ఈ రోజుల్లో చిత్ర బృందాలు చాలా సీక్రెట్గా ఉంచాలనుకున్న విషయాలు కూడా ఏదో ఒక దశలో బయటికి వచ్చేస్తుంటాయి. చిత్ర బృందంలోని వాళ్లే ఎవరో ఒకరు మీడియాకు విషయం లీక్ చేయడం.. లేదా తమ సన్నిహితులతో విషయం చెబితే వాళ్లు ఇంకెవరితోనో పంచుకోవడం.. అలా సోషల్ మీడియా, మీడియాలో విషయం బట్టబయలు అయిపోవడం జరుగుతుంటుంది. అందులోనూ ఒక సినిమాను రెండు భాగాలుగా తీయాలని అనుకుంటే దాన్ని దాచడం చాలా చాలా కష్టమైపోతుంది.
ఈ పార్ట్-2 ట్రెండ్ మొదలయ్యాక అధికారిక ప్రకటన రావడానికి చాలా ముందే విషయం బయటికి వచ్చేస్తోంది. ఇలాంటి రోజుల్లో దేవర టీం అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. బుధవారం దర్శకుడు కొరటాల శివ స్వయంగా ప్రకటన చేసే వరకు ఎక్కడా ఈ విషయం అస్సలు లీక్ కాలేదు. ఇది ఎన్టీఆర్ అభిమానులకే కాదు.. మీడియా వాళ్లకు కూడా పెద్ద షాక్.
మీడియాకు విషయం చేరకుండా దేవర టీం ఎంత పకడ్బందీగా వ్యవహరించిందో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయంలో ఆ టీంను అభినందిస్తున్నారు. ఇక దేవర టీంను ఎప్పుడూ అప్డేట్ అప్డేట్ అంటూ వెంటపడే అభిమానులు.. తాము అస్సలు ఊహించని విధంగా పార్ట్-2 అప్డేట్ ఇవ్వడంతో ఒక రకమైన షాక్లో ఉన్నారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియని అయోమయం వారిలో కనిపిస్తోంది.
ముందు విషయాన్ని జీర్ణించుకుని ఆ తర్వాత తమ ఎగ్జైట్మెంట్ను పంచుకుందాం అనుకుంటున్నారు. దేవర మీద మామూలుగానే అంచనాలు ఒక రేంజిలో ఉండగా.. పార్ట్-2 అనౌన్స్ చేయడం, దాని గురించి చెబుతూ కొరటాల ఔట్పుట్ గురించి గొప్పగా మాట్లాడటంతో ఇంకా అంచనాలు పెరిగిపోయాయి అభిమానుల్లో. పార్ట్-1 అనుకున్నట్లే వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రాబోతుండగా.. ఇంకో ఏడాది లోపే పార్ట్-2ను కూడా తేవాలనుకుంటోంది దేవర టీం.
This post was last modified on October 4, 2023 10:55 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…