లెజెండరీ బ్యాడ్మింటన్ ప్లేయర్ కమ్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ గురించి చర్చ ఇప్పటిది కాదు. ఐదేళ్ల ముందే ఈ సినిమా కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ దాదాపు వంద కోట్ల బడ్జెట్లో సినిమా చేయడానికి ప్రణాళికలు రచించుకుంది. గోపీ స్నేహితుడు, ఒకప్పటి బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా అయిన సుధీర్ బాబు హీరోగా.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా చేయాలనుకున్నారు. కొంత కాలం ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా జరిగాయి.
సుధీర్ సైతం ఈ సినిమా కోసం ప్రిపరేషన్లో ఉన్నాడు. కానీ మధ్యలో ఏమైందో ఏమో.. ఈ ప్రాజెక్ట్ హోల్డ్లో పడింది. ప్రవీణ్, సుధీర్ వేర్వేరు ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారు. రెండేళ్లుగా అసలు ఈ సినిమా గురించి చర్చే లేదు. ఇక ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు లేవని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ సుధీర్ బాబు మాత్రం గోపీచంద్ బయోపిక్ మీద ఆశలు వదులుకోలేదు.
ఆ సినిమా కచ్చితంగా ఉంటుందని అంటున్నాడు. గోపీ బయోపిక్ హక్కులు ఒక నిర్మాణ సంస్థ నుంచి మరో ప్రొడక్షన్ హౌస్ చేతికి మారాయని.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో అది కూడా ఒకటిగా ఉంటుందని సుధీర్ చెప్పాడు. ఆటగాడిగా గోపీచంద్, కోచ్గా గోపీచంద్.. ఇలా రెండు భాగాలుగా ఈ సినిమా చేయాలని గతంలో అనుకున్నామని.. భవిష్యత్తులో ఎలా చేస్తామో చూడాలని అతనన్నాడు.
గోపీ బయోపిక్ కంటే ముందు తాను మరో మూడు చిత్రాలు చేస్తానని.. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అతను స్పష్టం చేశాడు. దర్శకుడెవరు.. ఇతర వివరాలేంటన్నది అతను ఇప్పుడు మాట్లాడలేదు. ప్రస్తుతం తాను ‘మా నాన్న సూపర్ హీరో’, ‘హరోం హర’ చిత్రాల్లో నటిస్తున్నట్లు సుధీర్ వెల్లడించాడు. సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని.. ఆయన జీవితాన్ని సరిగ్గా చూపించే దర్శకుడు కుదరడం కీలకమని అతనన్నాడు.
This post was last modified on October 5, 2023 1:35 pm
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…