ఒక దశలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా నెంబర్ వన్ కుర్చీని అలవోకగా అందుకుంటుందని ఆశించిన రష్మిక మందన్న అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని నిర్ణయించుకోవడంతో ఆ ఛాన్స్ కాస్తా అందినట్టే అందకుండా పోయింది. అయినా సరే బాలీవుడ్ లో గట్టి జెండా పాతాలని నిర్ణయించుకున్న రష్మిక అనిమల్ లో రన్బీర్ కపూర్ తో హాట్ రొమాన్స్ కి అభ్యంతరం పెట్టకుండా బోలెడు లిప్ లాక్స్ కి ఎస్ చెప్పింది. మనం మొన్న చూసిన పాటలో వచ్చింది శాంపిల్ మాత్రమే. వయొలెన్స్, లవ్ రెండు మిక్స్ చేసిన ఫస్ట్ నైట్ సీన్ దర్శకుడు సందీప్ వంగా ఓ రేంజ్ లో షూట్ చేశాడని ఆల్రెడీ టాక్ ఉంది.
ఇక అసలు పాయింట్ కు వస్తే రష్మిక మందన్న తాజాగా ఓ మీడియం రేంజ్ హీరోతో జోడి కట్టనుంది. అతనే విక్కీ కౌశల్. కెరీర్లో మంచి హిట్లు ఉన్నప్పటికీ ఇతగాడు ఇంకా టాప్ లీగ్ లోకి చేరుకోలేదు. ఉరి లాంటి బ్లాక్ బస్టర్లు రెగ్యులర్ గా పడటం లేదు. కత్రినా కైఫ్ ని పెళ్లి చేసుకున్నాక ఒక హిట్టు ఒక డిజాస్టర్ పలకరించాయి. తాజాగా ఒక పీరియాడిక్ డ్రామాని చేయబోతున్నాడు. చావా ది గ్రేట్ వారియర్ లో టైటిల్ రోల్ చేయబోతున్నాడు. జయసింగ్ రావు రాసిన సుప్రసిద్ధ మరాఠి నవల ఆధారంగా రాహుల్ జనార్దన్ జాదవ్ దర్శకత్వంలో రూపొందనుంది. అక్టోబర్ 16 నుంచి షూటింగ్ ఉంటుందట.
తన పక్కన చేస్తున్న హీరో స్టేటస్ కన్నా బడ్జెట్, స్కేల్, కాన్వాస్ ని ఎక్కువగా చూస్తున్న రష్మిక మందన్నకు ఇది మొదటి పీరియాడిక్ మూవీ అవుతుంది. బడ్జెట్ నూటా యాభై కోట్లకు పైమాటే అంటున్నారు. అనిమల్ ఎలాగూ హిట్ అవుతుంది కాబట్టి ఆలోగా మరికొన్ని ఇలాంటి క్రేజీ ప్రోజెక్టులకు సైన్ చేస్తే మెల్లగా షారుఖ్, సల్మాన్ లాంటి స్టార్లతో జోడి కట్టొచ్చు. సౌత్ విషయాన్ని వస్తే పుష్ప 2 ది రూల్, రైన్ బోతో పాటు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పింది. మొత్తానికి డైరీ ఖాళీ లేకుండా పక్కా ప్లానింగ్ తో రష్మిక మందన్న జోడి కడుతున్న వాళ్ళలో అల్లు అర్జున్ ఒక్కడే ప్యాన్ ఇండియా హీరో.
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…
బూజు పట్టిన, ప్రజలకు పనికిరాని రూల్స్ను బుట్టదాఖలు చేయాలని సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…
ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…
రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…