Movie News

‘టైగర్’ ఆఫీస్‌పై ఐటీ రైడ్స్

సినీ నిర్మాతల ఆఫీస్‌ల ఐటీ రైడ్స్ జరగడం కొత్తేమీ కాదు. ఒక ప్రొడక్షన్‌ హౌస్ నుంచి వరుసగా భారీ చిత్రాలు వస్తుంటే.. అలాగే ఏదైనా పెద్ద హిట్ కొట్టాక.. ఐటీ వాళ్లు రైడ్స్ చేయడం మామూలుగానే జరుగుతుంటుంది. కొన్ని నెలల కిందట మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, దర్శకుడు సుకుమార్‌ల ఆఫీసుల మీదా దాడులు జరిగాయి. కానీ అక్కడ సంచలనాత్మకంగా ఏమీ జరిగినట్లు వార్తలేమీ రాలేదు. ఆ వ్యవహారం చాలా సింపుల్‌గానే ముగిసిపోయింది.

ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకు సంబంధించిన ఆఫీస్‌ల మీద ఐటీ రైడ్స్ జరుగుతున్నాయన్న వార్త టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఐటీ రైడ్స్ అంటే మామూలే కదా.. ఇందులో ఆశ్చర్యపోవడానికి, ఆ విషయం హాట్ టాపిక్‌గా మారడానికి ఏముంది అనిపించొచ్చు. కానీ ఇక్కడ రైడ్స్ జరిగిన ఆఫీస్ ఎవరిది.. ఆ సినిమా తీసింది ఎవరు అన్నది కీలకమైన విషయం.

‘టైగర్ నాగేశ్వరరావు’ను నిర్మించింది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్. దీని అధినేత అభిషేక్ అగర్వాల్‌కు బీజేపీ మనిషిగా బలమైన ముద్ర ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ఆయన సినిమాలు తీస్తున్నాడని కూడా అందరికీ తెలుసు. ‘కశ్మీర్ ఫైల్స్’ ఆయన సినిమానే అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆయన పెద్ద పెద్ద బీజేపీ నేతలతో కలిసి సన్నిహితంగా మెలిగారు.

బీజేపీ ప్రో సినిమాలు మరికొన్ని ప్లాన్ చేశారు కూడా. అందులో ‘ఇండియా హౌస్’ కూడా ఒకటి. ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తికి సంబంధించిన సినిమా ఆఫీస్ మీద ఐటీ వాళ్లు దాడులు చేయడం అంటే ఇండస్ట్రీ జనాలందరికీ షాకింగ్‌గా అనిపిస్తోంది. అది కూడా సినిమా ఇంకో పది రోజుల్లో రిలీజ్ కాబోతుండగా.. ఇప్పుడు రైట్స్ ఏంటన్నది అంతుబట్టని విషయం. మరి ఈ విషయంలో ఏం మతలబు ఉందో?

This post was last modified on October 11, 2023 2:29 pm

Share

Recent Posts

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

24 minutes ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

3 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

3 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

3 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

4 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

4 hours ago