నిన్న జరిగిన భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. బాలకృష్ణ ప్రసంగిస్తూ ఇంట్లో మోక్షజ్ఞ తన గురించి అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీశాయి. శ్రీలీలకి జోడిగా నటించాలని తనంటే ఏంటి డాడీ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అంటూ కొడుకు సెటైర్ వేసాడని బాలయ్య ఓపెన్ గా స్టేజి ముందు వేలాది అభిమానుల సమక్షంలో చెప్పేశారు. నిజానికి మోక్షు ఏ ఉద్దేశంతో ఏ మాట అన్నాడో తెలియదు కానీ ఆ పదం వెనుక అర్థం విశ్లేషించుకున్న వాళ్ళ అబ్బే ఇది చెప్పుకుని ఉండాల్సింది కాదని అంటున్నారు. ఏదైతేనేం బాలయ్య ఇలాంటివి కేర్ చేసే టైపు కాదు కాబట్టి ఉన్నదున్నట్టు మాట్లాడేశారు.
దీనికన్నా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో స్పష్టంగా చెప్పి ఉంటే బాగుండేదని అభిమానులు ఫీలవుతున్నారు. అదిగో ఇదిగో అంటూ ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ బాలయ్య వారసుడు తెరమీద రావడం లేదు. ఈ మధ్య బాగా సన్నబడ్డాడు. శిక్షణ తీసుకున్నాడు. లుక్స్ చక్కగా కుదురుతున్నాయి. డైరెక్టర్ కాంబోని ముందు లాక్ చేసుకుంటే షూటింగ్ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. కానీ డెబ్యూని హ్యాండిల్ చేసే దర్శకుకు ఎవరనేది మాత్రం బయట పడటం. పూరి జగన్నాధ్, బోయపాటి శీను, అనిల్ రావిపూడి ఇలా రకరకాల పేర్లు తిరుగుతున్నాయి తప్పించి ఫైనల్ ఎవరో తెలియడం లేదు.
సరే ఆన్ లైన్ అన్నాక ఇలాంటి చర్చలు డిబేట్లు బోలెడు జరుగుతుంటాయి కాబట్టి ఒకటి రెండు రోజుల తర్వాత ఇవి మర్చిపోవడం సహజం. ట్రైలర్ లాంచ్ నే ప్రీ రిలీజ్ ఈవెంట్ స్థాయిలో చేయడంతో మళ్ళీ హైదరాబాద్ లో ఇంకో వేడుక చేయడం అనుమానంగానే ఉంది. రిలీజ్ కు కేవలం పది రోజులే ఉంది. ప్రమోషన్లు వేగవంతం చేయాలి. లియో, టైగర్ నాగేశ్వరరావులతో గట్టి పోటీ ఉండటంతో థియేటర్ల విషయంలో మంచి ప్లానింగ్ అవసరం. ఇబ్బంది రాకుండా చూసుకుంటానని లియో హక్కులు కొన్న నాగవంశీ అన్నప్పటికీ బిజినెస్ దగ్గర పరిస్థితులను ముందస్తుగా అంచనా వేయడం కష్టం.
This post was last modified on October 9, 2023 11:18 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…