దసరా పండగకు మనం మూడు సినిమాల మీద దృష్టి పెట్టాం కానీ కథ అక్కడితో అయిపోలేదు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియోలకు థియేటర్లకు సర్దుబాదు చేయడమే పెద్ద తలనెప్పిగా మారిన తరుణంలో అదనంగా వచ్చి చేరిన బాలీవుడ్ మూవీ గణపథ్ నుంచి మల్టీప్లెక్సుల పరంగా ముప్పు తప్పేలా లేదు. అయితే వీటికి ఏ మాత్రం తీసిపోని బడ్జెట్ తో గ్రాండ్ గా రూపొందిన కన్నడ చిత్రం ఘోస్ట్ సైతం ప్యాన్ ఇండియా రిలీజ్ అక్టోబర్ 20 ప్లాన్ చేసుకుంది. జైలర్ లో నరసింహగా అదరగొట్టిన శివరాజ్ కుమార్ హీరో కావడంతో ఇతర బాషల డిస్ట్రిబ్యూటర్ల నుంచి బాగానే డిమాండ్ ఉందట.
కర్ణాటకలో ఎలాంటి సమస్య లేదు. ముందురోజు అర్ధరాత్రి నుంచే షోలు వేసే రేంజ్ లో అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. కానీ తెలుగు తమిళంలో అలాంటి పరిస్థితి లేకపోవడంతో అక్టోబర్ 27 వాయిదా పడే ఆలోచనలో నిర్మాతలున్నారు. ఇప్పటికైతే కన్నడ వెర్షన్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు. థియేటర్లు కేటాయించారు. కానీ రిస్క్ ఏంటంటే టాక్ బయటికి వస్తుంది. డబ్బింగ్ రిలీజయ్యే నాటికి దాని గురించి ఆడియన్స్ కి అవగాహన వచ్చేసి ఉంటుంది. బ్లాక్ బస్టర్ అయితే ఇబ్బంది లేదు కానీ ఒకవేళ ఏ మాత్రం యావరేజ్ అయినా సరే మన ఆడియన్స్ ఆసక్తి చూపించరు.
అందుకే ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిపోయింది పరిస్థితి. ఘోస్ట్ కోసం శివరాజ్ కుమార్ చాలా కష్టపడ్డారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం మేకప్ వేసుకుని నటించి దాన్ని విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా వయసు తగ్గించేలా చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. తీరా చూస్తే పోటీ వల్ల ఒకేసారి అందరికీ చూపించలేకపోతున్నారు. ఘోస్ట్ తెలుగు హక్కులు ఎవరు కొన్నది ఇంకా తెలియలేదు. బాలయ్య, రవితేజ, విజయ్ లతో పోల్చుకుంటే శివన్నకు మన దగ్గర ముందు నుంచి మార్కెట్ లేదు. ఘోస్ట్ నుంచి అది వస్తుందని ఆశపడితే ఇదిగో ఇలా కాంపిటీషన్ తలనెప్పి వచ్చి పడింది. పోస్ట్ పోన్ తప్పేలా లేదు మరి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…