Movie News

బన్నీ అంత సులభంగా ఒప్పుకుంటాడా

రామ్ కు తిరుగులేని బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న స్కంద డిజాస్టర్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సెంటిమెంట్ ప్రకారం రిలీజ్ కు ముందు ప్రమోషన్లలో కనిపించని దర్శకుడు బోయపాటి శీను ఇప్పుడు ఫలితం తేలిపోయాక అందుబాటులోకి వచ్చి పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.  ఒకటి తప్ప కొత్త రిలీజులన్నీ మరీ దారుణమైన టాక్ తెచ్చుకోవడంతో స్కంద మళ్ళీ పికప్ అవుతుందేమోననే ఆశలు బయ్యర్లలో చిగురించాయి. కానీ థియేటర్ల దగ్గర టికెట్ల అమ్మకాలు చూస్తే అలా అనిపించడం లేదు. మహా అయితే ఆదివారం కొంత పికప్ కనిపించవచ్చు అంతే.

దీని ఫలితం ఎలా ఉన్న బోయపాటి శీను నెక్స్ట్ అల్లు అర్జున్, సూర్యలతో సినిమాలు చేయడం ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు. అయితే రిస్క్ విషయంలో చాలా క్యాలికులేటెడ్ గా ఉంటున్న బన్నీ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగాలకు మాత్రమే స్పష్టమైన కమిట్ మెంట్ ఇచ్చాడు. అన్నీ కుదిరితే అట్లీతో కూడా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. వీళ్ళందరూ ప్రస్తుత ట్రెండ్ కు తగట్టు మాస్ కం క్లాస్ ఎంటర్ టైనర్స్ ఇవ్వగల సమర్థులు. కానీ బోయపాటితో అలా ఉండదు. కేవలం ఊర మాస్ ని మాత్రమే నమ్ముకుని సినిమాలు తీస్తారు.

ఇదే బన్నీతో సరైనోడు తీసి బ్లాక్ బస్టర్ కొట్టి ఉండొచ్చు. కానీ ఆ టైంలో అల్లు అర్జున్ కి ప్యాన్ ఇండియా ఇమేజ్ లేదు. ఇప్పటి లెక్కలు వేరు. పైగా మొదటి రెండు మినహాయించి బోయపాటి శీనుకి కేవలం బాలకృష్ణతో మాత్రమే సక్సెస్ లున్నాయి. వినయ విధేయ రామ, జయ జానకి నాయక, స్కందలు తేడా కొట్టేశాయి. అలాంటప్పుడు బన్నీతో కాంబో సెట్ కావాలంటే చాలా టైం పడుతుంది. అఖండ 2కి ఇబ్బందులు ఎదురవ్వకపోవచ్చు. స్కంద 2 కూడా డౌటే.  మరి సూర్యది ప్రకటించే దాకా కన్ఫర్మ్ గా చెప్పలేని పరిస్థితి. స్కంద ఫెయిల్యూర్ కాకపోయి ఉంటే ఈ విశ్లేషణ వేరుగా ఉండేది.

This post was last modified on October 7, 2023 7:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

2 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

5 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

6 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

8 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

8 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

9 hours ago