దసరా పండగకు మనం మూడు సినిమాల మీద దృష్టి పెట్టాం కానీ కథ అక్కడితో అయిపోలేదు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియోలకు థియేటర్లకు సర్దుబాదు చేయడమే పెద్ద తలనెప్పిగా మారిన తరుణంలో అదనంగా వచ్చి చేరిన బాలీవుడ్ మూవీ గణపథ్ నుంచి మల్టీప్లెక్సుల పరంగా ముప్పు తప్పేలా లేదు. అయితే వీటికి ఏ మాత్రం తీసిపోని బడ్జెట్ తో గ్రాండ్ గా రూపొందిన కన్నడ చిత్రం ఘోస్ట్ సైతం ప్యాన్ ఇండియా రిలీజ్ అక్టోబర్ 20 ప్లాన్ చేసుకుంది. జైలర్ లో నరసింహగా అదరగొట్టిన శివరాజ్ కుమార్ హీరో కావడంతో ఇతర బాషల డిస్ట్రిబ్యూటర్ల నుంచి బాగానే డిమాండ్ ఉందట.
కర్ణాటకలో ఎలాంటి సమస్య లేదు. ముందురోజు అర్ధరాత్రి నుంచే షోలు వేసే రేంజ్ లో అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. కానీ తెలుగు తమిళంలో అలాంటి పరిస్థితి లేకపోవడంతో అక్టోబర్ 27 వాయిదా పడే ఆలోచనలో నిర్మాతలున్నారు. ఇప్పటికైతే కన్నడ వెర్షన్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు. థియేటర్లు కేటాయించారు. కానీ రిస్క్ ఏంటంటే టాక్ బయటికి వస్తుంది. డబ్బింగ్ రిలీజయ్యే నాటికి దాని గురించి ఆడియన్స్ కి అవగాహన వచ్చేసి ఉంటుంది. బ్లాక్ బస్టర్ అయితే ఇబ్బంది లేదు కానీ ఒకవేళ ఏ మాత్రం యావరేజ్ అయినా సరే మన ఆడియన్స్ ఆసక్తి చూపించరు.
అందుకే ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిపోయింది పరిస్థితి. ఘోస్ట్ కోసం శివరాజ్ కుమార్ చాలా కష్టపడ్డారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం మేకప్ వేసుకుని నటించి దాన్ని విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా వయసు తగ్గించేలా చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. తీరా చూస్తే పోటీ వల్ల ఒకేసారి అందరికీ చూపించలేకపోతున్నారు. ఘోస్ట్ తెలుగు హక్కులు ఎవరు కొన్నది ఇంకా తెలియలేదు. బాలయ్య, రవితేజ, విజయ్ లతో పోల్చుకుంటే శివన్నకు మన దగ్గర ముందు నుంచి మార్కెట్ లేదు. ఘోస్ట్ నుంచి అది వస్తుందని ఆశపడితే ఇదిగో ఇలా కాంపిటీషన్ తలనెప్పి వచ్చి పడింది. పోస్ట్ పోన్ తప్పేలా లేదు మరి.
This post was last modified on October 11, 2023 4:23 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…