సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఉందంటే.. బాక్సాఫీస్ దగ్గర పోటీకి వెళ్లడానికి వేరే చిత్రాల మేకర్స్ భయపడతారు. సంక్రాంతి టైంలో ఒకటికి మించి పెద్ద సినిమాలకు స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మాత్రమే మహేష్ సినిమాకు ఎవరైనా ఎదురు వెళ్తారు. అది కూడా భారీ చిత్రాలకు మాత్రమే ఆ ధైర్యం ఉంటుంది. ఐతే మహేష్ కొత్త సినిమా సంక్రాంతికి ఫిక్స్ అయినప్పటికీ.. అరడజను సినిమాల దాకా రేసులోకి రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. అందులోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి టాప్ డైరెక్టర్.
మహేష్తో తీస్తున్న ‘గుంటూరు కారం’ను చూసి వేరే సినిమాలు భయపడకపోవడం షాకింగే. హనుమాన్, ఈగల్, నా సామిరంగా, సైంధవ్ ఆల్రెడీ సంక్రాంతి డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మధ్యలో వేర్వేరు సినిమాలను సంక్రాంతి రిలీజ్ చేసే సంకేతాలు కనిపించాయి. వాటి సంగతి పక్కన పెడితే.. ‘గుంటూరు కారం’కు పోటీగా నాలుగు మిడ్ రేంజ్ చిత్రాలను రేసులో నిలబెట్టడం మాత్రం మహేష్ సినిమా మేకర్స్కు మింగుడు పడకపోయి ఉండొచ్చు.
ఈ సినిమాకు సంబంధించి కొన్ని నెగెటివ్ న్యూస్ల వల్ల బజ్ తగ్గిన మాట వాస్తవం. అసలు ఈ చిత్రం సంక్రాంతికి రాదేమో అన్న సందేహాలు కూడా వేరే చిత్రాలకు ధైర్యాన్నిచ్చాయి. ఐతే ఈ సినిమా నూటికి నూరు శాతం సంక్రాంతికి వస్తుందని నిర్మాత నాగవంశీ ఇటీవలే స్పష్టం చేశాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ల పరంగా చేయాల్సినంత చేయలేదనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. ఈ విషయం టీంకు కూడా తెలుసు. అందుకే షూటింగ్ మెజారిటీ పూర్తయ్యాక సంక్రాంతి లక్ష్యంగా ప్రమోషన్లను హోరెత్తించాలని టీం భావిస్తోందట.
ముందుగా దసరాకు ఈ సినిమా నుంచి తొలి పాటను లాంచ్ చేస్తారట. తర్వాత నెల గ్యాప్ ఇచ్చి విడదులకు రెండు నెలల ముందు నుంచి ఒక ప్రణాళిక ప్రకారం అప్డేట్స్తో హోరెత్తించబోతోందట చిత్ర బృందం. మిగతా పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ పవర్ ప్యాక్డ్గా ఉండేలా ప్లాన్ చేస్తారని ఆ కంటెంట్ ఒక్కొక్కటి బయటికి రావడం మొదలైతే ‘గుంటూరు కారం’ను చూసి అందరూ భయపడటం ఖాయమని.. అప్పుడు ఒకట్రెండు సినిమాలు సంక్రాంతి రేసు నుంచి కూడా తప్పుకుంటాయని అంచనా వేస్తున్నారట. ప్రస్తుతానికి చిత్ర బృందం దృష్టంతా వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేయడం మీదే ఉన్నట్లు సమాచారం.
This post was last modified on October 12, 2023 6:55 pm
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…