ప్రస్తుతం ఇండియాలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే పెద్దగా ఆలోచన చేయకుండానే అనిరుధ్ రవిచందర్ పేరు చెప్పేయొచ్చు. స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ అతడిది. యూత్కు కిక్కెక్కించే పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్తో అతను థియేటర్లను ఒక ఊపు ఊపేస్తుంటాడు. ఇటీవల ‘జైలర్’ సినిమాతో అతను ఎంత సంచలనం రేపాడో తెలిసిందే. యావరేజ్ మూవీ అయిన ‘జైలర్’ బ్లాక్ బస్టర్ కావడంలో అనిరుధ్ పాటలు, స్కోర్ ముఖ్య పాత్ర పోషించాయనడంలో సందేహం లేదు.
అనిరుధ్ ఏదైనా సినిమా వేడుకకు హాజరైనా.. మ్యూజిక్ కన్సర్ట్ చేసినా.. అక్కడ జనం ఊగిపోయేలా చేస్తాడు. బయట కూడా అనిరుధ్కు మాంచి క్రేజ్ కనిపిస్తుంటుంది. ఈ ఫాలోయింగ్, క్రేజ్ను ఇంకో రకంగా వాడుకోవడానికి కోలీవుడ్ చూస్తున్నట్లు సమాచారం. అతను హీరోగా ఒక సినిమా రాబోతోందన్నది ఇప్పుడు కోలీవుడ్లో హాట్ న్యూస్.
మాస్టర్, విక్రమ్, లియో.. ఇలా వరుసగా లోకేష్ కనకరాజ్ చిత్రాలకు అనిరుధే సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ దర్శకుడే తన కథతో అనిరుధ్ను హీరోగా పరిచయం చేయబోతున్నాడట. లోకేష్ చిత్రాలకు అదిరిపోయే రీతిలో యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్న ఫైట్ మాస్టర్ ద్వయం అన్బు-అరివు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారట. కవలలైన అన్బు అరివు.. ‘అన్బరివు’ అనే ఒకే పేరుతో పాపులర్ అయ్యారు.
‘కబాలి’తో మొదలు ఎన్నో భారీ చిత్రాలకు అదిరిపోయే యాక్సన్ సీక్వెన్సులు చేశారు. ఇటీవలే మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘ఆర్డీఎక్స్’ వాళ్ల పేరు మార్మోగేలా చేసింది. ‘లియో’తోనూ తమదైన ముద్ర వేసేలా ఉన్నారీ ఫైట్ మాస్టర్లు. లోకేష్ కనకరాజ్తో వారికి మంచి అనుబంధం ఉంది. వాళ్ల శైలికి తగ్గట్లు మంచి యాక్షన్ కథను రెడీ చేసి ఇవ్వగా.. అనిరుధ్తో వాళ్లీ సినిమా తీయబోతున్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. అనిరుధ్ హీరో కావడం, అది కూడా ఓ యాక్షన్ మూవీతో కావడం ఆసక్తి రేకెత్తించేదే.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…