దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రేమైనా హింసయినా ప్రేక్షకుల మెదళ్లలోకి బలంగా జొప్పించేందుకే చూస్తాడు. అర్జున్ రెడ్డి విడుదలకు ముందు విజయ్ దేవరకొండ, షాలిని పాండేల లిప్ లాక్ కిస్సుతో వదిలిన పోస్టర్ ఎంత రచ్చ చేసిందో ఆ ప్రమోషన్లు ప్రత్యక్షంగా చూసినవాళ్లకు బాగా గుర్తే. తర్వాత కబీర్ సింగ్ దీనికి రీమేక్ కాబట్టి అందులోనూ రిపీట్ అయ్యింది. ఫ్రెష్ గా అనిమల్ లో రన్బీర్ కపూర్, రష్మిక మందన్నల మధ్య పెట్టిన అధర చుంబనాలు నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉండటం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇవాళే అన్ని భాషల్లో లిరికల్ వీడియో రిలీజ్ చేశారు.
పాట ప్రారంభంలో ఈ జంటను ఉద్దేశించి అమ్మాయి తరఫున కుటుంబ సభ్యులు రన్బీర్ ని నిలదీయడం, దానికి బదులు ఈ ఇద్దరూ ఘాడంగా పెదాలతో రొమాన్స్ చేయడంతోనే సందీప్ మార్కు మొదలైపోయింది. ఆ తర్వాత ఫ్లైట్ కాక్ పిట్, జీప్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలా క్రమం తప్పకుండ ముద్దులను కొనసాగిస్తూనే వచ్చారు. ఉన్న రెండున్నర నిమిషాల పాటలో కొన్ని డైలాగులు, మంచు కొండల్లో ఉన్న గుడి దగ్గర పెళ్లి చేసుకోవడం మినహాయించి మొత్తం రన్బీర్ రష్మికల మధ్య రొమాన్స్ తో గడిచిపోయింది. జామ్8 సంగీతం సమకూర్చిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశారు.
దీన్ని బట్టి సందీప్ వంగా ఒక స్పష్టత ఇచ్చాడు. లవ్, వయొలెన్స్ ఇందులో ఊహించని స్థాయిలో ఉంటాయని ముందే వచ్చిన లీక్ కు తగ్గట్టుగానే టీజర్, మొదటి పాటని డిజైన్ చేయించారు. ఇంకా ట్రైలర్, మిగిలిన సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవడం కష్టమే. డిసెంబర్ 1 విడుదల కాబోతున్న అనిమల్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ చాలా గ్యాప్ తీసుకుని చేసిన మూవీ కావడంతో ఫ్యాన్స్ మాములు ఆశలు పెట్టుకోలేదు. అటు రష్మిక సైతం బాలీవుడ్ లో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఇది పెద్ద బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఎదురు చూస్తోంది.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…