Allu Arjun
రామ్ కు తిరుగులేని బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న స్కంద డిజాస్టర్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సెంటిమెంట్ ప్రకారం రిలీజ్ కు ముందు ప్రమోషన్లలో కనిపించని దర్శకుడు బోయపాటి శీను ఇప్పుడు ఫలితం తేలిపోయాక అందుబాటులోకి వచ్చి పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఒకటి తప్ప కొత్త రిలీజులన్నీ మరీ దారుణమైన టాక్ తెచ్చుకోవడంతో స్కంద మళ్ళీ పికప్ అవుతుందేమోననే ఆశలు బయ్యర్లలో చిగురించాయి. కానీ థియేటర్ల దగ్గర టికెట్ల అమ్మకాలు చూస్తే అలా అనిపించడం లేదు. మహా అయితే ఆదివారం కొంత పికప్ కనిపించవచ్చు అంతే.
దీని ఫలితం ఎలా ఉన్న బోయపాటి శీను నెక్స్ట్ అల్లు అర్జున్, సూర్యలతో సినిమాలు చేయడం ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు. అయితే రిస్క్ విషయంలో చాలా క్యాలికులేటెడ్ గా ఉంటున్న బన్నీ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగాలకు మాత్రమే స్పష్టమైన కమిట్ మెంట్ ఇచ్చాడు. అన్నీ కుదిరితే అట్లీతో కూడా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. వీళ్ళందరూ ప్రస్తుత ట్రెండ్ కు తగట్టు మాస్ కం క్లాస్ ఎంటర్ టైనర్స్ ఇవ్వగల సమర్థులు. కానీ బోయపాటితో అలా ఉండదు. కేవలం ఊర మాస్ ని మాత్రమే నమ్ముకుని సినిమాలు తీస్తారు.
ఇదే బన్నీతో సరైనోడు తీసి బ్లాక్ బస్టర్ కొట్టి ఉండొచ్చు. కానీ ఆ టైంలో అల్లు అర్జున్ కి ప్యాన్ ఇండియా ఇమేజ్ లేదు. ఇప్పటి లెక్కలు వేరు. పైగా మొదటి రెండు మినహాయించి బోయపాటి శీనుకి కేవలం బాలకృష్ణతో మాత్రమే సక్సెస్ లున్నాయి. వినయ విధేయ రామ, జయ జానకి నాయక, స్కందలు తేడా కొట్టేశాయి. అలాంటప్పుడు బన్నీతో కాంబో సెట్ కావాలంటే చాలా టైం పడుతుంది. అఖండ 2కి ఇబ్బందులు ఎదురవ్వకపోవచ్చు. స్కంద 2 కూడా డౌటే. మరి సూర్యది ప్రకటించే దాకా కన్ఫర్మ్ గా చెప్పలేని పరిస్థితి. స్కంద ఫెయిల్యూర్ కాకపోయి ఉంటే ఈ విశ్లేషణ వేరుగా ఉండేది.
This post was last modified on October 7, 2023 7:52 pm
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…