ఊహించని విధంగా డిసెంబర్ 22ని సలార్ తీసేసుకోవడంతో ఆ డేట్ కి ముందు ప్లాన్ చేసుకున్న సినిమాలు వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. వాటిలో విక్టరీ వెంకటేష్ ప్యాన్ ఇండియా మూవీ సైంధవ్ కూడా ఉంది. పోస్ట్ పోన్ కు సంబంధించిన వార్త కొద్దిరోజుల క్రితమే వచ్చినప్పటికీ ఏ డేట్ ఉంటుందోనని అభిమానులు సంక్రాంతి మీద కాసింత అనుమానంగానే ఉన్నారు. దానికి చెక్ పెడుతూ నిర్మాతలు జనవరి 13 సైంధవ్ ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఎఫ్2 తర్వాత వెంకీ ఈ పండగ బరిలో దిగబోతున్నారు.
దీంతో ఒక్కసారిగా పోటీ వేడెక్కిపోయింది. కొద్దిరోజుల క్రితమే ఇదే తేదీకి రవితేజ ఈగల్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 12 గుంటూరు కారం, హనుమాన్ తగ్గేదేలే అంటున్నాయి. విజయ్ దేవరకొండ 13ని ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజన్ ని మిస్ చేయనివ్వనని నిర్మాత దిల్ రాజు కంకణం కట్టుకున్నారు. సో ఎవరూ డ్రాప్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో థియేటర్ల సర్దుబాటుకి డిస్ట్రిబ్యూటర్లు కిందా మీదా పడాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే సలార్ డిసెంబర్ చివర్లో రావడమే చాలా మంచిదయ్యింది. లేదంటే జనవరి మొత్తం విపరీతంగా డిస్టర్బ్ అయ్యేది.
సైంధవ్ లాక్ చేసేసుకుంది కాబట్టి ప్రమోషన్లు ఎలా చేయాలనే దాని మీద టీమ్ దృష్టి పెట్టనుంది. కీలక భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వడంతో బ్యాలన్స్ మొత్తాన్ని వచ్చే నెలకు ఫినిష్ చేసి నవంబర్ నుంచి ప్రమోషన్ల మీద దృష్టి పెట్టబోతున్నారు. దర్శకుడు శైలేష్ కొలను బడ్జెట్, క్యాస్టింగ్ పరంగా చాలా పెద్ద స్కేల్ మీద సైంధవ్ ని రూపొందించాడు. చాలా గ్యాప్ తర్వాత వెంకటేష్ ఫుల్ యాక్షన్ మాస్ గెటప్ లో కనిపించడం దగ్గుబాటి ఫ్యాన్స్ కి ఎక్కడలేని ఉత్సాహం తెచ్చి పెట్టింది. శ్రద్ధ శ్రీనాధ్, రుహాని శర్మ, ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిక్, ఆండ్రియా ఇతర పాత్రలు పోషిస్తున్న సైంధవ్ కి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నాడు
This post was last modified on October 5, 2023 12:44 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…