టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన బ్లాక్ బస్టర్స్ చేసిన హీరోయిన్ త్రిష ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోయి నెమ్మదించింది కానీ తమిళంలో మాత్రం ఓ రేంజ్ లో దుమ్ము దులుపుతోంది. విజయ్ లియోలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఏరికోరి ఆమెనే తీసుకోవడం ఒక ఉదాహరణ మాత్రమే. పొన్నియిన్ సెల్వన్ లో ఐశ్వర్య రాయ్ తో సహా తన సాటి వాళ్ళను పూర్తిగా డామినేట్ చేసేలా గ్లామర్ తో వావ్ అనిపించడం తనకే చెల్లింది. త్రిషకు హీరోలతో పాటు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా గట్టిగా వస్తున్నాయి. మొన్న శుక్రవారం మంచి అంచనాల మధ్య ది రోడ్ రిలీజయ్యింది.
పెద్దగా పోటీ లేకపోయినా క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ది రోడ్ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేదు. ఓ హైవేలోని మైలురాయి దగ్గర అంతు చిక్కని రీతిలో కొన్ని యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అవి ప్రమాదాలుగా భావించిన పోలీసులు పట్టించుకోరు. ప్రేమించే భర్త, కొడుకు సరిగా అదే చోట ప్రాణాలు కోల్పోవడంతో తల్లడిల్లిపోయిన మీరా(త్రిష)కు దాని వెనుక ఏదో మిస్టరీ ఉందని అర్థమవుతుంది. ఈ ఘటనకు లైంగిక వేధింపుల కేసు ఎదురుకుంటున్న ఓ టీచర్(షబీర్ కల్లరకల్)కు కనెక్షన్ ఉంటుంది. దీంతో మీరా స్వయంగా అసలు నిజం తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతుంది.
లైన్ పరంగా బాగానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లేని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు అరుణ్ వశీగరన్ ఫెయిలయ్యాడు. దీంతో సన్నివేశాలు ముందుకు వెళ్లేకొద్దీ కథనం ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు. ఒక దశ దాటాక హంతుకుడు ఎవరో సులభంగా గుర్తించేలా నెరేట్ చేయడం ఫ్లోని దెబ్బ తీసింది. మంచి థ్రిల్లర్ గా మలిచే స్కోప్ ఉన్నప్పటికీ ఆ దిశగా అవకాశాన్ని వాడుకోలేదు. రోడ్డు మీద మర్డర్ల కాన్సెప్ట్ కొత్త కాకపోయినా ట్రీట్ మెంట్ కాస్త విభిన్నంగా ఉన్నా పాస్ అయిపోయేది. మరి అక్కడే తిరస్కారానికి గురైన ఈ రహదారిని తెలుగు డబ్బింగ్ వదిలే సాహసం బహుశా ఎవరు చేయరేమో.
This post was last modified on October 10, 2023 11:42 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…