కొత్త సినిమాలకు ముందు రోజు.. లేదా రెండు, మూడు రోజుల ముందు పెయిడ్ ప్రిమియర్స్ వేయడం మామూలే. ఇటీవల ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. సామజవరగమన, బేబి, మ్యాడ్ లాంటి చిత్రాలకు ప్రిమియర్స్ బాగా ప్లస్ అయ్యాయి కూడా. ఈ బాటలో మరో చిన్న సినిమా పెయిడ్ ప్రిమియర్స్కు రెడీ అయింది. ఐతే ఆ సినిమాకు ఒకట్రెండు రోజుల ముదు కాదు.. ఏకంగా విడుదలకు 18 రోజుల ముందే ప్రిమియర్స్ పడబోతున్నాయి. ఆ చిత్రమే.. మార్టిన్ లూథర్ కింగ్.
బర్నింగ్ స్టార్గా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు లీడ్ రోల్ చేసిన చిత్రమిది. తమిళంలో మంచి విజయం సాధించిన ‘మండేలా’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. సైలెంటుగా షూటింగ్ పూర్తి చేసి నేరుగా రిలీజ్ డేట్తో సినిమాను అనౌన్స్ చేసింది చిత్ర బృందం. అక్టోబరు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే ఈ సినిమాకు ఈ రోజు (సోమవారం) నుంచే పెయిడ్ ప్రిమియర్స్ మొదలవుతున్నాయి. ముందుగా విశాఖపట్నంలోని ఐనాక్స్ థియేటర్లో మార్నింగ్ షోతో ప్రిమియర్ మొదలైంది.
తర్వాతి నాలుగు రోజుల్లో వరుసగా విజయవాడ, నెల్లూరు, కర్నూలు, వరంగల్లో మార్నింగ్ షోలకు ప్రిమియర్స్ వస్తున్నారు. ఈ షోలకు కాస్ట్ అండ్ క్రూ అంతా హాజరవుతోంది. విడుదల ముంగిట హైదరాబాద్లో కూడా కొన్ని షోలు ప్రిమియర్స్గా వేస్తారట. విడుదలకు మరీ ఇన్ని రోజుల ముందు ప్రిమియర్స్ పడటం ఎన్నడూ జరిగి ఉండదు. ‘మండేలా’ చాలా గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. అది ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూనే ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది.
తమిళంలో యోగిబాబు హీరోగా నటించాడు. ఇక్కడ సంపూ ఆ పాత్ర చేస్తున్నాడు. వెంకటేష్ మహా ఈ చిత్రంలో కీలక పాత్ర చేయడమే కాక క్రియేటివ్ ప్రొడ్యూసర్గానూ వ్యవహరించాడు. పూజ కొల్లూరు డైరెక్ట్ చేసిన చిత్రమిది. సినిమా మీద చాలా నమ్మకంతో ఉన్న టీం.. ‘మార్టిన్ లూథర్ కింగ్’ను జనాల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రిమియర్స్ వేస్తోంది. కానీ మరీ ఇంత ముందుగా కాకుండా రిలీజ్ ముంగిట వారం ముందు నుంచి ప్రిమియర్స్ వేస్తే బాగుండేదేమో. కానీ అప్పుడు దసరా సినిమాల సందడి ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నారు.
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…