ఊహించని విధంగా డిసెంబర్ 22ని సలార్ తీసేసుకోవడంతో ఆ డేట్ కి ముందు ప్లాన్ చేసుకున్న సినిమాలు వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. వాటిలో విక్టరీ వెంకటేష్ ప్యాన్ ఇండియా మూవీ సైంధవ్ కూడా ఉంది. పోస్ట్ పోన్ కు సంబంధించిన వార్త కొద్దిరోజుల క్రితమే వచ్చినప్పటికీ ఏ డేట్ ఉంటుందోనని అభిమానులు సంక్రాంతి మీద కాసింత అనుమానంగానే ఉన్నారు. దానికి చెక్ పెడుతూ నిర్మాతలు జనవరి 13 సైంధవ్ ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఎఫ్2 తర్వాత వెంకీ ఈ పండగ బరిలో దిగబోతున్నారు.
దీంతో ఒక్కసారిగా పోటీ వేడెక్కిపోయింది. కొద్దిరోజుల క్రితమే ఇదే తేదీకి రవితేజ ఈగల్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 12 గుంటూరు కారం, హనుమాన్ తగ్గేదేలే అంటున్నాయి. విజయ్ దేవరకొండ 13ని ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజన్ ని మిస్ చేయనివ్వనని నిర్మాత దిల్ రాజు కంకణం కట్టుకున్నారు. సో ఎవరూ డ్రాప్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో థియేటర్ల సర్దుబాటుకి డిస్ట్రిబ్యూటర్లు కిందా మీదా పడాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే సలార్ డిసెంబర్ చివర్లో రావడమే చాలా మంచిదయ్యింది. లేదంటే జనవరి మొత్తం విపరీతంగా డిస్టర్బ్ అయ్యేది.
సైంధవ్ లాక్ చేసేసుకుంది కాబట్టి ప్రమోషన్లు ఎలా చేయాలనే దాని మీద టీమ్ దృష్టి పెట్టనుంది. కీలక భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వడంతో బ్యాలన్స్ మొత్తాన్ని వచ్చే నెలకు ఫినిష్ చేసి నవంబర్ నుంచి ప్రమోషన్ల మీద దృష్టి పెట్టబోతున్నారు. దర్శకుడు శైలేష్ కొలను బడ్జెట్, క్యాస్టింగ్ పరంగా చాలా పెద్ద స్కేల్ మీద సైంధవ్ ని రూపొందించాడు. చాలా గ్యాప్ తర్వాత వెంకటేష్ ఫుల్ యాక్షన్ మాస్ గెటప్ లో కనిపించడం దగ్గుబాటి ఫ్యాన్స్ కి ఎక్కడలేని ఉత్సాహం తెచ్చి పెట్టింది. శ్రద్ధ శ్రీనాధ్, రుహాని శర్మ, ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిక్, ఆండ్రియా ఇతర పాత్రలు పోషిస్తున్న సైంధవ్ కి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నాడు
This post was last modified on October 5, 2023 12:44 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…