సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఉందంటే.. బాక్సాఫీస్ దగ్గర పోటీకి వెళ్లడానికి వేరే చిత్రాల మేకర్స్ భయపడతారు. సంక్రాంతి టైంలో ఒకటికి మించి పెద్ద సినిమాలకు స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మాత్రమే మహేష్ సినిమాకు ఎవరైనా ఎదురు వెళ్తారు. అది కూడా భారీ చిత్రాలకు మాత్రమే ఆ ధైర్యం ఉంటుంది. ఐతే మహేష్ కొత్త సినిమా సంక్రాంతికి ఫిక్స్ అయినప్పటికీ.. అరడజను సినిమాల దాకా రేసులోకి రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. అందులోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి టాప్ డైరెక్టర్.
మహేష్తో తీస్తున్న ‘గుంటూరు కారం’ను చూసి వేరే సినిమాలు భయపడకపోవడం షాకింగే. హనుమాన్, ఈగల్, నా సామిరంగా, సైంధవ్ ఆల్రెడీ సంక్రాంతి డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మధ్యలో వేర్వేరు సినిమాలను సంక్రాంతి రిలీజ్ చేసే సంకేతాలు కనిపించాయి. వాటి సంగతి పక్కన పెడితే.. ‘గుంటూరు కారం’కు పోటీగా నాలుగు మిడ్ రేంజ్ చిత్రాలను రేసులో నిలబెట్టడం మాత్రం మహేష్ సినిమా మేకర్స్కు మింగుడు పడకపోయి ఉండొచ్చు.
ఈ సినిమాకు సంబంధించి కొన్ని నెగెటివ్ న్యూస్ల వల్ల బజ్ తగ్గిన మాట వాస్తవం. అసలు ఈ చిత్రం సంక్రాంతికి రాదేమో అన్న సందేహాలు కూడా వేరే చిత్రాలకు ధైర్యాన్నిచ్చాయి. ఐతే ఈ సినిమా నూటికి నూరు శాతం సంక్రాంతికి వస్తుందని నిర్మాత నాగవంశీ ఇటీవలే స్పష్టం చేశాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ల పరంగా చేయాల్సినంత చేయలేదనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. ఈ విషయం టీంకు కూడా తెలుసు. అందుకే షూటింగ్ మెజారిటీ పూర్తయ్యాక సంక్రాంతి లక్ష్యంగా ప్రమోషన్లను హోరెత్తించాలని టీం భావిస్తోందట.
ముందుగా దసరాకు ఈ సినిమా నుంచి తొలి పాటను లాంచ్ చేస్తారట. తర్వాత నెల గ్యాప్ ఇచ్చి విడదులకు రెండు నెలల ముందు నుంచి ఒక ప్రణాళిక ప్రకారం అప్డేట్స్తో హోరెత్తించబోతోందట చిత్ర బృందం. మిగతా పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ పవర్ ప్యాక్డ్గా ఉండేలా ప్లాన్ చేస్తారని ఆ కంటెంట్ ఒక్కొక్కటి బయటికి రావడం మొదలైతే ‘గుంటూరు కారం’ను చూసి అందరూ భయపడటం ఖాయమని.. అప్పుడు ఒకట్రెండు సినిమాలు సంక్రాంతి రేసు నుంచి కూడా తప్పుకుంటాయని అంచనా వేస్తున్నారట. ప్రస్తుతానికి చిత్ర బృందం దృష్టంతా వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేయడం మీదే ఉన్నట్లు సమాచారం.
ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…
రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…
అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…
ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…