కొత్త సినిమాలకు ముందు రోజు.. లేదా రెండు, మూడు రోజుల ముందు పెయిడ్ ప్రిమియర్స్ వేయడం మామూలే. ఇటీవల ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. సామజవరగమన, బేబి, మ్యాడ్ లాంటి చిత్రాలకు ప్రిమియర్స్ బాగా ప్లస్ అయ్యాయి కూడా. ఈ బాటలో మరో చిన్న సినిమా పెయిడ్ ప్రిమియర్స్కు రెడీ అయింది. ఐతే ఆ సినిమాకు ఒకట్రెండు రోజుల ముదు కాదు.. ఏకంగా విడుదలకు 18 రోజుల ముందే ప్రిమియర్స్ పడబోతున్నాయి. ఆ చిత్రమే.. మార్టిన్ లూథర్ కింగ్.
బర్నింగ్ స్టార్గా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు లీడ్ రోల్ చేసిన చిత్రమిది. తమిళంలో మంచి విజయం సాధించిన ‘మండేలా’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. సైలెంటుగా షూటింగ్ పూర్తి చేసి నేరుగా రిలీజ్ డేట్తో సినిమాను అనౌన్స్ చేసింది చిత్ర బృందం. అక్టోబరు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే ఈ సినిమాకు ఈ రోజు (సోమవారం) నుంచే పెయిడ్ ప్రిమియర్స్ మొదలవుతున్నాయి. ముందుగా విశాఖపట్నంలోని ఐనాక్స్ థియేటర్లో మార్నింగ్ షోతో ప్రిమియర్ మొదలైంది.
తర్వాతి నాలుగు రోజుల్లో వరుసగా విజయవాడ, నెల్లూరు, కర్నూలు, వరంగల్లో మార్నింగ్ షోలకు ప్రిమియర్స్ వస్తున్నారు. ఈ షోలకు కాస్ట్ అండ్ క్రూ అంతా హాజరవుతోంది. విడుదల ముంగిట హైదరాబాద్లో కూడా కొన్ని షోలు ప్రిమియర్స్గా వేస్తారట. విడుదలకు మరీ ఇన్ని రోజుల ముందు ప్రిమియర్స్ పడటం ఎన్నడూ జరిగి ఉండదు. ‘మండేలా’ చాలా గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. అది ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూనే ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది.
తమిళంలో యోగిబాబు హీరోగా నటించాడు. ఇక్కడ సంపూ ఆ పాత్ర చేస్తున్నాడు. వెంకటేష్ మహా ఈ చిత్రంలో కీలక పాత్ర చేయడమే కాక క్రియేటివ్ ప్రొడ్యూసర్గానూ వ్యవహరించాడు. పూజ కొల్లూరు డైరెక్ట్ చేసిన చిత్రమిది. సినిమా మీద చాలా నమ్మకంతో ఉన్న టీం.. ‘మార్టిన్ లూథర్ కింగ్’ను జనాల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రిమియర్స్ వేస్తోంది. కానీ మరీ ఇంత ముందుగా కాకుండా రిలీజ్ ముంగిట వారం ముందు నుంచి ప్రిమియర్స్ వేస్తే బాగుండేదేమో. కానీ అప్పుడు దసరా సినిమాల సందడి ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…