దసరా పండగకు మనం మూడు సినిమాల మీద దృష్టి పెట్టాం కానీ కథ అక్కడితో అయిపోలేదు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియోలకు థియేటర్లకు సర్దుబాదు చేయడమే పెద్ద తలనెప్పిగా మారిన తరుణంలో అదనంగా వచ్చి చేరిన బాలీవుడ్ మూవీ గణపథ్ నుంచి మల్టీప్లెక్సుల పరంగా ముప్పు తప్పేలా లేదు. అయితే వీటికి ఏ మాత్రం తీసిపోని బడ్జెట్ తో గ్రాండ్ గా రూపొందిన కన్నడ చిత్రం ఘోస్ట్ సైతం ప్యాన్ ఇండియా రిలీజ్ అక్టోబర్ 20 ప్లాన్ చేసుకుంది. జైలర్ లో నరసింహగా అదరగొట్టిన శివరాజ్ కుమార్ హీరో కావడంతో ఇతర బాషల డిస్ట్రిబ్యూటర్ల నుంచి బాగానే డిమాండ్ ఉందట.
కర్ణాటకలో ఎలాంటి సమస్య లేదు. ముందురోజు అర్ధరాత్రి నుంచే షోలు వేసే రేంజ్ లో అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. కానీ తెలుగు తమిళంలో అలాంటి పరిస్థితి లేకపోవడంతో అక్టోబర్ 27 వాయిదా పడే ఆలోచనలో నిర్మాతలున్నారు. ఇప్పటికైతే కన్నడ వెర్షన్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు. థియేటర్లు కేటాయించారు. కానీ రిస్క్ ఏంటంటే టాక్ బయటికి వస్తుంది. డబ్బింగ్ రిలీజయ్యే నాటికి దాని గురించి ఆడియన్స్ కి అవగాహన వచ్చేసి ఉంటుంది. బ్లాక్ బస్టర్ అయితే ఇబ్బంది లేదు కానీ ఒకవేళ ఏ మాత్రం యావరేజ్ అయినా సరే మన ఆడియన్స్ ఆసక్తి చూపించరు.
అందుకే ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిపోయింది పరిస్థితి. ఘోస్ట్ కోసం శివరాజ్ కుమార్ చాలా కష్టపడ్డారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం మేకప్ వేసుకుని నటించి దాన్ని విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా వయసు తగ్గించేలా చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. తీరా చూస్తే పోటీ వల్ల ఒకేసారి అందరికీ చూపించలేకపోతున్నారు. ఘోస్ట్ తెలుగు హక్కులు ఎవరు కొన్నది ఇంకా తెలియలేదు. బాలయ్య, రవితేజ, విజయ్ లతో పోల్చుకుంటే శివన్నకు మన దగ్గర ముందు నుంచి మార్కెట్ లేదు. ఘోస్ట్ నుంచి అది వస్తుందని ఆశపడితే ఇదిగో ఇలా కాంపిటీషన్ తలనెప్పి వచ్చి పడింది. పోస్ట్ పోన్ తప్పేలా లేదు మరి.
This post was last modified on October 11, 2023 4:23 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…