బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు ఒక కథను రెండు భాగాలుగా చెప్పడం ద్వారా కమర్షియల్గా ఎంత ప్రయోజనం పొందాయో తెలిసిందే. ఇదే బాటలో పుష్ప టీం కూడా ఒక కథతో రెండు సినిమాలు ప్లాన్ చేస్తే అది కూడా చాలా బాగా వర్కవుట్ అవుతోంది. దీంతో ఇదొక ట్రెండ్గా మారిపోతోందిప్పుడు. ముందు ఒక పార్ట్గానే సినిమాను మొదలుపెట్టడం.. మధ్యలో సినిమా మీద గురి కుదరడం.. కథ విస్తృతి పెరగడంతో రెండు భాగాలు చేయాలని ఆలోచన చేయడం.. కమర్షియల్గానూ ఇది బాగా లాభదాయకం అని గ్రహించి పార్ట్-2ను అనౌన్స్ చేయడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది.
తాజాగా ఈ జాబితాలో చేరిన సినిమా దేవర. నిన్నటిదాకా ఇది ఒక సినిమానే అనుకున్నారు. కానీ ఈ రోజు రెండో భాగం అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు దర్శకుడు కొరటాల శివ.
ప్రస్తుతం తెలుగులో ఇలా రెండు భాగాలుగా రాబోతున్న సినిమాల జాబితా చాలా పెద్దదిగానే కనిపిస్తోంది. ఆల్రెడీ పుష్ప-2 మేకింగ్ దశలో ఉండగా.. ఇప్పుడు దేవర ఆ జాబితాలో చేరింది. ప్రభాస్ సినిమా సలార్ను కూడా రెండు భాగాలుగా చేయబోతున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. తొలి భాగాన్ని సీజ్ఫైర్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ ఇంకో సినిమా కల్కి సైతం రెండు లేదా మూడు భాగాలుగా రావచ్చని అంటున్నారు.
దాని గురించి ఇంకా ప్రకటన అయితే రాలేదు. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ సినిమాలు రెంటిని రెండు భాగాలుగా చేసే ఆలోచనతో మేకర్స్ ఉన్నారట. అందులో ఓజీ ఒకటి కాగా.. ఇంకోటి హరిహర వీరమల్లు. ఇవి రెండూ రెండు భాగాలుగానే వస్తాయంటున్నారు. ఇక గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ చేసే సినిమాకు సైతం రెండో భాగం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి కాక టాలీవుడ్లో సీక్వెల్స్ జాబితా కూడా పెద్దదే. డీజే టిల్లు, గూఢచారి, ఇస్మార్ట్ శంకర్ సినిమాలకు సీక్వెల్స్ రాబోతుండగా.. అఖండ, స్కంద లాంటి సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on October 4, 2023 10:37 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…