంకీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చాలానే ఉన్నాయి. చేతిలో ఉన్న డెబ్భై రోజుల్లో అన్ని పూర్తి చేయడం చాలా కష్టమని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ భావిస్తున్నట్టు వినికిడి. సో ఒకవేళ అదే జరిగితే సలార్ ఊచకోతకు మరో ఆయుధం దొరికినట్టే. సోలో రిలీజ్ ను వాడుకుని ఊహించని స్థాయిలో ప్యాన్ ఇండియా రికార్డులు నమోదు చేయవచ్చు. చూద్దాం
This post was last modified on October 13, 2023 10:57 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…