ఈ రోజుల్లో చిత్ర బృందాలు చాలా సీక్రెట్గా ఉంచాలనుకున్న విషయాలు కూడా ఏదో ఒక దశలో బయటికి వచ్చేస్తుంటాయి. చిత్ర బృందంలోని వాళ్లే ఎవరో ఒకరు మీడియాకు విషయం లీక్ చేయడం.. లేదా తమ సన్నిహితులతో విషయం చెబితే వాళ్లు ఇంకెవరితోనో పంచుకోవడం.. అలా సోషల్ మీడియా, మీడియాలో విషయం బట్టబయలు అయిపోవడం జరుగుతుంటుంది. అందులోనూ ఒక సినిమాను రెండు భాగాలుగా తీయాలని అనుకుంటే దాన్ని దాచడం చాలా చాలా కష్టమైపోతుంది.
ఈ పార్ట్-2 ట్రెండ్ మొదలయ్యాక అధికారిక ప్రకటన రావడానికి చాలా ముందే విషయం బయటికి వచ్చేస్తోంది. ఇలాంటి రోజుల్లో దేవర టీం అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. బుధవారం దర్శకుడు కొరటాల శివ స్వయంగా ప్రకటన చేసే వరకు ఎక్కడా ఈ విషయం అస్సలు లీక్ కాలేదు. ఇది ఎన్టీఆర్ అభిమానులకే కాదు.. మీడియా వాళ్లకు కూడా పెద్ద షాక్.
మీడియాకు విషయం చేరకుండా దేవర టీం ఎంత పకడ్బందీగా వ్యవహరించిందో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయంలో ఆ టీంను అభినందిస్తున్నారు. ఇక దేవర టీంను ఎప్పుడూ అప్డేట్ అప్డేట్ అంటూ వెంటపడే అభిమానులు.. తాము అస్సలు ఊహించని విధంగా పార్ట్-2 అప్డేట్ ఇవ్వడంతో ఒక రకమైన షాక్లో ఉన్నారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియని అయోమయం వారిలో కనిపిస్తోంది.
ముందు విషయాన్ని జీర్ణించుకుని ఆ తర్వాత తమ ఎగ్జైట్మెంట్ను పంచుకుందాం అనుకుంటున్నారు. దేవర మీద మామూలుగానే అంచనాలు ఒక రేంజిలో ఉండగా.. పార్ట్-2 అనౌన్స్ చేయడం, దాని గురించి చెబుతూ కొరటాల ఔట్పుట్ గురించి గొప్పగా మాట్లాడటంతో ఇంకా అంచనాలు పెరిగిపోయాయి అభిమానుల్లో. పార్ట్-1 అనుకున్నట్లే వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రాబోతుండగా.. ఇంకో ఏడాది లోపే పార్ట్-2ను కూడా తేవాలనుకుంటోంది దేవర టీం.
This post was last modified on October 4, 2023 10:55 pm
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు విద్యార్థులను అనుమతిస్తున్నారు. సమావేశాలను వారు ప్రత్యక్షంగా…