బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు ఒక కథను రెండు భాగాలుగా చెప్పడం ద్వారా కమర్షియల్గా ఎంత ప్రయోజనం పొందాయో తెలిసిందే. ఇదే బాటలో పుష్ప టీం కూడా ఒక కథతో రెండు సినిమాలు ప్లాన్ చేస్తే అది కూడా చాలా బాగా వర్కవుట్ అవుతోంది. దీంతో ఇదొక ట్రెండ్గా మారిపోతోందిప్పుడు. ముందు ఒక పార్ట్గానే సినిమాను మొదలుపెట్టడం.. మధ్యలో సినిమా మీద గురి కుదరడం.. కథ విస్తృతి పెరగడంతో రెండు భాగాలు చేయాలని ఆలోచన చేయడం.. కమర్షియల్గానూ ఇది బాగా లాభదాయకం అని గ్రహించి పార్ట్-2ను అనౌన్స్ చేయడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది.
తాజాగా ఈ జాబితాలో చేరిన సినిమా దేవర. నిన్నటిదాకా ఇది ఒక సినిమానే అనుకున్నారు. కానీ ఈ రోజు రెండో భాగం అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు దర్శకుడు కొరటాల శివ.
ప్రస్తుతం తెలుగులో ఇలా రెండు భాగాలుగా రాబోతున్న సినిమాల జాబితా చాలా పెద్దదిగానే కనిపిస్తోంది. ఆల్రెడీ పుష్ప-2 మేకింగ్ దశలో ఉండగా.. ఇప్పుడు దేవర ఆ జాబితాలో చేరింది. ప్రభాస్ సినిమా సలార్ను కూడా రెండు భాగాలుగా చేయబోతున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. తొలి భాగాన్ని సీజ్ఫైర్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ ఇంకో సినిమా కల్కి సైతం రెండు లేదా మూడు భాగాలుగా రావచ్చని అంటున్నారు.
దాని గురించి ఇంకా ప్రకటన అయితే రాలేదు. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ సినిమాలు రెంటిని రెండు భాగాలుగా చేసే ఆలోచనతో మేకర్స్ ఉన్నారట. అందులో ఓజీ ఒకటి కాగా.. ఇంకోటి హరిహర వీరమల్లు. ఇవి రెండూ రెండు భాగాలుగానే వస్తాయంటున్నారు. ఇక గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ చేసే సినిమాకు సైతం రెండో భాగం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి కాక టాలీవుడ్లో సీక్వెల్స్ జాబితా కూడా పెద్దదే. డీజే టిల్లు, గూఢచారి, ఇస్మార్ట్ శంకర్ సినిమాలకు సీక్వెల్స్ రాబోతుండగా.. అఖండ, స్కంద లాంటి సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on October 4, 2023 10:37 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…