Allu Arjun
రామ్ కు తిరుగులేని బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న స్కంద డిజాస్టర్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సెంటిమెంట్ ప్రకారం రిలీజ్ కు ముందు ప్రమోషన్లలో కనిపించని దర్శకుడు బోయపాటి శీను ఇప్పుడు ఫలితం తేలిపోయాక అందుబాటులోకి వచ్చి పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఒకటి తప్ప కొత్త రిలీజులన్నీ మరీ దారుణమైన టాక్ తెచ్చుకోవడంతో స్కంద మళ్ళీ పికప్ అవుతుందేమోననే ఆశలు బయ్యర్లలో చిగురించాయి. కానీ థియేటర్ల దగ్గర టికెట్ల అమ్మకాలు చూస్తే అలా అనిపించడం లేదు. మహా అయితే ఆదివారం కొంత పికప్ కనిపించవచ్చు అంతే.
దీని ఫలితం ఎలా ఉన్న బోయపాటి శీను నెక్స్ట్ అల్లు అర్జున్, సూర్యలతో సినిమాలు చేయడం ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు. అయితే రిస్క్ విషయంలో చాలా క్యాలికులేటెడ్ గా ఉంటున్న బన్నీ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగాలకు మాత్రమే స్పష్టమైన కమిట్ మెంట్ ఇచ్చాడు. అన్నీ కుదిరితే అట్లీతో కూడా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. వీళ్ళందరూ ప్రస్తుత ట్రెండ్ కు తగట్టు మాస్ కం క్లాస్ ఎంటర్ టైనర్స్ ఇవ్వగల సమర్థులు. కానీ బోయపాటితో అలా ఉండదు. కేవలం ఊర మాస్ ని మాత్రమే నమ్ముకుని సినిమాలు తీస్తారు.
ఇదే బన్నీతో సరైనోడు తీసి బ్లాక్ బస్టర్ కొట్టి ఉండొచ్చు. కానీ ఆ టైంలో అల్లు అర్జున్ కి ప్యాన్ ఇండియా ఇమేజ్ లేదు. ఇప్పటి లెక్కలు వేరు. పైగా మొదటి రెండు మినహాయించి బోయపాటి శీనుకి కేవలం బాలకృష్ణతో మాత్రమే సక్సెస్ లున్నాయి. వినయ విధేయ రామ, జయ జానకి నాయక, స్కందలు తేడా కొట్టేశాయి. అలాంటప్పుడు బన్నీతో కాంబో సెట్ కావాలంటే చాలా టైం పడుతుంది. అఖండ 2కి ఇబ్బందులు ఎదురవ్వకపోవచ్చు. స్కంద 2 కూడా డౌటే. మరి సూర్యది ప్రకటించే దాకా కన్ఫర్మ్ గా చెప్పలేని పరిస్థితి. స్కంద ఫెయిల్యూర్ కాకపోయి ఉంటే ఈ విశ్లేషణ వేరుగా ఉండేది.
This post was last modified on October 7, 2023 7:52 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…