దసరా పండగకు మనం మూడు సినిమాల మీద దృష్టి పెట్టాం కానీ కథ అక్కడితో అయిపోలేదు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియోలకు థియేటర్లకు సర్దుబాదు చేయడమే పెద్ద తలనెప్పిగా మారిన తరుణంలో అదనంగా వచ్చి చేరిన బాలీవుడ్ మూవీ గణపథ్ నుంచి మల్టీప్లెక్సుల పరంగా ముప్పు తప్పేలా లేదు. అయితే వీటికి ఏ మాత్రం తీసిపోని బడ్జెట్ తో గ్రాండ్ గా రూపొందిన కన్నడ చిత్రం ఘోస్ట్ సైతం ప్యాన్ ఇండియా రిలీజ్ అక్టోబర్ 20 ప్లాన్ చేసుకుంది. జైలర్ లో నరసింహగా అదరగొట్టిన శివరాజ్ కుమార్ హీరో కావడంతో ఇతర బాషల డిస్ట్రిబ్యూటర్ల నుంచి బాగానే డిమాండ్ ఉందట.
కర్ణాటకలో ఎలాంటి సమస్య లేదు. ముందురోజు అర్ధరాత్రి నుంచే షోలు వేసే రేంజ్ లో అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. కానీ తెలుగు తమిళంలో అలాంటి పరిస్థితి లేకపోవడంతో అక్టోబర్ 27 వాయిదా పడే ఆలోచనలో నిర్మాతలున్నారు. ఇప్పటికైతే కన్నడ వెర్షన్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు. థియేటర్లు కేటాయించారు. కానీ రిస్క్ ఏంటంటే టాక్ బయటికి వస్తుంది. డబ్బింగ్ రిలీజయ్యే నాటికి దాని గురించి ఆడియన్స్ కి అవగాహన వచ్చేసి ఉంటుంది. బ్లాక్ బస్టర్ అయితే ఇబ్బంది లేదు కానీ ఒకవేళ ఏ మాత్రం యావరేజ్ అయినా సరే మన ఆడియన్స్ ఆసక్తి చూపించరు.
అందుకే ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిపోయింది పరిస్థితి. ఘోస్ట్ కోసం శివరాజ్ కుమార్ చాలా కష్టపడ్డారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం మేకప్ వేసుకుని నటించి దాన్ని విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా వయసు తగ్గించేలా చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. తీరా చూస్తే పోటీ వల్ల ఒకేసారి అందరికీ చూపించలేకపోతున్నారు. ఘోస్ట్ తెలుగు హక్కులు ఎవరు కొన్నది ఇంకా తెలియలేదు. బాలయ్య, రవితేజ, విజయ్ లతో పోల్చుకుంటే శివన్నకు మన దగ్గర ముందు నుంచి మార్కెట్ లేదు. ఘోస్ట్ నుంచి అది వస్తుందని ఆశపడితే ఇదిగో ఇలా కాంపిటీషన్ తలనెప్పి వచ్చి పడింది. పోస్ట్ పోన్ తప్పేలా లేదు మరి.
This post was last modified on October 11, 2023 4:23 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…