సంగీత దర్శకుడు తమన్ కెరీర్లోనే బెస్ట్ వర్క్స్లో ఒకటిగా ‘అఖండ’ను చెప్పొచ్చు. ఆ సినిమా అతడి బ్యాగ్రౌండ్ స్కోర్ అతి పెద్ద అసెట్గా నిలిచిందనడంలో మరో మాట లేదు. తమన్ ఎంతో తపనతో చేసిన స్కోర్ అది. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తీసేసి చూస్తే ఆ సినిమా జనానికి ఆ స్థాయిలో కనెక్ట్ అయ్యేదా అంటే సందేహమే. బాలయ్య అభిమానులే కాక మాస్ ప్రేక్షకులు ఊగిపోయే రేంజిలో ఆ సినిమాకు స్కోర్ ఇచ్చాడు తమన్.
అలాంటిది ఇప్పుడు దర్శకుడు బోయపాటి శ్రీను తమన్ పనితనాన్ని కొంచెం తక్కువ చేసేలా మాట్లాడటం ఈ సంగీత దర్శకుడి అభిమానులకు రుచించడం లేదు. ‘అఖండ’ సినిమాకు తమన్ తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు, ఆ స్కోర్ లేకుంటే సినిమా అంత ఎఫెక్టివ్గా ఉండేది కాదేమో అన్న అభిప్రాయాలపై బోయపాటి ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.
తమన్ సంగీతాన్ని తీసేసి చూసినా కూడా ‘అఖండ’ ప్రేక్షకులకు అంతే ఎగ్జైట్మెంట్ కలిగించేదని.. ఆ సినిమాను చూసి గర్వపడేవాళ్లని బోయపాటి వ్యాఖ్యానించాడు. ఆ కథలో అంత దమ్ము ఉందని బోయపాటి పేర్కొన్నాడు. సినిమాలో అంత విషయం ఉండబట్టే తమన్ కూడా ఎంతో ఇన్స్పైర్ అయి నేపథ్య సంగీతం చేశాడని.. ఈ విషయంలో తన క్రెడిట్ తనకు ఇవ్వాల్సిందే అని బోయపాటి వ్యాఖ్యానించాడు.
‘అఖండ’ విషయంలో తమన్ వర్క్ను కొనియాడిన వాళ్లే.. ఇప్పుడు ‘స్కంద’ విషయంలో విమర్శిస్తున్నారని.. అది కూడా తన దృష్టికి వచ్చిందని.. ఐతే తాము సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదని బోయపాటి అన్నాడు. ‘అఖండ’ విషయంలో తమన్ను కొంత పొగుడుతూనే.. తన బ్యాగ్రౌండ్ స్కోర్ లేకున్నా తేడా ఏమీ ఉండేది కాదని బోయపాటి అనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కచ్చితంగా తమన్ స్కోర్ లేకుంటే ఆ సినిమా అంత ఎఫెక్టివ్గా ఉండేది కాదన్నది స్పష్టం.
This post was last modified on October 7, 2023 7:48 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…