సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఉందంటే.. బాక్సాఫీస్ దగ్గర పోటీకి వెళ్లడానికి వేరే చిత్రాల మేకర్స్ భయపడతారు. సంక్రాంతి టైంలో ఒకటికి మించి పెద్ద సినిమాలకు స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మాత్రమే మహేష్ సినిమాకు ఎవరైనా ఎదురు వెళ్తారు. అది కూడా భారీ చిత్రాలకు మాత్రమే ఆ ధైర్యం ఉంటుంది. ఐతే మహేష్ కొత్త సినిమా సంక్రాంతికి ఫిక్స్ అయినప్పటికీ.. అరడజను సినిమాల దాకా రేసులోకి రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. అందులోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి టాప్ డైరెక్టర్.
మహేష్తో తీస్తున్న ‘గుంటూరు కారం’ను చూసి వేరే సినిమాలు భయపడకపోవడం షాకింగే. హనుమాన్, ఈగల్, నా సామిరంగా, సైంధవ్ ఆల్రెడీ సంక్రాంతి డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మధ్యలో వేర్వేరు సినిమాలను సంక్రాంతి రిలీజ్ చేసే సంకేతాలు కనిపించాయి. వాటి సంగతి పక్కన పెడితే.. ‘గుంటూరు కారం’కు పోటీగా నాలుగు మిడ్ రేంజ్ చిత్రాలను రేసులో నిలబెట్టడం మాత్రం మహేష్ సినిమా మేకర్స్కు మింగుడు పడకపోయి ఉండొచ్చు.
ఈ సినిమాకు సంబంధించి కొన్ని నెగెటివ్ న్యూస్ల వల్ల బజ్ తగ్గిన మాట వాస్తవం. అసలు ఈ చిత్రం సంక్రాంతికి రాదేమో అన్న సందేహాలు కూడా వేరే చిత్రాలకు ధైర్యాన్నిచ్చాయి. ఐతే ఈ సినిమా నూటికి నూరు శాతం సంక్రాంతికి వస్తుందని నిర్మాత నాగవంశీ ఇటీవలే స్పష్టం చేశాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ల పరంగా చేయాల్సినంత చేయలేదనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. ఈ విషయం టీంకు కూడా తెలుసు. అందుకే షూటింగ్ మెజారిటీ పూర్తయ్యాక సంక్రాంతి లక్ష్యంగా ప్రమోషన్లను హోరెత్తించాలని టీం భావిస్తోందట.
ముందుగా దసరాకు ఈ సినిమా నుంచి తొలి పాటను లాంచ్ చేస్తారట. తర్వాత నెల గ్యాప్ ఇచ్చి విడదులకు రెండు నెలల ముందు నుంచి ఒక ప్రణాళిక ప్రకారం అప్డేట్స్తో హోరెత్తించబోతోందట చిత్ర బృందం. మిగతా పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ పవర్ ప్యాక్డ్గా ఉండేలా ప్లాన్ చేస్తారని ఆ కంటెంట్ ఒక్కొక్కటి బయటికి రావడం మొదలైతే ‘గుంటూరు కారం’ను చూసి అందరూ భయపడటం ఖాయమని.. అప్పుడు ఒకట్రెండు సినిమాలు సంక్రాంతి రేసు నుంచి కూడా తప్పుకుంటాయని అంచనా వేస్తున్నారట. ప్రస్తుతానికి చిత్ర బృందం దృష్టంతా వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేయడం మీదే ఉన్నట్లు సమాచారం.
This post was last modified on October 12, 2023 6:55 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…