దసరా పండక్కు నేనూ వస్తానంటూ బాలీవుడ్ హీరో టైగర్ శ్రోఫ్ తెగ ఉత్సాహపడుతున్నాడు. ఇతగాడి కొత్త సినిమా గణపథ్ అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. హిందీలో ఒకటే అయితే పెద్దగా మాట్లాడుకునే అవసరం లేదు కానీ ప్యాన్ ఇండియా పేరుతో తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ సూపర్ 30, కంగనా రౌనత్ క్వీన్ లాంటి కంటెంట్ బేస్డ్ మూవీస్ తీసిన వికాస్ బహ్ల్ దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. టీజర్ వచ్చినప్పుడు మన ప్రభాస్ కల్కి కాన్సెప్ట్ లాగే అనిపించింది. కానీ ఇవాళ ట్రైలర్ చూశాక కొత్త డౌట్లు వస్తున్నాయి.
రెండున్నర నిముషాలు పాటు సాగే ట్రైలర్ లో కథతో పాటు బోలెడు కన్ఫ్యూజన్ చూపించారు. చంపడం తప్ప చావడం తెలియని ఒక కారణ జన్ముడు గుడ్డు(టైగర్ శ్రోఫ్). పేదవాడు దోచుకునేవాడి మధ్య అంతరాన్ని తగ్గించే మహత్తరకార్యం మీద దేవుడు పంపించి ఉంటాడు. అయితే మొండిగా అవతలి వాళ్ళను కొట్టడం తప్ప ఇంకేమి తెలియని గుడ్డుకి ఓ అద్భుత ఘట్టం తర్వాత జ్ఞానోదయం కలిగి వినాయకుడి ఆశీర్వాదంతో గణపథ్ గా మారి ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్న సైన్స్ అరాచక శక్తుల భరతం పట్టే పనికి పూనుకుంటాడు. తర్వాత ఏం జరుగుతోందో తెలిసిందే.
కాన్సెప్ట్ వెరైటీగా ఉన్నప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ ఆశించిన స్థాయిలో లేవు. పైగా వర్తమానం, భవిష్యత్తు మధ్య ఏదో గందరగోళం పెట్టేసి టైగర్ శ్రోఫ్ హీరోయిజంని ఓవర్ ఎలివేట్ చేసే ప్రయత్నం కనిపించింది. ఉత్తరాది మాస్ జనాలకు ఇదేమైనా కనెక్ట్ కావొచ్చేమో కానీ ఇంతకు మించిన స్టాండర్ తో ఇలాంటివి మనం బోలెడు చూశాం కాబట్టి కొత్తగా అనిపించదు. ఆది పురుష్ సీత కృతి సనన్ సైతం యాక్షన్ ఎపిసోడ్స్ లో భీభత్సమైన స్టంట్లు చేసింది. అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్యమైన పాత్ర చేస్తుండగా ఆయన గెటప్ కొంచెం తేడాగానే ఉంది. మొత్తానికి బాలయ్య, రవితేజ. విజయ్ లను ఢీ కొట్టేంత మ్యాటర్ అయితే లేదు
This post was last modified on October 9, 2023 6:53 pm
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…