ఒక దశలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా నెంబర్ వన్ కుర్చీని అలవోకగా అందుకుంటుందని ఆశించిన రష్మిక మందన్న అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని నిర్ణయించుకోవడంతో ఆ ఛాన్స్ కాస్తా అందినట్టే అందకుండా పోయింది. అయినా సరే బాలీవుడ్ లో గట్టి జెండా పాతాలని నిర్ణయించుకున్న రష్మిక అనిమల్ లో రన్బీర్ కపూర్ తో హాట్ రొమాన్స్ కి అభ్యంతరం పెట్టకుండా బోలెడు లిప్ లాక్స్ కి ఎస్ చెప్పింది. మనం మొన్న చూసిన పాటలో వచ్చింది శాంపిల్ మాత్రమే. వయొలెన్స్, లవ్ రెండు మిక్స్ చేసిన ఫస్ట్ నైట్ సీన్ దర్శకుడు సందీప్ వంగా ఓ రేంజ్ లో షూట్ చేశాడని ఆల్రెడీ టాక్ ఉంది.
ఇక అసలు పాయింట్ కు వస్తే రష్మిక మందన్న తాజాగా ఓ మీడియం రేంజ్ హీరోతో జోడి కట్టనుంది. అతనే విక్కీ కౌశల్. కెరీర్లో మంచి హిట్లు ఉన్నప్పటికీ ఇతగాడు ఇంకా టాప్ లీగ్ లోకి చేరుకోలేదు. ఉరి లాంటి బ్లాక్ బస్టర్లు రెగ్యులర్ గా పడటం లేదు. కత్రినా కైఫ్ ని పెళ్లి చేసుకున్నాక ఒక హిట్టు ఒక డిజాస్టర్ పలకరించాయి. తాజాగా ఒక పీరియాడిక్ డ్రామాని చేయబోతున్నాడు. చావా ది గ్రేట్ వారియర్ లో టైటిల్ రోల్ చేయబోతున్నాడు. జయసింగ్ రావు రాసిన సుప్రసిద్ధ మరాఠి నవల ఆధారంగా రాహుల్ జనార్దన్ జాదవ్ దర్శకత్వంలో రూపొందనుంది. అక్టోబర్ 16 నుంచి షూటింగ్ ఉంటుందట.
తన పక్కన చేస్తున్న హీరో స్టేటస్ కన్నా బడ్జెట్, స్కేల్, కాన్వాస్ ని ఎక్కువగా చూస్తున్న రష్మిక మందన్నకు ఇది మొదటి పీరియాడిక్ మూవీ అవుతుంది. బడ్జెట్ నూటా యాభై కోట్లకు పైమాటే అంటున్నారు. అనిమల్ ఎలాగూ హిట్ అవుతుంది కాబట్టి ఆలోగా మరికొన్ని ఇలాంటి క్రేజీ ప్రోజెక్టులకు సైన్ చేస్తే మెల్లగా షారుఖ్, సల్మాన్ లాంటి స్టార్లతో జోడి కట్టొచ్చు. సౌత్ విషయాన్ని వస్తే పుష్ప 2 ది రూల్, రైన్ బోతో పాటు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పింది. మొత్తానికి డైరీ ఖాళీ లేకుండా పక్కా ప్లానింగ్ తో రష్మిక మందన్న జోడి కడుతున్న వాళ్ళలో అల్లు అర్జున్ ఒక్కడే ప్యాన్ ఇండియా హీరో.
This post was last modified on October 12, 2023 6:57 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…