లెజెండరీ బ్యాడ్మింటన్ ప్లేయర్ కమ్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ గురించి చర్చ ఇప్పటిది కాదు. ఐదేళ్ల ముందే ఈ సినిమా కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ దాదాపు వంద కోట్ల బడ్జెట్లో సినిమా చేయడానికి ప్రణాళికలు రచించుకుంది. గోపీ స్నేహితుడు, ఒకప్పటి బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా అయిన సుధీర్ బాబు హీరోగా.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా చేయాలనుకున్నారు. కొంత కాలం ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా జరిగాయి.
సుధీర్ సైతం ఈ సినిమా కోసం ప్రిపరేషన్లో ఉన్నాడు. కానీ మధ్యలో ఏమైందో ఏమో.. ఈ ప్రాజెక్ట్ హోల్డ్లో పడింది. ప్రవీణ్, సుధీర్ వేర్వేరు ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారు. రెండేళ్లుగా అసలు ఈ సినిమా గురించి చర్చే లేదు. ఇక ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు లేవని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ సుధీర్ బాబు మాత్రం గోపీచంద్ బయోపిక్ మీద ఆశలు వదులుకోలేదు.
ఆ సినిమా కచ్చితంగా ఉంటుందని అంటున్నాడు. గోపీ బయోపిక్ హక్కులు ఒక నిర్మాణ సంస్థ నుంచి మరో ప్రొడక్షన్ హౌస్ చేతికి మారాయని.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో అది కూడా ఒకటిగా ఉంటుందని సుధీర్ చెప్పాడు. ఆటగాడిగా గోపీచంద్, కోచ్గా గోపీచంద్.. ఇలా రెండు భాగాలుగా ఈ సినిమా చేయాలని గతంలో అనుకున్నామని.. భవిష్యత్తులో ఎలా చేస్తామో చూడాలని అతనన్నాడు.
గోపీ బయోపిక్ కంటే ముందు తాను మరో మూడు చిత్రాలు చేస్తానని.. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అతను స్పష్టం చేశాడు. దర్శకుడెవరు.. ఇతర వివరాలేంటన్నది అతను ఇప్పుడు మాట్లాడలేదు. ప్రస్తుతం తాను ‘మా నాన్న సూపర్ హీరో’, ‘హరోం హర’ చిత్రాల్లో నటిస్తున్నట్లు సుధీర్ వెల్లడించాడు. సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని.. ఆయన జీవితాన్ని సరిగ్గా చూపించే దర్శకుడు కుదరడం కీలకమని అతనన్నాడు.
This post was last modified on October 5, 2023 1:35 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…